రామన్నపేట, మండలంలో పదో తరగతి ఫలితాల్లో స్థానిక మదర్ థెరిసా పాఠశాల విద్యార్థులు సత్తా చాటారు. విద్యార్థిని ఎన్. ప్రసన్న 600 మార్కులకు గాను 576 మార్కులు సాధించి మండల స్థాయిలో తొలి స్థానంలో నిలిచి పాఠశాలకు గర్వకారణంగా నిలిచింది. మరో విద్యార్థి పి. విష్ణువర్ధన్ 569 మార్కులు సాధించి ప్రతిభ కనబరిచాడు. పాఠశాల 100 శాతం ఉత్తీర్ణత సాధించడం విశేషం.
విద్యార్థుల విజయంపై స్థానిక ఎమ్మెల్యే వేముల వీరేశం హర్షం వ్యక్తం చేస్తూ వారిని ప్రత్యేకంగా అభినందించారు. భవిష్యత్తులో మరింత ఉన్నత స్థాయికి చేరుకోవాలని ఆకాంక్షించారు.
ఈ కార్యక్రమంలో పాఠశాల కరస్పాండెంట్ జె.ఎస్. మార్టిన్, ఉపాధ్యాయులు తదితరులు పాల్గొన్నారు.

















































పాఠకుల అభిప్రాయాలు
ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.
కామెంట్ను పోస్ట్ చేయండి