అప్పు తీర్చమన్నందుకు వృద్ధురాలి హత్య: నిందితుడి అరెస్ట్
అప్పు తీర్చమన్నందుకు వృద్ధురాలి హత్య: నిందితుడి అరెస్ట్
Komidala Mahender reddy
అప్పు తీర్చమని ఒత్తిడి చేసినందుకు వృద్ధురాలిని హత్య చేసిన కేసులో నిందితుడిని నార్కట్పల్లి పోలీసులు బుధవారం అరెస్ట్ చేశారు. నలగొండ డీఎస్పీ శివరాం రెడ్డి తెలిపిన వివరాల ప్రకారం బ్రాహ్మణ వెల్లంల గ్రామానికి చెందిన రెబ్బ జానకమ్మ (72) వద్ద అదే గ్రామానికి చెందిన కొలను కార్తీక్ (24) రూ. 1.18 లక్షలు అప్పు తీసుకున్నాడు. ఆ డబ్బు తిరిగి ఇవ్వాలని ఆమె ఒత్తిడి చేయడంతో, 2024 ఆగస్టు 2న ఆమెను గొంతు నులిమి హత్య చేసి బంగారం దోచుకెళ్లాడు. అనంతరం విజయవాడలో తలదాచుకున్న నిందితుడు, మంగళవారం తిరిగి గ్రామానికి వస్తుండగా పోలీసులు నిఘా ఉంచి పట్టుకున్నారు. నిందితుడి నుంచి బైక్ను స్వాధీనం చేసుకుని రిమాండ్కు తరలించారు. ఈ కేసును ఛేదించడంలో చురుకైన పాత్ర పోషించిన నార్కట్పల్లి సీఐ నాగరాజు, ఎస్సై విష్ణుమూర్తి, హెడ్ కానిస్టేబుల్ మధు, కానిస్టేబుళ్లు సత్యనారాయణ, గిరిబాబు, సాయి లను జిల్లా ఎస్పీ ప్రత్యేకంగా అభినందించారు.

















































పాఠకుల అభిప్రాయాలు
ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.
కామెంట్ను పోస్ట్ చేయండి