చోరీలకు పాల్పడుతున్న అంతర్ రాష్ట్ర దొంగలు అరెస్ట్ రూ.10 లక్షల నగదు స్వాధీనం
చోరీలకు పాల్పడుతున్న అంతర్ రాష్ట్ర దొంగలు అరెస్ట్ రూ.10 లక్షల నగదు స్వాధీనం
EDIGA NAVEENKUMAR
శ్రీ సత్యసాయి జిల్లా గోరంట్ల పోలీసులు అంతర్ రాష్ట్ర దొంగల ముఠాను అరెస్ట్ చేసి రెండు కేసులకు సంబంధించిన రూ.10 లక్షల నగదును స్వాధీనం చేసుకున్నారు. జిల్లా ఎస్పీ శ్రీ S.సతీష్ కుమార్ IPS ఆదేశాలు, పెనుకొండ SDPO U.నరసింగప్ప పర్యవేక్షణలో గోరంట్ల అప్గ్రేడ్ పోలీస్ స్టేషన్ CI B.శేఖర్ ఆధ్వర్యంలో ఈ ఆపరేషన్ నిర్వహించారు.
అనకాపల్లి, విజయనగరం జిల్లాలకు చెందిన నలుగురు నిందితులను అరెస్ట్ చేసిన పోలీసులు, వారివద్ద నుంచి రెండు కేసులకు సంబంధించిన నగదును రికవరీ చేశారు. నిందితులు చెడు వ్యసనాలకు అలవాటుపడి సులభంగా డబ్బు సంపాదించాలనే ఉద్దేశంతో దొంగతనాలకు పాల్పడినట్లు పోలీసులు తెలిపారు.
2024 ఏప్రిల్ 2న గోరంట్లలో చైతన్య స్కూల్ సమీపంలో స్కూటీ డిక్కీలో ఉన్న రూ.5.90 లక్షలు, అలాగే 2025 జూలై 14న వాసవీ కళ్యాణ మండపం ఎదురుగా కారులో ఉన్న రూ.7 లక్షలను అద్దాలు పగులగొట్టి దొంగిలించినట్లు విచారణలో వెల్లడైంది.
Cr.No.115/2025 కేసులో రూ.6 లక్షలు, Cr.No.92/2024 కేసులో రూ.4 లక్షలు స్వాధీనం చేసుకున్నట్లు పోలీసులు తెలిపారు. దొంగలను అరెస్ట్ చేసిన CI B.శేఖర్ మరియు సిబ్బందిని జిల్లా ఎస్పీ అభినందించారు.

















































పాఠకుల అభిప్రాయాలు
ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.
కామెంట్ను పోస్ట్ చేయండి