Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
నల్గొండలో మెడ్‌ప్లస్ మెడికల్ షాపు ప్రారంభం. ప్రజలకు నాణ్యమైన మందులు అందుబాటు ధరల్లో అందిస్తాం: నిర్వాహకులు నాణ్యత లేని భోజనం – అధికారుల నిర్లక్ష్యంపై కలెక్టర్‌కు వినతి పత్రం:- RSF,AISU విద్యార్థి సంఘాలు మహిళలు, చిన్నారుల భద్రతపై శక్తి టీమ్‌ల విస్తృత అవగాహన నేరం చేసిన వారు చట్టం నుంచి తప్పించుకోలేరు – జిల్లా ఎస్పీ ఎస్.సతీష్ కుమార్ రొద్దంలో ఘనంగా అనంతశక్తి సొసైటీ 27వ వార్షిక మహాసభ డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ కొత్తచెరువు లో జేసీ ప్రభాకర్ రెడ్డి పుట్టినరోజు వేడుకలు స్ఫూర్తి పెండ్లి పోలీసింగ్ క్రికెట్ టోర్నమెంట్ ను ప్రారంభించిన జిల్లా ఎస్పీ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ హనుమంతుని పూజలో పాల్గొన్న జనసేన నాయకులు, మార్కెట్ కమిటీ చైర్మన్ పూల శివప్రసాద్. ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: July 10, 2026 10:17 PM

చాట్రాయి మండలంలో పదో తరగతి పరీక్షలకు సిద్ధం – రెండు కేంద్రాల్లో 372 మంది విద్యార్థులు. మండల విద్యాశాఖాధికారి 2 మాసగిరి శ్రీనివాస్

చాట్రాయి మండలంలో పదో తరగతి పరీక్షలకు సిద్ధం – రెండు కేంద్రాల్లో 372 మంది విద్యార్థులు. మండల విద్యాశాఖాధికారి 2 మాసగిరి శ్రీనివాస్

చాట్రాయి మండలంలో పదో తరగతి పరీక్షలకు సిద్ధం – రెండు కేంద్రాల్లో 372 మంది విద్యార్థులు. మండల విద్యాశాఖాధికారి 2 మాసగిరి శ్రీనివాస్
March 15, 2026 08:34 PM 53 Views
Reporter
స్థానికం ప్రతినిధి : ఇంచార్జ్, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం
GADDAM JAGANMOHAN REDDY

ఏలూరు జిల్లా నూజివీడు నియోజకవర్గం చాట్రాయి మండలంలో పదో తరగతి పబ్లిక్ పరీక్షల నిర్వహణకు విద్యాశాఖ అధికారులు అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు. మండలంలోని విద్యార్థుల సౌకర్యార్థం రెండు పరీక్షా కేంద్రాలను ఏర్పాటు చేసినట్లు మండల విద్యాశాఖ అధికారి మాసగిరి శ్రీనివాస్ తెలిపారు.

ఒక కేంద్రాన్ని ఆర్సియం ప్రాథమికోన్నత పాఠశాలలో, మరొకదాన్ని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల చాట్రాయిలో ఏర్పాటు చేశారు. ఈ రెండు పరీక్షా కేంద్రాల్లో కలిపి మొత్తం 372 మంది విద్యార్థులు పరీక్షలు రాయనున్నారు. పరీక్షల నిర్వహణ కోసం మొత్తం 18 మంది ఇన్విజిలేటర్లను నియమించినట్లు అధికారులు వెల్లడించారు.

విద్యార్థులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా తాగునీరు, కూర్చునే ఏర్పాట్లు, శుభ్రత వంటి అన్ని సౌకర్యాలను కల్పించినట్లు తెలిపారు. పరీక్షలు ప్రశాంతంగా సాగేందుకు పోలీస్ శాఖ సహకారం కూడా తీసుకున్నామని, అవసరమైన వైద్య సహాయం అందుబాటులో ఉండేలా వైద్య శాఖతో సమన్వయం చేసుకున్నామని మండల విద్యాశాఖ అధికారి మాసగిరి శ్రీనివాస్ పేర్కొన్నారు.

పరీక్షలు ఎటువంటి అవాంఛనీయ ఘటనలు లేకుండా సజావుగా నిర్వహించేందుకు అన్ని విభాగాలు సమన్వయంతో పనిచేస్తున్నట్లు ఆయన తెలిపారు.

మీ స్పందన? 1 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.


కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News