చాట్రాయిలో జరిగిన ప్రజా దర్బార్లో మంత్రి కొలుసు పార్థసారధి అధికారుల అలసత్వం పై అసహనం వ్యక్తం చేస్తూ తీవ్రంగా ఆగ్రహించారు
చాట్రాయిలో జరిగిన ప్రజా దర్బార్లో మంత్రి కొలుసు పార్థసారధి అధికారుల అలసత్వం పై అసహనం వ్యక్తం చేస్తూ తీవ్రంగా ఆగ్రహించారు
GADDAM JAGANMOHAN REDDY
తప్పులు చేస్తే చర్యలు తప్పవు మంత్రి పార్థసారధి
చనుబండ వీఆర్ఏ చాంద్ బాషా ను సస్పెండ్ చేయాలని సిఫార్సు చేసిన మంత్రి కొలుసు
చాట్రాయి తహశీల్దార్ బి బద్రు, విద్యుత్ ఏఈ డి సంజయ్, విస్సన్నపేట సబ్ రిజిస్ట్రార్ శ్రీనివాస రావు లపై ఆగ్రహం వ్యక్తం చేసిన మంత్రి కొలుసు పార్థసారథి
చాట్రాయి జనవరి 25 స్ధానికం న్యూస్ ఏపీ స్టేట్ బ్యూరో గడ్డం జగన్మోహన్ రెడ్డి
ఏలూరు జిల్లా నూజివీడు నియోజకవర్గం చాట్రాయి మండలం చాట్రాయి మండల పరిషత్ కార్యాలయంలో మంత్రి కొలుసు పార్థసారథి ఆధ్వర్యంలో నిర్వహించిన ప్రజా దర్బార్ కార్యక్రమంలో పలు సమస్యలతో ప్రజలు మంత్రి కి విన్నవించారు మేజర్ గా రెవెన్యూ సమస్యలు ఎక్కువ తలెత్తాయి మిగిలిన సమస్యలతో కొద్ది పాటి మంది వచ్చారు అందులో భాగంగా ఆరుగొలనుపేటకు సంబంధించి ఒక సమస్య పై విద్యుత్ ఏఈ డి సంజయ్ పై మంత్రి మండి పడ్డారు చనుబండ, నరసింహారావుపాలెం గ్రామాలలో రెవెన్యూ విషయమై పూర్వార్జితం బాపతు ఆస్తులను కుటుంబంలో ఒకతని పేరుపై ఆన్ లైన్ చేసి పాసుపుస్తకాలు ఇచ్చిన విషయమై తహశీల్దార్ ను మంత్రి వివరణ కోరగా కోర్టుకు వెళ్ళమని ఇచ్చిన సమాధానం పై మంత్రి తహశీల్దార్ బి బద్రు పై సీరియస్ అయ్యారు మీరు మీకు ఇష్టం వచ్చినట్లు ఆన్ లైన్ లలో ఎక్కించి బాధితులను కోర్టుల చుట్టూ తిరగమంటారా అంటూ వెంటనే చనుబండ వీఆర్ఏ చాంద్ బాషా ను సస్పెండ్ చేయాల్సిందిగా తహశీల్దార్ ను ఆదేశించారు ఒక రిజిస్ట్రేషన్ విషయం లో తప్పుడు సర్టిఫికెట్ లతో రిజిస్ట్రేషన్ ఎలా చేశావని విస్సన్నపేట సబ్ రిజిస్ట్రార్ కి వార్నింగ్ ఇచ్చారు రెండు రోజుల వ్యవధిలో రిజిస్ట్రేషన్ రద్దు చేయక పోతే భారీగా చర్యలు వుంటాయని హెచ్చరించారు నేరుగా ముఖ్యమంత్రి కే నీపై ఫిర్యాదు చేస్తానన్నారు.

















































పాఠకుల అభిప్రాయాలు
ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.
కామెంట్ను పోస్ట్ చేయండి