Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
హెడ్ కానిస్టేబుల్ అంగోతు యాదగిరికి ఘన నివాళి పెట్టుబడి సున్నా.. ఆదాయం మిన్న! కొత్త తరం బిజినెస్ ఐడియాలు! ఈడెన్‌లో ముకుల్ 'తుపాన్'.. లక్నో సూపర్ విక్టరీ! ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు “ఆయన స్వతంత్ర మార్గంలో ప్రయాణిస్తే దేశవ్యాప్తంగా ఒక కొత్త యువ కేంద్రీకృత రాజకీయ శక్తిగా ఎదుగుతారు” “పూరీ ఆలయం కింద బయటపడ్డ పురాతన భూగర్భ నగరం: జగన్నాథుడి ‘మూలాలు’ ఇప్పుడు ప్రపంచం ముందుకు” రంగేపల్లిలో అవగాహన సదస్సు విజయవంతం రంగేపల్లిలో అవగాహన సదస్సు విజయవంతం “గురుకుల ఔట్‌సోర్సింగ్, గెస్ట్, కాంట్రాక్ట్ టీచర్లకు ఉద్యోగ భద్రత, 12 నెలల జీతాలు కల్పించాలి: సిఐటియు డిమాండ్” “జర్మనీ హైడ్రోజన్ రైళ్లు: పర్యావరణానికి శుభసూచి కలిగించే భవిష్యత్తు టెక్నాలజీ” “64 గ్రాముల సృష్టిలో అంతరిక్ష చరిత్ర: కలాంసాట్ వెనుక రిఫత్ షారూక్ సంచలనం” ఓటీటీలోకి వాలెంటైన్స్ డే హిట్ 'పూకీ'.. కుర్రకారును ఫిదా చేసిన జెన్-జీ లవ్ స్టోరీ!
Sthanikam
PRINT TIME: April 10, 2026 02:42 PM

చర్చిలకు నిధులు అందేలా సమగ్ర సర్వే చేయాలి: ఎన్‌సీసీ డిమాండ్

చర్చిలకు నిధులు అందేలా సమగ్ర సర్వే చేయాలి: ఎన్‌సీసీ డిమాండ్

చర్చిలకు నిధులు అందేలా సమగ్ర సర్వే చేయాలి: ఎన్‌సీసీ డిమాండ్
December 19, 2025 04:37 PM 102 Views
Reporter
స్థానికం ప్రధాన ప్రతినిధి : తెలంగాణ / ఆంధ్రప్రదేశ్
Editor Desk

క్రైస్తవుల గుర్తింపుకు కాంగ్రెస్ ప్రభుత్వానికి ఎన్‌సీసీ కృతజ్ఞతలు

యాదాద్రి భువనగిరి స్థానిక ప్రతినిధి

తెలంగాణ రాష్ట్రంలోని క్రైస్తవుల పట్ల కాంగ్రెస్ ప్రభుత్వం చూపుతున్న సానుకూల దృక్పథానికి నేషనల్ క్రిస్టియన్ కౌన్సిల్ (ఎన్‌సీసీ) పక్షాన కృతజ్ఞతలు తెలియజేస్తున్నామని ఎన్‌సీసీ యాదాద్రి భువనగిరి జిల్లా అధ్యక్షులు జాన్ జహంగీర్ అన్నారు. క్రిస్మస్ పండుగ సందర్భంగా ప్రతి చర్చికి దీపాలంకరణ కోసం రూ.30 వేల నిధులు మంజూరు చేసినందుకు ప్రభుత్వానికి ధన్యవాదాలు తెలిపారు.

శుక్రవారం నిర్వహించిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ… క్రైస్తవుల పవిత్ర పండుగ అయిన క్రిస్మస్‌ను ఘనంగా నిర్వహించుకునేందుకు ప్రభుత్వం నిధులు కేటాయించడం అభినందనీయమన్నారు. అయితే నిధుల విడుదల కోసం చర్చి కమిటీల రిజిస్ట్రేషన్ పత్రాలు, బ్యాంక్ అకౌంట్ పాస్‌బుక్ తదితర డాక్యుమెంట్లు సమర్పించాలని కోరుతున్న నేపథ్యంలో, భవిష్యత్తులో ఇబ్బందులు ఎదురయ్యే అవకాశముందన్న అనుమానాలను చర్చి కమిటీ సభ్యులు వ్యక్తం చేస్తున్నారని పేర్కొన్నారు.

ఈ నేపథ్యంలో ప్రభుత్వ సిబ్బంది ద్వారా సమగ్ర సర్వే నిర్వహించి, చర్చి ఉన్న ప్రతి ప్రాంతానికి సమానంగా ప్రభుత్వ నిధులు మంజూరు చేయాలని, ఏ చర్చీ కూడా నిధుల నుంచి వంచితమవకుండా చర్యలు తీసుకోవాలని ఆయన ప్రభుత్వాన్ని కోరారు. క్రిస్మస్ పండుగ సందర్భంగా యేసు ప్రభువు రాష్ట్ర ప్రజలందరినీ చల్లగా చూడాలని ఆకాంక్షిస్తూ, తెలంగాణ ప్రజలందరికీ శుభాకాంక్షలు తెలిపారు.




మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.


కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News