Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
నల్గొండలో మెడ్‌ప్లస్ మెడికల్ షాపు ప్రారంభం. ప్రజలకు నాణ్యమైన మందులు అందుబాటు ధరల్లో అందిస్తాం: నిర్వాహకులు నాణ్యత లేని భోజనం – అధికారుల నిర్లక్ష్యంపై కలెక్టర్‌కు వినతి పత్రం:- RSF,AISU విద్యార్థి సంఘాలు మహిళలు, చిన్నారుల భద్రతపై శక్తి టీమ్‌ల విస్తృత అవగాహన నేరం చేసిన వారు చట్టం నుంచి తప్పించుకోలేరు – జిల్లా ఎస్పీ ఎస్.సతీష్ కుమార్ రొద్దంలో ఘనంగా అనంతశక్తి సొసైటీ 27వ వార్షిక మహాసభ డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ కొత్తచెరువు లో జేసీ ప్రభాకర్ రెడ్డి పుట్టినరోజు వేడుకలు స్ఫూర్తి పెండ్లి పోలీసింగ్ క్రికెట్ టోర్నమెంట్ ను ప్రారంభించిన జిల్లా ఎస్పీ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ హనుమంతుని పూజలో పాల్గొన్న జనసేన నాయకులు, మార్కెట్ కమిటీ చైర్మన్ పూల శివప్రసాద్. ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: July 10, 2026 11:07 PM

‘అన్నదాత నుంచి విద్యుత్ ప్రదాతగా రైతులు’

‘అన్నదాత నుంచి విద్యుత్ ప్రదాతగా రైతులు’

‘అన్నదాత నుంచి విద్యుత్ ప్రదాతగా రైతులు’
May 07, 2026 06:33 PM 70 Views
Reporter
స్థానికం ప్రతినిధి : Sub Editor
K.RAVI

ప్రజాపాలన-ప్రగతి ప్రణాళికలో భాగంగా రైతు వారం కార్యక్రమం

ప్రజాపాలన–ప్రగతి ప్రణాళికలో భాగంగా మే 4 నుంచి 9 వరకు నిర్వహిస్తున్న ‘రైతు వారం’ కార్యక్రమంలో భాగంగా చౌటుప్పల్ మున్సిపాలిటీ పరిధిలోని రైతు వేదికలో గురువారం అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ముఖ్య అతిథిగా హాజరైన మున్సిపల్ చైర్‌పర్సన్ మొగుదాల పావని రమేష్‌గౌడ్ మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్రంలో వ్యవసాయ, ఇంధన శాఖల సమన్వయంతో రైతుల సాధికారతకు ప్రభుత్వం ప్రత్యేక చర్యలు చేపడుతోందన్నారు. ‘ప్రజాపాలన–ప్రగతి ప్రణాళిక’ 99 రోజుల కార్యాచరణలో భాగంగా రైతులకు ఉపయోగపడే పలు సంక్షేమ కార్యక్రమాలను అమలు చేస్తున్నట్లు తెలిపారు.రైతులు తమ పొలాల్లో సోలార్ ప్యానెల్స్ ఏర్పాటు చేసుకోవడం ద్వారా ‘అన్నదాత’ నుంచి ‘విద్యుత్ ప్రదాత’గా మారే అవకాశం ఉందన్నారు. సోలార్ విద్యుత్ ఉత్పత్తి చేసి డిస్కంలకు విక్రయించడం ద్వారా రైతులు స్థిరమైన ఆదాయం పొందవచ్చని వివరించారు.ఈ కార్యక్రమంలో చౌటుప్పల్ వ్యవసాయ మార్కెట్ చైర్మన్ ఉబ్బు వెంకటయ్య, వైస్ చైర్మన్ ఆకుల ఇంద్రసేనారెడ్డి, సింగిల్ విండో వైస్ చైర్మన్ చేన్నగోని అంజయ్యగౌడ్, వ్యవసాయ మండల అధికారి నాగరాజు, కౌన్సిలర్లు కొసనం రాకేష్‌రెడ్డి, పాక చిరంజీవి, విద్యుత్ శాఖ అధికారులు, సీఈ, డీఈ, ఏఈ, సర్పంచ్ శ్రీధర్‌రావు, రైతులు, విద్యుత్ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.


కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News