చాట్రాయి జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో శ్రీ పంచమి మరియు సుభాష్ చంద్రబోస్ జయంతి కార్యక్రమం నిర్వహించిన ప్రధానోపాధ్యాయులు డి కృష్ణయ్య
చాట్రాయి జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో శ్రీ పంచమి మరియు సుభాష్ చంద్రబోస్ జయంతి కార్యక్రమం నిర్వహించిన ప్రధానోపాధ్యాయులు డి కృష్ణయ్య
GADDAM JAGANMOHAN REDDY
చాట్రాయి జనవరి 23(స్ధానికం న్యూస్ ఏపీ స్టేట్ బ్యూరో గడ్డం జగన్మోహన్ రెడ్డి) ఏలూరు జిల్లా నూజివీడు నియోజకవర్గం చాట్రాయి మండలం స్థానిక జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో శ్రీ పంచమి ఉత్సవం మరియు నేతాజీ సుభాష్ చంద్రబోస్ జయంతి కార్యక్రమాలను ఘనంగా ప్రధానోపాధ్యాయులు ధారావతు కృష్ణయ్య ఆధ్వర్యంలో నిర్వహించారు. శ్రీ పంచమి సందర్భంగా ఉపాధ్యాయిని, ఉపాధ్యాయులు బి. నీల, జి.అమరయ్య, జి సత్యనారాయణ రెడ్డి లు పర్వదినం విశిష్టత గురించి విద్యార్థులకు వివరించారు, హెచ్ ఎం సరస్వతి దేవి విగ్రహానికి పూల మాల వేసారు విద్యార్థులందరూ పూలతో పూజించారు శ్లోకాలు పఠించారు మరియు నేతాజీ సుభాష్ చంద్రబోస్ జయంతి సందర్భంగా నేతాజీ కి పూలమాల వేసి నేతాజీ తెలివితేటలు దేశభక్తి త్యాగం ఇత్యాది గొప్పతనాల గురించి విద్యార్ధులకు వివరించి ప్రతి ఒక్కరు సుభాష్ చంద్రబోస్ ని ఆదర్శంగా తీసుకుని ఆయన అడుగు జాడల్లో నడవాలని తెలియజేశారు ఈ కార్యక్రమం లో ఉపాధ్యాయిని, ఉపాధ్యాయులు ధనలక్ష్మి, అనిత, స్రవంతి, బాలశ్రీ, లక్ష్మయ్య, తేరా రామారావు, వెంకటేష్, సాయిబాబు తదితరులు పాల్గొన్నారు. సందర్భంగా విద్యార్థులకు స్వీట్లు, మిఠాయిలు పంచారు

















































పాఠకుల అభిప్రాయాలు
ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.
కామెంట్ను పోస్ట్ చేయండి