Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
విద్యుత్ సిబ్బంది జాగ్రత్తలు తీసుకోవాలి.. సరూర్ నగర్ విద్యుత్ డిఈఈ ఫర్హత్ అలీ బిగ్ బ్రేకింగ్ న్యూస్ తమిళనాడులో టీవీకే ప్రభుత్వం ఏర్పాటు దిశగా కీలక ముందడుగు కలెక్టర్ కార్యాలయంలో అల్లూరి సీతారామరాజు వర్ధంతి కార్పొరేట్ స్థాయికి ప్రభుత్వ పాఠశాలలు – ప్రతిభావంతుల సత్కారం డప్పూర్ గ్రామ శివారులో ఘనంగా బీరప్ప స్వామి – కామరాతి దేవి కళ్యాణ మహోత్సవం ఇష్టం లేదన్న వరుడు.. కాబోయే భార్య ఆత్మహత్య ప్రైవేట్ విద్యపై కఠిన నియంత్రణలు – చైనా మార్పులు ప్రపంచ దృష్టిని ఆకర్షిస్తున్నాయి ఉప్పల్‌లో 'రైజర్స్' హోరు.. చెన్నైపై హైదరాబాద్ ఘనవిజయం! పెట్టుబడి సున్నా.. ఆదాయం మిన్న! కొత్త తరం బిజినెస్ ఐడియాలు! ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు ఓటీటీలోకి వాలెంటైన్స్ డే హిట్ 'పూకీ'.. కుర్రకారును ఫిదా చేసిన జెన్-జీ లవ్ స్టోరీ!
Sthanikam
PRINT TIME: May 07, 2026 06:48 PM

ఇందిరమ్మ ఇళ్లకు భారీ స్పందన..

ఇందిరమ్మ ఇళ్లకు భారీ స్పందన..

ఇందిరమ్మ ఇళ్లకు భారీ స్పందన..
May 07, 2026 05:41 PM 22 Views
Reporter
స్థానికం ప్రతినిధి : District Bureau Nalagonda
NM Yadav

నిబంధనలు సరళీకరించాలి..

హౌసింగ్ బోర్డు సమీక్షలో మండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి..

నల్గొండ : రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ‘ఇందిరమ్మ ఇళ్ల’ పథకానికి ప్రజల నుంచి విశేష స్పందన లభిస్తోందని, నిరుపేదల సొంతింటి కలను సాకారం చేసేందుకు మరిన్ని నిధులు కేటాయించాలని తెలంగాణ శాసన మండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి కోరారు. గురువారం హైదరాబాద్‌లోని తెలంగాణ రాష్ట్ర హౌసింగ్ కార్పొరేషన్ కార్యాలయంలో ఉమ్మడి నల్గొండ జిల్లా రెవెన్యూ, గృహ నిర్మాణ శాఖలపై ఉన్నత స్థాయి సమీక్షా సమావేశం జరిగింది. ఈ సమావేశంలో మంత్రులు పొంగులేటి శ్రీనివాసరెడ్డి, ఉత్తమ్ కుమార్ రెడ్డి, కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి, ప్రభుత్వ విప్ అడ్లూరి లక్ష్మణ్, ఎంపీ చామల కిరణ్ కుమార్ రెడ్డితో పాటు ఉమ్మడి జిల్లాకు చెందిన ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు మరియు ఉన్నతాధికారులు పాల్గొన్నారు.

నిబంధనల సడలింపు అవసరం..

​సమావేశంలో గుత్తా సుఖేందర్ రెడ్డి మాట్లాడుతూ, ఇందిరమ్మ ఇళ్లపై ప్రజల్లో ఉన్న ఆసక్తిని దృష్టిలో ఉంచుకుని అర్హులైన ప్రతి ఒక్కరికీ న్యాయం చేయాలని సూచించారు. ముఖ్యంగా పథకానికి అడ్డంకిగా మారిన కొన్ని నిబంధనలను తొలగించాలని ఆయన ప్రతిపాదించారు. ద్విచక్ర వాహనం లేదా నాలుగు చక్రాల వాహనం ఉన్నంత మాత్రాన ఇందిరమ్మ ఇళ్లకు అనర్హులుగా ప్రకటించడం సరికాదు. ఈ నిబంధనలను వెంటనే తొలగించి నిజమైన పేదలకు పథకం అందేలా చూడాలి అని ఆయన స్పష్టం చేశారు. గతంలో నిర్మించిన డబుల్ బెడ్ రూమ్ ఇళ్ల అంశాన్ని కూడా మండలి చైర్మన్ ప్రస్తావించారు. చిన్నపాటి అసౌకర్యాల వల్ల సిద్ధంగా ఉన్న ఇళ్లను లబ్ధిదారులకు పంపిణీ చేయడంలో జాప్యం జరుగుతోందని ఆ లోపాలను సరిదిద్ది త్వరగా ఇళ్లను అప్పగించాలని కోరారు.

భూ సమస్యల పరిష్కారానికి 'భూ భారతి'..

​ఇళ్ల నిర్మాణానికి సంబంధించి ఎక్కడా భూ వివాదాలు తలెత్తకుండా రెవెన్యూ అధికారులు అప్రమత్తంగా ఉండాలని గుత్తా సూచించారు. 'భూ భారతి' కార్యక్రమం ద్వారా రాష్ట్రంలోని భూ సమస్యలను శాశ్వతంగా పరిష్కరించాలని, తద్వారా అభివృద్ధి పనులకు ఆటంకం లేకుండా చూడాలని ఆయన అధికారులను ఆదేశించారు. ఈ సమావేశంలో జిల్లాలో గృహ నిర్మాణ ప్రగతిని మంత్రులు సమీక్షించారు. గడువులోగా లక్ష్యాలను పూర్తి చేయాలని అధికారులకు దిశానిర్దేశం చేశారు.


మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.


కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News