చాట్రాయి మండలం లో వ్యవసాయ శాఖ ఆధ్వర్యంలో మట్టి నమూనా సేకరణ ఏవో బి శివశంకర్
చాట్రాయి మండలం లో వ్యవసాయ శాఖ ఆధ్వర్యంలో మట్టి నమూనా సేకరణ ఏవో బి శివశంకర్
GADDAM JAGANMOHAN REDDY
ఏలూరు జిల్లా నూజివీడు నియోజకవర్గం చాట్రాయి మండలంలోని ప్రకృతి వ్యవసాయం చేసిన రైతుల భూముల్లో మట్టి నమూనాలను సేకరిస్తున్నారని, చాట్రాయి మండలంలోని 1,080 మట్టి నమూనాలను సేకరించుటకు టార్గెట్ ఇవ్వడం జరిగిందని, కావున మండలంలోని అందరూ గ్రామస్థాయి అగ్రికల్చర్/ఉద్యానవన అసిస్టెంట్లు మరియు పకృతి వ్యవసాయ సిబ్బంది కలిసి మట్టి నమూనాలను సేకరించడం జరుగుతుందని, మట్టి నమూనాలను భూసార పరీక్ష కేంద్రాల ద్వారా పరీక్ష చేయించడం ద్వారా రైతులకు వారి భూముల నందు మట్టిలోని నిక్షిప్తం అయిన నత్రజని, భాస్వరం, పోటాష్ ముఖ్యంగా సేంద్రీయ కార్బన్ శాతం ఎంత ఉందో తెలియడం ద్వారా రైతులు దాని ఆధారంగా ఎరువుల వాడకాన్ని తగ్గించి సేంద్రియ వ్యవసాయంపై మక్కువ చూపించి రైతులు పకృతి వ్యవసాయంపై దృష్టి సాధించాలని, చాట్రాయలోని ప్రకృతి వ్యవసాయం చేయు చల్లారి రామకృష్ణ రైతు పొలంలో మట్టి నమూనా తీయుట పరిశీలించడం జరిగిందని, మండల వ్యవసాయాధికారి బి శివశంకర్ తెలియజేశారు. ఈ కార్యక్రమంలో ప్రకృతి వ్యవసాయ సిబ్బంది అందే రాంబాబు మరియు పలగాని చక్రధర్ రావు పాల్గొన్నారు.

















































పాఠకుల అభిప్రాయాలు
ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.
కామెంట్ను పోస్ట్ చేయండి