‘అన్నదాత నుంచి విద్యుత్ ప్రదాతగా రైతులు’
‘అన్నదాత నుంచి విద్యుత్ ప్రదాతగా రైతులు’
K.RAVI
ప్రజాపాలన-ప్రగతి ప్రణాళికలో భాగంగా రైతు వారం కార్యక్రమం
ప్రజాపాలన–ప్రగతి ప్రణాళికలో భాగంగా మే 4 నుంచి 9 వరకు నిర్వహిస్తున్న ‘రైతు వారం’ కార్యక్రమంలో భాగంగా చౌటుప్పల్ మున్సిపాలిటీ పరిధిలోని రైతు వేదికలో గురువారం అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ముఖ్య అతిథిగా హాజరైన మున్సిపల్ చైర్పర్సన్ మొగుదాల పావని రమేష్గౌడ్ మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్రంలో వ్యవసాయ, ఇంధన శాఖల సమన్వయంతో రైతుల సాధికారతకు ప్రభుత్వం ప్రత్యేక చర్యలు చేపడుతోందన్నారు. ‘ప్రజాపాలన–ప్రగతి ప్రణాళిక’ 99 రోజుల కార్యాచరణలో భాగంగా రైతులకు ఉపయోగపడే పలు సంక్షేమ కార్యక్రమాలను అమలు చేస్తున్నట్లు తెలిపారు.రైతులు తమ పొలాల్లో సోలార్ ప్యానెల్స్ ఏర్పాటు చేసుకోవడం ద్వారా ‘అన్నదాత’ నుంచి ‘విద్యుత్ ప్రదాత’గా మారే అవకాశం ఉందన్నారు. సోలార్ విద్యుత్ ఉత్పత్తి చేసి డిస్కంలకు విక్రయించడం ద్వారా రైతులు స్థిరమైన ఆదాయం పొందవచ్చని వివరించారు.ఈ కార్యక్రమంలో చౌటుప్పల్ వ్యవసాయ మార్కెట్ చైర్మన్ ఉబ్బు వెంకటయ్య, వైస్ చైర్మన్ ఆకుల ఇంద్రసేనారెడ్డి, సింగిల్ విండో వైస్ చైర్మన్ చేన్నగోని అంజయ్యగౌడ్, వ్యవసాయ మండల అధికారి నాగరాజు, కౌన్సిలర్లు కొసనం రాకేష్రెడ్డి, పాక చిరంజీవి, విద్యుత్ శాఖ అధికారులు, సీఈ, డీఈ, ఏఈ, సర్పంచ్ శ్రీధర్రావు, రైతులు, విద్యుత్ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.

















































పాఠకుల అభిప్రాయాలు
ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.
కామెంట్ను పోస్ట్ చేయండి