Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
నల్గొండలో మెడ్‌ప్లస్ మెడికల్ షాపు ప్రారంభం. ప్రజలకు నాణ్యమైన మందులు అందుబాటు ధరల్లో అందిస్తాం: నిర్వాహకులు నాణ్యత లేని భోజనం – అధికారుల నిర్లక్ష్యంపై కలెక్టర్‌కు వినతి పత్రం:- RSF,AISU విద్యార్థి సంఘాలు మహిళలు, చిన్నారుల భద్రతపై శక్తి టీమ్‌ల విస్తృత అవగాహన నేరం చేసిన వారు చట్టం నుంచి తప్పించుకోలేరు – జిల్లా ఎస్పీ ఎస్.సతీష్ కుమార్ రొద్దంలో ఘనంగా అనంతశక్తి సొసైటీ 27వ వార్షిక మహాసభ డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ కొత్తచెరువు లో జేసీ ప్రభాకర్ రెడ్డి పుట్టినరోజు వేడుకలు స్ఫూర్తి పెండ్లి పోలీసింగ్ క్రికెట్ టోర్నమెంట్ ను ప్రారంభించిన జిల్లా ఎస్పీ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ హనుమంతుని పూజలో పాల్గొన్న జనసేన నాయకులు, మార్కెట్ కమిటీ చైర్మన్ పూల శివప్రసాద్. ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: July 11, 2026 01:27 AM

చాట్రాయిలో జరిగిన ప్రజా దర్బార్లో మంత్రి కొలుసు పార్థసారధి అధికారుల అలసత్వం పై అసహనం వ్యక్తం చేస్తూ తీవ్రంగా ఆగ్రహించారు

చాట్రాయిలో జరిగిన ప్రజా దర్బార్లో మంత్రి కొలుసు పార్థసారధి అధికారుల అలసత్వం పై అసహనం వ్యక్తం చేస్తూ తీవ్రంగా ఆగ్రహించారు

చాట్రాయిలో జరిగిన ప్రజా దర్బార్లో మంత్రి కొలుసు పార్థసారధి అధికారుల అలసత్వం పై అసహనం వ్యక్తం చేస్తూ తీవ్రంగా ఆగ్రహించారు
January 25, 2026 12:19 PM 349 Views
Reporter
స్థానికం ప్రతినిధి : ఇంచార్జ్, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం
GADDAM JAGANMOHAN REDDY

తప్పులు చేస్తే చర్యలు తప్పవు మంత్రి పార్థసారధి


చనుబండ వీఆర్ఏ చాంద్ బాషా ను సస్పెండ్ చేయాలని సిఫార్సు చేసిన మంత్రి కొలుసు


చాట్రాయి తహశీల్దార్ బి బద్రు, విద్యుత్ ఏఈ డి సంజయ్, విస్సన్నపేట సబ్ రిజిస్ట్రార్ శ్రీనివాస రావు లపై ఆగ్రహం వ్యక్తం చేసిన మంత్రి కొలుసు పార్థసారథి

చాట్రాయి జనవరి 25 స్ధానికం న్యూస్ ఏపీ స్టేట్ బ్యూరో గడ్డం జగన్మోహన్ రెడ్డి

ఏలూరు జిల్లా నూజివీడు నియోజకవర్గం చాట్రాయి మండలం చాట్రాయి మండల పరిషత్ కార్యాలయంలో మంత్రి కొలుసు పార్థసారథి ఆధ్వర్యంలో నిర్వహించిన ప్రజా దర్బార్ కార్యక్రమంలో పలు సమస్యలతో ప్రజలు మంత్రి కి విన్నవించారు మేజర్ గా రెవెన్యూ సమస్యలు ఎక్కువ తలెత్తాయి మిగిలిన సమస్యలతో కొద్ది పాటి మంది వచ్చారు అందులో భాగంగా ఆరుగొలనుపేటకు సంబంధించి ఒక సమస్య పై విద్యుత్ ఏఈ డి సంజయ్ పై మంత్రి మండి పడ్డారు చనుబండ, నరసింహారావుపాలెం గ్రామాలలో రెవెన్యూ విషయమై పూర్వార్జితం బాపతు ఆస్తులను కుటుంబంలో ఒకతని పేరుపై ఆన్ లైన్ చేసి పాసుపుస్తకాలు ఇచ్చిన విషయమై తహశీల్దార్ ను మంత్రి వివరణ కోరగా కోర్టుకు వెళ్ళమని ఇచ్చిన సమాధానం పై మంత్రి తహశీల్దార్ బి బద్రు పై సీరియస్ అయ్యారు మీరు మీకు ఇష్టం వచ్చినట్లు ఆన్ లైన్ లలో ఎక్కించి బాధితులను కోర్టుల చుట్టూ తిరగమంటారా అంటూ వెంటనే చనుబండ వీఆర్ఏ చాంద్ బాషా ను సస్పెండ్ చేయాల్సిందిగా తహశీల్దార్ ను ఆదేశించారు ఒక రిజిస్ట్రేషన్ విషయం లో తప్పుడు సర్టిఫికెట్ లతో రిజిస్ట్రేషన్ ఎలా చేశావని విస్సన్నపేట సబ్ రిజిస్ట్రార్ కి వార్నింగ్ ఇచ్చారు రెండు రోజుల వ్యవధిలో రిజిస్ట్రేషన్ రద్దు చేయక పోతే భారీగా చర్యలు వుంటాయని హెచ్చరించారు నేరుగా ముఖ్యమంత్రి కే నీపై ఫిర్యాదు చేస్తానన్నారు.

మీ స్పందన? 2 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.


కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News