చాట్రాయిలో ఎస్ టి యు ఆధ్వర్యంలో తాహసిల్దార్ కు వినతి పత్రం
చాట్రాయిలో ఎస్ టి యు ఆధ్వర్యంలో తాహసిల్దార్ కు వినతి పత్రం
GADDAM JAGANMOHAN REDDY
చాట్రాయి జనవరి 30(స్ధానికం న్యూస్ ఏపీ స్టేట్ బ్యూరో గడ్డం జగన్మోహన్ రెడ్డి) ఏలూరు జిల్లా నూజివీడు నియోజకవర్గం చాట్రాయి మండలం చాట్రాయిలో ఎస్టీయు ఆధ్వర్యంలో సరెండర్ లీవ్ బకాయిలను వెంటనే చెల్లించాలని రిటైర్డ్ మెంట్ బెనిఫిట్స్ ను వెంటనే చెల్లించాలని 12వ పి.ఆర్.సికి కమిషన్ను నియమించాలని, పదవీ విరమణ చేసిన మరుసటి రోజునే పెన్షన్ సౌలుభ్యాలు చెల్లించాలని, పెండింగు డీఎలు విడుదల చేయాలని, డిఏ బకాయిలను చెల్లించాలని, 2003 డిఎస్సి ఉపాధ్యాయులకు పాత పెన్షన్ సౌకర్యాన్ని వర్తింప చేయాలని, సిపిఎస్ రద్దు పై వెంటనే నిర్ణయం తీసుకొని పాత పెన్షన్ పునరుద్ధరించాలని, 30% మధ్యంతర భృతి (ఐఆర్) ప్రకటించాలని, 11వ పిఆర్సి బకాయిలను వెంటనే చెల్లించాలని, కోరుతూ తహశీల్దార్ కు వినతి పత్రం అందజేశారు ఈ కార్యక్రమంలో జి. రాము ఎస్టీయు జిల్లా ఆర్థిక కార్యదర్శి, స్టేట్ కౌన్సిలర్, ఎస్కే మహబు, యం. పుల్లారావు అడిషనల్ జనరల్ సెక్రటరీ, మండల అధ్యక్షులు జి అమరయ్య ప్రధాన కార్యదర్శి ఎస్. నరసింహ రావు తదితరులు పాల్గొన్నారు

















































పాఠకుల అభిప్రాయాలు
ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.
కామెంట్ను పోస్ట్ చేయండి