చర్చిలకు నిధులు అందేలా సమగ్ర సర్వే చేయాలి: ఎన్సీసీ డిమాండ్
చర్చిలకు నిధులు అందేలా సమగ్ర సర్వే చేయాలి: ఎన్సీసీ డిమాండ్
Editor Desk
క్రైస్తవుల గుర్తింపుకు కాంగ్రెస్ ప్రభుత్వానికి ఎన్సీసీ కృతజ్ఞతలు
యాదాద్రి భువనగిరి స్థానిక ప్రతినిధి
తెలంగాణ రాష్ట్రంలోని క్రైస్తవుల పట్ల కాంగ్రెస్ ప్రభుత్వం చూపుతున్న సానుకూల దృక్పథానికి నేషనల్ క్రిస్టియన్ కౌన్సిల్ (ఎన్సీసీ) పక్షాన కృతజ్ఞతలు తెలియజేస్తున్నామని ఎన్సీసీ యాదాద్రి భువనగిరి జిల్లా అధ్యక్షులు జాన్ జహంగీర్ అన్నారు. క్రిస్మస్ పండుగ సందర్భంగా ప్రతి చర్చికి దీపాలంకరణ కోసం రూ.30 వేల నిధులు మంజూరు చేసినందుకు ప్రభుత్వానికి ధన్యవాదాలు తెలిపారు.
శుక్రవారం నిర్వహించిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ… క్రైస్తవుల పవిత్ర పండుగ అయిన క్రిస్మస్ను ఘనంగా నిర్వహించుకునేందుకు ప్రభుత్వం నిధులు కేటాయించడం అభినందనీయమన్నారు. అయితే నిధుల విడుదల కోసం చర్చి కమిటీల రిజిస్ట్రేషన్ పత్రాలు, బ్యాంక్ అకౌంట్ పాస్బుక్ తదితర డాక్యుమెంట్లు సమర్పించాలని కోరుతున్న నేపథ్యంలో, భవిష్యత్తులో ఇబ్బందులు ఎదురయ్యే అవకాశముందన్న అనుమానాలను చర్చి కమిటీ సభ్యులు వ్యక్తం చేస్తున్నారని పేర్కొన్నారు.
ఈ నేపథ్యంలో ప్రభుత్వ సిబ్బంది ద్వారా సమగ్ర సర్వే నిర్వహించి, చర్చి ఉన్న ప్రతి ప్రాంతానికి సమానంగా ప్రభుత్వ నిధులు మంజూరు చేయాలని, ఏ చర్చీ కూడా నిధుల నుంచి వంచితమవకుండా చర్యలు తీసుకోవాలని ఆయన ప్రభుత్వాన్ని కోరారు. క్రిస్మస్ పండుగ సందర్భంగా యేసు ప్రభువు రాష్ట్ర ప్రజలందరినీ చల్లగా చూడాలని ఆకాంక్షిస్తూ, తెలంగాణ ప్రజలందరికీ శుభాకాంక్షలు తెలిపారు.

















































పాఠకుల అభిప్రాయాలు
ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.
కామెంట్ను పోస్ట్ చేయండి