Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
ఈడెన్‌లో ముకుల్ 'తుపాన్'.. లక్నో సూపర్ విక్టరీ! ధాన్యం కొనుగోలు కేంద్రం పరిశీలించిన ఏఈఓ మురళి ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు “ఆయన స్వతంత్ర మార్గంలో ప్రయాణిస్తే దేశవ్యాప్తంగా ఒక కొత్త యువ కేంద్రీకృత రాజకీయ శక్తిగా ఎదుగుతారు” “పూరీ ఆలయం కింద బయటపడ్డ పురాతన భూగర్భ నగరం: జగన్నాథుడి ‘మూలాలు’ ఇప్పుడు ప్రపంచం ముందుకు” రంగేపల్లిలో అవగాహన సదస్సు విజయవంతం రంగేపల్లిలో అవగాహన సదస్సు విజయవంతం “గురుకుల ఔట్‌సోర్సింగ్, గెస్ట్, కాంట్రాక్ట్ టీచర్లకు ఉద్యోగ భద్రత, 12 నెలల జీతాలు కల్పించాలి: సిఐటియు డిమాండ్” “జర్మనీ హైడ్రోజన్ రైళ్లు: పర్యావరణానికి శుభసూచి కలిగించే భవిష్యత్తు టెక్నాలజీ” “64 గ్రాముల సృష్టిలో అంతరిక్ష చరిత్ర: కలాంసాట్ వెనుక రిఫత్ షారూక్ సంచలనం” ఓటీటీలోకి వాలెంటైన్స్ డే హిట్ 'పూకీ'.. కుర్రకారును ఫిదా చేసిన జెన్-జీ లవ్ స్టోరీ! రికార్డు స్థాయిలో 'స్థానికం' ప్రభంజనం: 5 లక్షల మంది పాఠకుల నమ్మకం.. తెలుగులో నంబర్ 1 లోకల్ న్యూస్ డెస్టినేషన్!
Sthanikam
PRINT TIME: April 10, 2026 12:56 AM

చాట్రాయిలో 22 మంది రైతులకు షాక్‌… మోటార్ కేబుల్ వైర్లు చోరీ

చాట్రాయిలో 22 మంది రైతులకు షాక్‌… మోటార్ కేబుల్ వైర్లు చోరీ

 చాట్రాయిలో 22 మంది రైతులకు షాక్‌… మోటార్ కేబుల్ వైర్లు చోరీ
February 20, 2026 08:40 AM 204 Views
Reporter
స్థానికం ప్రతినిధి : ఇంచార్జ్, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం
GADDAM JAGANMOHAN REDDY

ఏలూరు జిల్లా నూజివీడు నియోజకవర్గం చాట్రాయి మండలం స్థానిక చాట్రాయి లో ఒకేసారి 22 మంది రైతులకు సంబంధించిన మోటార్ కేబుల్ వైర్లు చోరీకి గురయ్యాయి. మండల కేంద్రమైన చాట్రాయి గ్రామానికి చెందిన గడ్డం నాగ వెంకట సత్యనారాయణ రెడ్డి, పాములపాటి నరసింహారెడ్డి,అప్పి రెడ్డి, సవరం శ్రీను, పాములపాటి శ్రీనివాసరెడ్డిలతో పాటు మరో కొంత మంది రైతుల వ్యవసాయ మోటార్ల పంపు సెట్లు కు వెళ్ళు కేబుల్ వైర్లు చోరీకి గురయ్యాయి. గురువారం ఉదయం తోటలోకి వెళ్లి చూడగా మోటార్ వైర్లు పూర్తిగా కట్ చేసి తీసుకు వెళ్లినట్లు రైతులు స్థానిక పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేశారు. ఈ ప్రాంతంలో గతంలో కూడా వైర్లు చోరి చేయటం పరిపాటిగా మారిందని, కరెంటు పని తెలిసినవారు రాత్రి సమయాలలో ఈ విధంగా చోరీలకు పాల్పడుతున్నారని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. గత కొంతకాలంగా కొంతమంది వ్యక్తులు చాట్రాయి మండలంలో ఇదే వృత్తిగా ఎంచుకొని ఏదో ఒక గ్రామంలో ఏదో ఒక ప్రాంతంలో ఈ విధమైనటువంటి చోరీలకు పాల్పడుతున్నట్లు మండలంలోని వివిధ గ్రామాల రైతులు తెలియజేస్తున్నారు. పోయిన నెలలో నరసింహారావుపాలెం గ్రామంలో కూడా ఇదే తరహాలో అనేకమంది రైతుల మోటారు బోర్లకు సంబంధించిన కేబుల్ వైర్లను అపహరించినట్లు రైతులు తెలియజేశారు అసలే కరెంటు కోతలతో రాత్రి సమయాలలో ఇస్తున్న కరెంటుతో రైతులు నానా ఇబ్బందులు పడుతుంటే గోటిచుట్టపై రోకలిపోటులా ఈ వ్యవహార శైలి మారిందని, పోలీసు వారు సీసీ కెమెరాలు ఏర్పాటు లాంటి వాటిపై ప్రత్యేకమైన దృష్టి సారించి ఈ దొంగతనాలను అరికట్టకపోతే మున్ముందు రైతులు తీవ్ర పరిస్థితులను ఎదుర్కోవాల్సి వస్తుందని, ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. వైర్లు చోరీ దొంగలను పట్టుకొని కఠినంగా శిక్షిస్తే తప్ప చోరీలు ఆగవని పలువురు రైతులు అభిప్రాయపడుతున్నారు. ప్రత్యేక నిఘా బృందాన్ని ఏర్పాటు చేసి తగిన చర్యలు తీసుకొని రైతులకు న్యాయం చేయాలని కోరుతున్నారు

మీ స్పందన? 1 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.


కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News