చాట్రాయి రెవెన్యూ సిబ్బంది కి ప్రశంసా పత్రాలు అందజేసిన కలెక్టర్ ఎస్పీ
చాట్రాయి రెవెన్యూ సిబ్బంది కి ప్రశంసా పత్రాలు అందజేసిన కలెక్టర్ ఎస్పీ
GADDAM JAGANMOHAN REDDY
చాట్రాయి జనవరి 27(స్ధానికం న్యూస్ ఏపీ స్టేట్ బ్యూరో గడ్డం జగన్మోహన్ రెడ్డి)ఏలూరు జిల్లా నూజివీడు నియోజకవర్గం చాట్రాయి మండలం తుమ్మగూడెం వీఆర్వో గా పని చేస్తున్న వినోద్, కృష్ణారావు పాలెం వీఆర్ఎగా పనిచేస్తున్న షేక్ సైదులు తహసిల్దార్ కార్యాలయంలో కంప్యూటర్ ఆపరేటర్ గా పనిచేస్తున్న విక్రమ్ లకు 77వ గణతంత్ర దినోత్సవం సందర్భంగా మండలంలో ప్రజలకు ఉత్తమ సేవలు అందించినందుకు ప్రతిభా పురస్కార ప్రశంసా పత్రాలను ఏలూరు జిల్లా కలెక్టర్ వెట్రి సెల్వి, మరియు ఎస్పీ కె ప్రతాప్ శివకిషోర్ లు అందజేశారు సందర్భంగా వారు మాట్లాడుతూ తాము ప్రజలకు చేసిన సేవలకు గుర్తింపుగా కలెక్టర్, ఎస్పీ ల ద్వారా ప్రశంసా పత్రం తీసుకున్నందుకు సంతోషంగా ఉందని తమపై ఇంకా బాధ్యత పెరిగిందని ప్రజలకు మరింత చేరువై ఎక్కువ సేవలు అందిస్తామని, ఈ ప్రశంస పత్రం తమకు రావడానికి సహకరించిన వారందరికీ కృతజ్ఞతలు తెలియజేస్తున్నట్లు తెలియజేశారు

















































పాఠకుల అభిప్రాయాలు
ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.
కామెంట్ను పోస్ట్ చేయండి