Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
నల్గొండలో మెడ్‌ప్లస్ మెడికల్ షాపు ప్రారంభం. ప్రజలకు నాణ్యమైన మందులు అందుబాటు ధరల్లో అందిస్తాం: నిర్వాహకులు నాణ్యత లేని భోజనం – అధికారుల నిర్లక్ష్యంపై కలెక్టర్‌కు వినతి పత్రం:- RSF,AISU విద్యార్థి సంఘాలు మహిళలు, చిన్నారుల భద్రతపై శక్తి టీమ్‌ల విస్తృత అవగాహన నేరం చేసిన వారు చట్టం నుంచి తప్పించుకోలేరు – జిల్లా ఎస్పీ ఎస్.సతీష్ కుమార్ రొద్దంలో ఘనంగా అనంతశక్తి సొసైటీ 27వ వార్షిక మహాసభ డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ కొత్తచెరువు లో జేసీ ప్రభాకర్ రెడ్డి పుట్టినరోజు వేడుకలు స్ఫూర్తి పెండ్లి పోలీసింగ్ క్రికెట్ టోర్నమెంట్ ను ప్రారంభించిన జిల్లా ఎస్పీ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ హనుమంతుని పూజలో పాల్గొన్న జనసేన నాయకులు, మార్కెట్ కమిటీ చైర్మన్ పూల శివప్రసాద్. ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: July 11, 2026 05:15 AM

చాట్రాయిలో 22 మంది రైతులకు షాక్‌… మోటార్ కేబుల్ వైర్లు చోరీ

చాట్రాయిలో 22 మంది రైతులకు షాక్‌… మోటార్ కేబుల్ వైర్లు చోరీ

 చాట్రాయిలో 22 మంది రైతులకు షాక్‌… మోటార్ కేబుల్ వైర్లు చోరీ
February 20, 2026 08:40 AM 214 Views
Reporter
స్థానికం ప్రతినిధి : ఇంచార్జ్, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం
GADDAM JAGANMOHAN REDDY

ఏలూరు జిల్లా నూజివీడు నియోజకవర్గం చాట్రాయి మండలం స్థానిక చాట్రాయి లో ఒకేసారి 22 మంది రైతులకు సంబంధించిన మోటార్ కేబుల్ వైర్లు చోరీకి గురయ్యాయి. మండల కేంద్రమైన చాట్రాయి గ్రామానికి చెందిన గడ్డం నాగ వెంకట సత్యనారాయణ రెడ్డి, పాములపాటి నరసింహారెడ్డి,అప్పి రెడ్డి, సవరం శ్రీను, పాములపాటి శ్రీనివాసరెడ్డిలతో పాటు మరో కొంత మంది రైతుల వ్యవసాయ మోటార్ల పంపు సెట్లు కు వెళ్ళు కేబుల్ వైర్లు చోరీకి గురయ్యాయి. గురువారం ఉదయం తోటలోకి వెళ్లి చూడగా మోటార్ వైర్లు పూర్తిగా కట్ చేసి తీసుకు వెళ్లినట్లు రైతులు స్థానిక పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేశారు. ఈ ప్రాంతంలో గతంలో కూడా వైర్లు చోరి చేయటం పరిపాటిగా మారిందని, కరెంటు పని తెలిసినవారు రాత్రి సమయాలలో ఈ విధంగా చోరీలకు పాల్పడుతున్నారని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. గత కొంతకాలంగా కొంతమంది వ్యక్తులు చాట్రాయి మండలంలో ఇదే వృత్తిగా ఎంచుకొని ఏదో ఒక గ్రామంలో ఏదో ఒక ప్రాంతంలో ఈ విధమైనటువంటి చోరీలకు పాల్పడుతున్నట్లు మండలంలోని వివిధ గ్రామాల రైతులు తెలియజేస్తున్నారు. పోయిన నెలలో నరసింహారావుపాలెం గ్రామంలో కూడా ఇదే తరహాలో అనేకమంది రైతుల మోటారు బోర్లకు సంబంధించిన కేబుల్ వైర్లను అపహరించినట్లు రైతులు తెలియజేశారు అసలే కరెంటు కోతలతో రాత్రి సమయాలలో ఇస్తున్న కరెంటుతో రైతులు నానా ఇబ్బందులు పడుతుంటే గోటిచుట్టపై రోకలిపోటులా ఈ వ్యవహార శైలి మారిందని, పోలీసు వారు సీసీ కెమెరాలు ఏర్పాటు లాంటి వాటిపై ప్రత్యేకమైన దృష్టి సారించి ఈ దొంగతనాలను అరికట్టకపోతే మున్ముందు రైతులు తీవ్ర పరిస్థితులను ఎదుర్కోవాల్సి వస్తుందని, ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. వైర్లు చోరీ దొంగలను పట్టుకొని కఠినంగా శిక్షిస్తే తప్ప చోరీలు ఆగవని పలువురు రైతులు అభిప్రాయపడుతున్నారు. ప్రత్యేక నిఘా బృందాన్ని ఏర్పాటు చేసి తగిన చర్యలు తీసుకొని రైతులకు న్యాయం చేయాలని కోరుతున్నారు

మీ స్పందన? 1 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.


కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News