Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
మొక్కలు నాటుతూ పర్యావరణ పరిరక్షణకు పిలుపు:గ్రామ సర్పంచ్ ప్రియాంక రాజేందర్ అధికారులారా.. మాదాహార్తిని తీర్చండి జనరల్ పవర్ ఆఫ్ అటార్నీ నమూనా మట్టి వాసనలో మన సంస్కృతి.. జానపద కళల్లో తరతరాల జీవన గాథ హెచ్ఆర్పీఎం సంస్థ ఉమెన్ సెల్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర జాయింట్ సెక్రటరీగా :- పండ్ల లక్ష్మీదేవి న్యాల్కల్‌లో భక్తిశ్రద్ధలతో నాగుల పంచమి వేడుకలు డి ఎం & హెచ్ ఓ కీ వినతి పత్రం డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ స్ఫూర్తి పెండ్లి పోలీసింగ్ క్రికెట్ టోర్నమెంట్ ను ప్రారంభించిన జిల్లా ఎస్పీ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: August 26, 2026 01:16 AM

వికలాంగుల పెన్షన్‌ను రూ.6 వేలకు పెంచాలి NPRD జిల్లా ప్రధాన కార్యదర్శి వనం ఉపేందర్

వికలాంగుల పెన్షన్‌ను రూ.6 వేలకు పెంచాలి NPRD జిల్లా ప్రధాన కార్యదర్శి వనం ఉపేందర్

వికలాంగుల పెన్షన్‌ను రూ.6 వేలకు పెంచాలి NPRD జిల్లా ప్రధాన కార్యదర్శి వనం ఉపేందర్
07-05-2026 72 Views
Reporter
స్థానికం ప్రధాన ప్రతినిధి : తెలంగాణ / ఆంధ్రప్రదేశ్
Editor Desk

బిబినగర్ : వికలాంగుల హక్కుల జాతీయ వేదిక (NPRD) రాష్ట్ర కమిటీ పిలుపు మేరకు మే 1 నుంచి 10 వరకు రాష్ట్రవ్యాప్తంగా వికలాంగులు ఎదుర్కొంటున్న సమస్యలపై సర్వే నిర్వహిస్తున్నట్లు NPRD యాదాద్రి భువనగిరి జిల్లా ప్రధాన కార్యదర్శి వనం ఉపేందర్ తెలిపారు.

ఈ సందర్భంగా బిబినగర్ మండలంలోని నెమరుగొమల, జములాపేట్, జియ్యాపల్లి, రాయరపేట్ గ్రామాల్లో సర్వే నిర్వహించి వికలాంగుల సమస్యలను తెలుసుకున్నారు. సదరం సర్టిఫికెట్, UDID కార్డులు ఉన్నప్పటికీ గత ఐదేళ్లుగా పెన్షన్ కోసం ఎదురు చూస్తున్నామని పలువురు వికలాంగులు ఆవేదన వ్యక్తం చేసినట్లు తెలిపారు.

వికలాంగులకు ఉపాధి అవకాశాలు కల్పించడంతో పాటు ప్రతి ఒక్కరికీ ఇందిరమ్మ ఇళ్లు మంజూరు చేయాలని డిమాండ్ చేశారు. ఎన్నికల సమయంలో వికలాంగులకు రూ.6 వేల పెన్షన్ ఇస్తామని హామీ ఇచ్చిన ప్రభుత్వం రెండున్నరేళ్లు గడిచినా అమలు చేయలేదని విమర్శించారు. తక్షణమే పెన్షన్ పెంపుతో పాటు కొత్త పెన్షన్లు మంజూరు చేయాలని కోరారు.

అలాగే చిర్రగూడూరు, జానకాపూర్, సౌల, రామారం గ్రామాల్లో గ్రామ కమిటీలను ఎన్నుకున్నట్లు తెలిపారు.

ఈ కార్యక్రమంలో జిల్లా ఉపాధ్యక్షులు రామిడి భగవంత్ రెడ్డి, గ్రామ నాయకులు తోక రాధా, పంపరి అనురాధ, తోక మల్లేశం, గడ్డం బాలరాజు, చిన్నాల బాలరాజు, సిహెచ్ గణేష్, ఎండి అన్వర్ తదితరులు పాల్గొన్నారు.

Sthanikam

వికలాంగుల పెన్షన్‌ను రూ.6 వేలకు పెంచాలి NPRD జిల్లా ప్రధాన కార్యదర్శి వనం ఉపేందర్

Article Image

బిబినగర్ : వికలాంగుల హక్కుల జాతీయ వేదిక (NPRD) రాష్ట్ర కమిటీ పిలుపు మేరకు మే 1 నుంచి 10 వరకు రాష్ట్రవ్యాప్తంగా వికలాంగులు ఎదుర్కొంటున్న సమస్యలపై సర్వే నిర్వహిస్తున్నట్లు NPRD యాదాద్రి భువనగిరి జిల్లా ప్రధాన కార్యదర్శి వనం ఉపేందర్ తెలిపారు.

ఈ సందర్భంగా బిబినగర్ మండలంలోని నెమరుగొమల, జములాపేట్, జియ్యాపల్లి, రాయరపేట్ గ్రామాల్లో సర్వే నిర్వహించి వికలాంగుల సమస్యలను తెలుసుకున్నారు. సదరం సర్టిఫికెట్, UDID కార్డులు ఉన్నప్పటికీ గత ఐదేళ్లుగా పెన్షన్ కోసం ఎదురు చూస్తున్నామని పలువురు వికలాంగులు ఆవేదన వ్యక్తం చేసినట్లు తెలిపారు.

వికలాంగులకు ఉపాధి అవకాశాలు కల్పించడంతో పాటు ప్రతి ఒక్కరికీ ఇందిరమ్మ ఇళ్లు మంజూరు చేయాలని డిమాండ్ చేశారు. ఎన్నికల సమయంలో వికలాంగులకు రూ.6 వేల పెన్షన్ ఇస్తామని హామీ ఇచ్చిన ప్రభుత్వం రెండున్నరేళ్లు గడిచినా అమలు చేయలేదని విమర్శించారు. తక్షణమే పెన్షన్ పెంపుతో పాటు కొత్త పెన్షన్లు మంజూరు చేయాలని కోరారు.

అలాగే చిర్రగూడూరు, జానకాపూర్, సౌల, రామారం గ్రామాల్లో గ్రామ కమిటీలను ఎన్నుకున్నట్లు తెలిపారు.

ఈ కార్యక్రమంలో జిల్లా ఉపాధ్యక్షులు రామిడి భగవంత్ రెడ్డి, గ్రామ నాయకులు తోక రాధా, పంపరి అనురాధ, తోక మల్లేశం, గడ్డం బాలరాజు, చిన్నాల బాలరాజు, సిహెచ్ గణేష్, ఎండి అన్వర్ తదితరులు పాల్గొన్నారు.

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.


కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News