Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
జన్మదిన వేడుకలు రద్దు.. మృతుడి కుటుంబానికి రూ.8 లక్షల సాయం అధికారులారా.. మాదాహార్తిని తీర్చండి జనరల్ పవర్ ఆఫ్ అటార్నీ నమూనా మట్టి వాసనలో మన సంస్కృతి.. జానపద కళల్లో తరతరాల జీవన గాథ హెచ్ఆర్పీఎం సంస్థ ఉమెన్ సెల్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర జాయింట్ సెక్రటరీగా :- పండ్ల లక్ష్మీదేవి న్యాల్కల్‌లో భక్తిశ్రద్ధలతో నాగుల పంచమి వేడుకలు డి ఎం & హెచ్ ఓ కీ వినతి పత్రం డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ స్ఫూర్తి పెండ్లి పోలీసింగ్ క్రికెట్ టోర్నమెంట్ ను ప్రారంభించిన జిల్లా ఎస్పీ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: August 25, 2026 07:26 AM

​అప్పు తీర్చమన్నందుకు వృద్ధురాలి హత్య: నిందితుడి అరెస్ట్

​అప్పు తీర్చమన్నందుకు వృద్ధురాలి హత్య: నిందితుడి అరెస్ట్

​అప్పు తీర్చమన్నందుకు వృద్ధురాలి హత్య: నిందితుడి అరెస్ట్
06-05-2026 22 Views
Reporter
స్థానికం ప్రతినిధి : Sub Editor
Komidala Mahender reddy

అప్పు తీర్చమని ఒత్తిడి చేసినందుకు వృద్ధురాలిని హత్య చేసిన కేసులో నిందితుడిని నార్కట్‌పల్లి పోలీసులు బుధవారం అరెస్ట్ చేశారు. నలగొండ డీఎస్పీ శివరాం రెడ్డి తెలిపిన వివరాల ప్రకారం బ్రాహ్మణ వెల్లంల గ్రామానికి చెందిన రెబ్బ జానకమ్మ (72) వద్ద అదే గ్రామానికి చెందిన కొలను కార్తీక్ (24) రూ. 1.18 లక్షలు అప్పు తీసుకున్నాడు. ఆ డబ్బు తిరిగి ఇవ్వాలని ఆమె ఒత్తిడి చేయడంతో, 2024 ఆగస్టు 2న ఆమెను గొంతు నులిమి హత్య చేసి బంగారం దోచుకెళ్లాడు. అనంతరం విజయవాడలో తలదాచుకున్న నిందితుడు, మంగళవారం తిరిగి గ్రామానికి వస్తుండగా పోలీసులు నిఘా ఉంచి పట్టుకున్నారు. నిందితుడి నుంచి బైక్‌ను స్వాధీనం చేసుకుని రిమాండ్‌కు తరలించారు. ఈ కేసును ఛేదించడంలో చురుకైన పాత్ర పోషించిన నార్కట్‌పల్లి సీఐ నాగరాజు, ఎస్సై విష్ణుమూర్తి, హెడ్ కానిస్టేబుల్ మధు, కానిస్టేబుళ్లు సత్యనారాయణ, గిరిబాబు, సాయి లను జిల్లా ఎస్పీ ప్రత్యేకంగా అభినందించారు.

Sthanikam

​అప్పు తీర్చమన్నందుకు వృద్ధురాలి హత్య: నిందితుడి అరెస్ట్

Article Image

అప్పు తీర్చమని ఒత్తిడి చేసినందుకు వృద్ధురాలిని హత్య చేసిన కేసులో నిందితుడిని నార్కట్‌పల్లి పోలీసులు బుధవారం అరెస్ట్ చేశారు. నలగొండ డీఎస్పీ శివరాం రెడ్డి తెలిపిన వివరాల ప్రకారం బ్రాహ్మణ వెల్లంల గ్రామానికి చెందిన రెబ్బ జానకమ్మ (72) వద్ద అదే గ్రామానికి చెందిన కొలను కార్తీక్ (24) రూ. 1.18 లక్షలు అప్పు తీసుకున్నాడు. ఆ డబ్బు తిరిగి ఇవ్వాలని ఆమె ఒత్తిడి చేయడంతో, 2024 ఆగస్టు 2న ఆమెను గొంతు నులిమి హత్య చేసి బంగారం దోచుకెళ్లాడు. అనంతరం విజయవాడలో తలదాచుకున్న నిందితుడు, మంగళవారం తిరిగి గ్రామానికి వస్తుండగా పోలీసులు నిఘా ఉంచి పట్టుకున్నారు. నిందితుడి నుంచి బైక్‌ను స్వాధీనం చేసుకుని రిమాండ్‌కు తరలించారు. ఈ కేసును ఛేదించడంలో చురుకైన పాత్ర పోషించిన నార్కట్‌పల్లి సీఐ నాగరాజు, ఎస్సై విష్ణుమూర్తి, హెడ్ కానిస్టేబుల్ మధు, కానిస్టేబుళ్లు సత్యనారాయణ, గిరిబాబు, సాయి లను జిల్లా ఎస్పీ ప్రత్యేకంగా అభినందించారు.

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.


కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News