చాట్రాయి మండలంలో ప్రతి గ్రామంలో బీజేపీ జెండా దిమ్మకు స్ధలం కేటాయించి అనుమతి ఇవ్వమని తహశీల్దార్ ని కోరిన బీజేపీ నేత బుర్రి శ్రీకర్
చాట్రాయి మండలంలో ప్రతి గ్రామంలో బీజేపీ జెండా దిమ్మకు స్ధలం కేటాయించి అనుమతి ఇవ్వమని తహశీల్దార్ ని కోరిన బీజేపీ నేత బుర్రి శ్రీకర్
GADDAM JAGANMOHAN REDDY
చాట్రాయి జనవరి 23(స్ధానికం న్యూస్ ఏపీ స్టేట్ బ్యూరో గడ్డం జగన్మోహన్ రెడ్డి) ఏలూరు జిల్లా నూజివీడు నియోజకవర్గం చాట్రాయి మండలంలో ప్రతి గ్రామపంచాయతీ కూడలిల నందు బీజేపీ జెండా దిమ్మలు నిర్మాణానికి స్థలం కేటాయించి పర్మిషన్ ఇప్పించవలసిందిగా చాట్రాయి మండల డిప్యూటీ తహశీల్దార్ బి ఈశ్వర్ కి బీజేపీ జిల్లా దళిత మోర్చా అధ్యక్షులు బుర్రి శ్రీకర్ వినతి పత్రం అందజేశారు, సందర్భంగా మాట్లాడుతూ మన ఊరు మన జెండా కార్యక్రమంలో భాగంగా రాష్ట్ర బిజెపి అధ్యక్షులు పివిఎన్ మాధవ్ ఆదేశాల మేరకు రాష్ట్రంలోని అన్ని జిల్లాల మండలాల గ్రామాల కూడలిలలో భారతీయ జనతా పార్టీ జెండా దిమ్మలు నిర్మించి వాటిని ఆవిష్కరించి బిజెపిని గ్రామస్థాయిలో బలోపేతం చేసే కార్యక్రమం లో భాగంగా అందజేసినట్లు తెలియజేశారు అలాగే చాట్రాయి మండల కేంద్రం కూడలి నందు భారత మాజీ ప్రధాని భారతరత్న అటల్ బిహారీ వాజ్పేయి విగ్రహ నిర్మాణానికి కూడా స్థలం కేటాయించాలని కోరినట్లు తెలియజేశారు

















































పాఠకుల అభిప్రాయాలు
ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.
కామెంట్ను పోస్ట్ చేయండి