Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
మొక్కలు నాటుతూ పర్యావరణ పరిరక్షణకు పిలుపు:గ్రామ సర్పంచ్ ప్రియాంక రాజేందర్ అధికారులారా.. మాదాహార్తిని తీర్చండి జనరల్ పవర్ ఆఫ్ అటార్నీ నమూనా మట్టి వాసనలో మన సంస్కృతి.. జానపద కళల్లో తరతరాల జీవన గాథ హెచ్ఆర్పీఎం సంస్థ ఉమెన్ సెల్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర జాయింట్ సెక్రటరీగా :- పండ్ల లక్ష్మీదేవి న్యాల్కల్‌లో భక్తిశ్రద్ధలతో నాగుల పంచమి వేడుకలు డి ఎం & హెచ్ ఓ కీ వినతి పత్రం డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ స్ఫూర్తి పెండ్లి పోలీసింగ్ క్రికెట్ టోర్నమెంట్ ను ప్రారంభించిన జిల్లా ఎస్పీ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: August 26, 2026 01:12 AM

తెలంగాణ ఉద్యమకారులను వెంటనే గుర్తించాలి.

తెలంగాణ ఉద్యమకారులను వెంటనే గుర్తించాలి.

తెలంగాణ ఉద్యమకారులను వెంటనే గుర్తించాలి.
07-05-2026 35 Views
Reporter
స్థానికం ప్రధాన ప్రతినిధి : తెలంగాణ / ఆంధ్రప్రదేశ్
Editor Desk

ఉద్యమకారుల ఫోరం రాష్ట్ర ఉపాధ్యక్షుడు జోగు అంజన్న.

తెలంగాణ ఉద్యమకారులను గుర్తించడంలో రాష్ట్ర ప్రభుత్వం ఆలస్యం చేస్తోందని తెలంగాణ ఉద్యమకారుల ఫోరం రాష్ట్ర ఉపాధ్యక్షుడు జోగు అంజన్న విమర్శించారు. తొలి దశ, మలి దశ ఉద్యమకారులు తీవ్ర అసహనానికి గురవుతున్నారని పేర్కొన్నారు.

ఉద్యమకారుల సమస్యల పరిష్కారానికి సబ్ కమిటీ ఏర్పాటు చేస్తామని ప్రకటించినప్పటికీ ఇప్పటివరకు అధికారిక ప్రకటన వెలువడకపోవడం ఆశ్చర్యకరమన్నారు. ఉద్యమకారుల అంశం శాసనసభ, శాసన మండలిలో చర్చకు వచ్చినప్పటికీ ప్రభుత్వం నిర్లక్ష్యంగా వ్యవహరిస్తోందని ఆరోపించారు.

ఈ నెలాఖరు వరకు సబ్ కమిటీని ప్రకటించి ఉద్యమకారులను గుర్తించకపోతే జూన్ నెలలో రాష్ట్రవ్యాప్తంగా ఆందోళనలు చేపడతామని హెచ్చరించారు. 33 జిల్లాల్లో మండల కేంద్రాల వద్ద నిరసనలు, రాస్తారోకోలు, హైదరాబాద్‌లో భారీ బహిరంగ సభలు, అసెంబ్లీ ముట్టడి కార్యక్రమాలు నిర్వహిస్తామని తెలిపారు.

ఉద్యమాలు చేయడం ఉద్యమకారులకు కొత్త కాదని, వారి సమస్యలను ప్రభుత్వం వెంటనే పరిష్కరించాలని జోగు అంజన్న డిమాండ్ చేశారు.

Sthanikam

తెలంగాణ ఉద్యమకారులను వెంటనే గుర్తించాలి.

Article Image

ఉద్యమకారుల ఫోరం రాష్ట్ర ఉపాధ్యక్షుడు జోగు అంజన్న.

తెలంగాణ ఉద్యమకారులను గుర్తించడంలో రాష్ట్ర ప్రభుత్వం ఆలస్యం చేస్తోందని తెలంగాణ ఉద్యమకారుల ఫోరం రాష్ట్ర ఉపాధ్యక్షుడు జోగు అంజన్న విమర్శించారు. తొలి దశ, మలి దశ ఉద్యమకారులు తీవ్ర అసహనానికి గురవుతున్నారని పేర్కొన్నారు.

ఉద్యమకారుల సమస్యల పరిష్కారానికి సబ్ కమిటీ ఏర్పాటు చేస్తామని ప్రకటించినప్పటికీ ఇప్పటివరకు అధికారిక ప్రకటన వెలువడకపోవడం ఆశ్చర్యకరమన్నారు. ఉద్యమకారుల అంశం శాసనసభ, శాసన మండలిలో చర్చకు వచ్చినప్పటికీ ప్రభుత్వం నిర్లక్ష్యంగా వ్యవహరిస్తోందని ఆరోపించారు.

ఈ నెలాఖరు వరకు సబ్ కమిటీని ప్రకటించి ఉద్యమకారులను గుర్తించకపోతే జూన్ నెలలో రాష్ట్రవ్యాప్తంగా ఆందోళనలు చేపడతామని హెచ్చరించారు. 33 జిల్లాల్లో మండల కేంద్రాల వద్ద నిరసనలు, రాస్తారోకోలు, హైదరాబాద్‌లో భారీ బహిరంగ సభలు, అసెంబ్లీ ముట్టడి కార్యక్రమాలు నిర్వహిస్తామని తెలిపారు.

ఉద్యమాలు చేయడం ఉద్యమకారులకు కొత్త కాదని, వారి సమస్యలను ప్రభుత్వం వెంటనే పరిష్కరించాలని జోగు అంజన్న డిమాండ్ చేశారు.

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.


కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News