PRINT TIME: April 11, 2026 03:19 PM
చాట్రాయి ఇన్చార్జ్ ఎంపీడీవో గా చేకు చిన్న రాట్నాలు
చాట్రాయి ఇన్చార్జ్ ఎంపీడీవో గా చేకు చిన్న రాట్నాలు
February 09, 2026 08:33 PM
85 Views
స్థానికం ప్రతినిధి :
ఇంచార్జ్, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం
GADDAM JAGANMOHAN REDDY
ఏలూరు జిల్లా నూజివీడు నియోజకవర్గం చాట్రాయి మండలానికి ఇన్చార్జి ఎంపీడీవోగా చేకు చిన్న రత్నాలు బాధ్యతలు స్వీకరించారు. ప్రస్తుతం ఎన్టీఆర్ జిల్లా తిరువూరు నియోజకవర్గం విస్సన్నపేట ఎంపీడీవోగా పనిచేస్తున్న ఆయనకు చాట్రాయి మండలానికి అదనపు బాధ్యతలు అప్పగించారు.బాధ్యతలు స్వీకరించిన అనంతరం ఆయన మాట్లాడుతూ, సాధ్యమైనంత వరకు ప్రజలకు కార్యాలయంలో అందుబాటులో ఉంటూ మండల అభివృద్ధికి కృషి చేస్తానన్నారు. ప్రభుత్వ పథకాలు అర్హులైన లబ్ధిదారులకు సక్రమంగా అందేలా చర్యలు తీసుకుంటామని తెలిపారు.మండల పరిపాలనలో పారదర్శకతతో పాటు సమన్వయంతో పనిచేస్తూ అభివృద్ధి కార్యక్రమాలను వేగవంతం చేస్తామని స్పష్టం చేశారు. ప్రజా సమస్యల పరిష్కారమే లక్ష్యంగా పనిచేస్తానని పేర్కొన్నారు.

















































పాఠకుల అభిప్రాయాలు
ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.
కామెంట్ను పోస్ట్ చేయండి