Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
ఇంటర్‌లో స్టేట్ ర్యాంకులతో ఆదోని విద్యార్థినుల సత్తా నారా లోకేష్ స్ఫూర్తితో విద్యా రంగంలో ముందడుగు: దేవేంద్రప్ప బిగ్ బ్రేకింగ్ న్యూస్ తమిళనాడులో టీవీకే ప్రభుత్వం ఏర్పాటు దిశగా కీలక ముందడుగు కలెక్టర్ కార్యాలయంలో అల్లూరి సీతారామరాజు వర్ధంతి కార్పొరేట్ స్థాయికి ప్రభుత్వ పాఠశాలలు – ప్రతిభావంతుల సత్కారం డప్పూర్ గ్రామ శివారులో ఘనంగా బీరప్ప స్వామి – కామరాతి దేవి కళ్యాణ మహోత్సవం ఇష్టం లేదన్న వరుడు.. కాబోయే భార్య ఆత్మహత్య ప్రైవేట్ విద్యపై కఠిన నియంత్రణలు – చైనా మార్పులు ప్రపంచ దృష్టిని ఆకర్షిస్తున్నాయి ఉప్పల్‌లో 'రైజర్స్' హోరు.. చెన్నైపై హైదరాబాద్ ఘనవిజయం! పెట్టుబడి సున్నా.. ఆదాయం మిన్న! కొత్త తరం బిజినెస్ ఐడియాలు! ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు ఓటీటీలోకి వాలెంటైన్స్ డే హిట్ 'పూకీ'.. కుర్రకారును ఫిదా చేసిన జెన్-జీ లవ్ స్టోరీ!
Sthanikam
PRINT TIME: May 07, 2026 07:40 PM

‘అన్నదాత నుంచి విద్యుత్ ప్రదాతగా రైతులు’

‘అన్నదాత నుంచి విద్యుత్ ప్రదాతగా రైతులు’

‘అన్నదాత నుంచి విద్యుత్ ప్రదాతగా రైతులు’
May 07, 2026 06:33 PM 1 Views
Reporter
స్థానికం ప్రతినిధి : Sub Editor
K.RAVI

ప్రజాపాలన-ప్రగతి ప్రణాళికలో భాగంగా రైతు వారం కార్యక్రమం

ప్రజాపాలన–ప్రగతి ప్రణాళికలో భాగంగా మే 4 నుంచి 9 వరకు నిర్వహిస్తున్న ‘రైతు వారం’ కార్యక్రమంలో భాగంగా చౌటుప్పల్ మున్సిపాలిటీ పరిధిలోని రైతు వేదికలో గురువారం అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ముఖ్య అతిథిగా హాజరైన మున్సిపల్ చైర్‌పర్సన్ మొగుదాల పావని రమేష్‌గౌడ్ మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్రంలో వ్యవసాయ, ఇంధన శాఖల సమన్వయంతో రైతుల సాధికారతకు ప్రభుత్వం ప్రత్యేక చర్యలు చేపడుతోందన్నారు. ‘ప్రజాపాలన–ప్రగతి ప్రణాళిక’ 99 రోజుల కార్యాచరణలో భాగంగా రైతులకు ఉపయోగపడే పలు సంక్షేమ కార్యక్రమాలను అమలు చేస్తున్నట్లు తెలిపారు.రైతులు తమ పొలాల్లో సోలార్ ప్యానెల్స్ ఏర్పాటు చేసుకోవడం ద్వారా ‘అన్నదాత’ నుంచి ‘విద్యుత్ ప్రదాత’గా మారే అవకాశం ఉందన్నారు. సోలార్ విద్యుత్ ఉత్పత్తి చేసి డిస్కంలకు విక్రయించడం ద్వారా రైతులు స్థిరమైన ఆదాయం పొందవచ్చని వివరించారు.ఈ కార్యక్రమంలో చౌటుప్పల్ వ్యవసాయ మార్కెట్ చైర్మన్ ఉబ్బు వెంకటయ్య, వైస్ చైర్మన్ ఆకుల ఇంద్రసేనారెడ్డి, సింగిల్ విండో వైస్ చైర్మన్ చేన్నగోని అంజయ్యగౌడ్, వ్యవసాయ మండల అధికారి నాగరాజు, కౌన్సిలర్లు కొసనం రాకేష్‌రెడ్డి, పాక చిరంజీవి, విద్యుత్ శాఖ అధికారులు, సీఈ, డీఈ, ఏఈ, సర్పంచ్ శ్రీధర్‌రావు, రైతులు, విద్యుత్ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.


కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News