PRINT TIME: July 10, 2026 11:28 PM
చాట్రాయిలో చెరువులో పడి యువకుడు మృతి
చాట్రాయిలో చెరువులో పడి యువకుడు మృతి
March 11, 2026 10:14 PM
516 Views
స్థానికం ప్రతినిధి :
ఇంచార్జ్, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం
GADDAM JAGANMOHAN REDDY
ఏలూరు జిల్లా, నూజివీడు నియోజకవర్గం, చాట్రాయి మండలం చాట్రాయి గ్రామంలో విషాద ఘటన చోటుచేసుకుంది. గ్రామానికి చెందిన అంబటి గోపి కుమారుడు అనుదీప్ (17) చెరువులో పడి మృతి చెందాడు. గ్రామంలోని దీప చెరువులో అనుదీప్ పడిపోవడంతో ఈ ఘటన జరిగింది.
యువకుడు చెరువులో పడి మృతి చెందాడనే విషయం తెలిసిన వెంటనే కుటుంబ సభ్యులు, బంధువులు సంఘటనా స్థలానికి చేరుకుని బోరున విలపించారు. ఒక్కసారిగా ఈ ఘటన జరగడంతో గ్రామంలో విషాద ఛాయలు అలుముకున్నాయి.
సమాచారం అందుకున్న చాట్రాయి పోలీసులు ఘటన స్థలానికి చేరుకుని మృతదేహాన్ని పరిశీలించారు. కేసు నమోదు చేసి ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలపై దర్యాప్తు చేపట్టినట్లు పోలీసులు తెలిపారు. యువకుడు చెరువులో పడటానికి గల కారణాలు ఇంకా తెలియాల్సి ఉంది.















































పాఠకుల అభిప్రాయాలు
ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.
కామెంట్ను పోస్ట్ చేయండి