వికలాంగుల పెన్షన్ను రూ.6 వేలకు పెంచాలి NPRD జిల్లా ప్రధాన కార్యదర్శి వనం ఉపేందర్
వికలాంగుల పెన్షన్ను రూ.6 వేలకు పెంచాలి NPRD జిల్లా ప్రధాన కార్యదర్శి వనం ఉపేందర్
Editor Desk
బిబినగర్ : వికలాంగుల హక్కుల జాతీయ వేదిక (NPRD) రాష్ట్ర కమిటీ పిలుపు మేరకు మే 1 నుంచి 10 వరకు రాష్ట్రవ్యాప్తంగా వికలాంగులు ఎదుర్కొంటున్న సమస్యలపై సర్వే నిర్వహిస్తున్నట్లు NPRD యాదాద్రి భువనగిరి జిల్లా ప్రధాన కార్యదర్శి వనం ఉపేందర్ తెలిపారు.
ఈ సందర్భంగా బిబినగర్ మండలంలోని నెమరుగొమల, జములాపేట్, జియ్యాపల్లి, రాయరపేట్ గ్రామాల్లో సర్వే నిర్వహించి వికలాంగుల సమస్యలను తెలుసుకున్నారు. సదరం సర్టిఫికెట్, UDID కార్డులు ఉన్నప్పటికీ గత ఐదేళ్లుగా పెన్షన్ కోసం ఎదురు చూస్తున్నామని పలువురు వికలాంగులు ఆవేదన వ్యక్తం చేసినట్లు తెలిపారు.
వికలాంగులకు ఉపాధి అవకాశాలు కల్పించడంతో పాటు ప్రతి ఒక్కరికీ ఇందిరమ్మ ఇళ్లు మంజూరు చేయాలని డిమాండ్ చేశారు. ఎన్నికల సమయంలో వికలాంగులకు రూ.6 వేల పెన్షన్ ఇస్తామని హామీ ఇచ్చిన ప్రభుత్వం రెండున్నరేళ్లు గడిచినా అమలు చేయలేదని విమర్శించారు. తక్షణమే పెన్షన్ పెంపుతో పాటు కొత్త పెన్షన్లు మంజూరు చేయాలని కోరారు.
అలాగే చిర్రగూడూరు, జానకాపూర్, సౌల, రామారం గ్రామాల్లో గ్రామ కమిటీలను ఎన్నుకున్నట్లు తెలిపారు.
ఈ కార్యక్రమంలో జిల్లా ఉపాధ్యక్షులు రామిడి భగవంత్ రెడ్డి, గ్రామ నాయకులు తోక రాధా, పంపరి అనురాధ, తోక మల్లేశం, గడ్డం బాలరాజు, చిన్నాల బాలరాజు, సిహెచ్ గణేష్, ఎండి అన్వర్ తదితరులు పాల్గొన్నారు.

















































పాఠకుల అభిప్రాయాలు
ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.
కామెంట్ను పోస్ట్ చేయండి