తెలంగాణ ఉద్యమకారులను వెంటనే గుర్తించాలి.
తెలంగాణ ఉద్యమకారులను వెంటనే గుర్తించాలి.
Editor Desk
ఉద్యమకారుల ఫోరం రాష్ట్ర ఉపాధ్యక్షుడు జోగు అంజన్న.
తెలంగాణ ఉద్యమకారులను గుర్తించడంలో రాష్ట్ర ప్రభుత్వం ఆలస్యం చేస్తోందని తెలంగాణ ఉద్యమకారుల ఫోరం రాష్ట్ర ఉపాధ్యక్షుడు జోగు అంజన్న విమర్శించారు. తొలి దశ, మలి దశ ఉద్యమకారులు తీవ్ర అసహనానికి గురవుతున్నారని పేర్కొన్నారు.
ఉద్యమకారుల సమస్యల పరిష్కారానికి సబ్ కమిటీ ఏర్పాటు చేస్తామని ప్రకటించినప్పటికీ ఇప్పటివరకు అధికారిక ప్రకటన వెలువడకపోవడం ఆశ్చర్యకరమన్నారు. ఉద్యమకారుల అంశం శాసనసభ, శాసన మండలిలో చర్చకు వచ్చినప్పటికీ ప్రభుత్వం నిర్లక్ష్యంగా వ్యవహరిస్తోందని ఆరోపించారు.
ఈ నెలాఖరు వరకు సబ్ కమిటీని ప్రకటించి ఉద్యమకారులను గుర్తించకపోతే జూన్ నెలలో రాష్ట్రవ్యాప్తంగా ఆందోళనలు చేపడతామని హెచ్చరించారు. 33 జిల్లాల్లో మండల కేంద్రాల వద్ద నిరసనలు, రాస్తారోకోలు, హైదరాబాద్లో భారీ బహిరంగ సభలు, అసెంబ్లీ ముట్టడి కార్యక్రమాలు నిర్వహిస్తామని తెలిపారు.
ఉద్యమాలు చేయడం ఉద్యమకారులకు కొత్త కాదని, వారి సమస్యలను ప్రభుత్వం వెంటనే పరిష్కరించాలని జోగు అంజన్న డిమాండ్ చేశారు.

















































పాఠకుల అభిప్రాయాలు
ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.
కామెంట్ను పోస్ట్ చేయండి