చాట్రాయిలో భూసార పరీక్ష పత్రాలను పంపిణీ చేసిన మండల వ్యవసాయ అధికారి బి శివశంకర్
చాట్రాయిలో భూసార పరీక్ష పత్రాలను పంపిణీ చేసిన మండల వ్యవసాయ అధికారి బి శివశంకర్
GADDAM JAGANMOHAN REDDY
ఏలూరు జిల్లా చాట్రా మండలంలోని ఖరీఫ్ 2025 సీజన్లో సేకరించిన 1250 మట్టి నమూనాలను విశ్లేషించి భూసార పరిరక్షణ పథకం కింద భూసార పరీక్ష పత్రములను రైతులకు రైతు సేవ కేంద్రాల వద్ద అందించడం జరుగుతుందని, రైతులకు మట్టి నమూనాలను పరీక్షించడం వల్ల రైతుల భూసారాన్ని అర్థం చేసుకొని అవసరమైన ఎరువులను మాత్రమే వాడి పెట్టుబడి ఖర్చును తగ్గించుకోవచ్చని, పంట దిగుబడిని పెంచుకోవచ్చని, నేలతత్వం ఆమ్లం మరియు క్షారము స్వభావం తెలుసుకోవడం ద్వారా భూమిని నిసారం కాకుండా కాపాడుకోవచ్చని, సూక్ష్మ పోషకాలు లోపం ఉన్న యెడల గుర్తించి వాటిని నివారించవచ్చని, కావున రైతులు భూసార పరీక్షలు ద్వారా నేలల్లో ఉండే పోషకాలను తెలుసుకొని వ్యవసాయ పద్ధతులను అవలంబించాలని మండల వ్యవసాయాధికారి బి శివశంకర్ తెలియజేశారు. ఈరోజు చాట్రాయి గ్రామంలోని రైతులకు కొవ్వూరి లింగయ్య మరియు కోట జోజి రైతులకు మరియు ఇతర రైతులకు భూసార పరీక్ష పత్రములను పంపిణీ చేసినట్లు తెలియజేశారు

















































పాఠకుల అభిప్రాయాలు
ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.
కామెంట్ను పోస్ట్ చేయండి