Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
ప్రభుత్వ పాఠశాలల సమస్యల పరిష్కారానికి SFI ధర్నా 20 వేల పోలీస్ ఉద్యోగాల నోటిఫికేషన్ విడుదల చేయాలి.. జేఏసీ నేతల హెచ్చరిక ధర్మవరం పట్టణంలోని వన్ టౌన్ ఎస్సైగా బాధ్యతలను స్వీకరించిన ఇషాక్ భాషా నేరం చేసిన వారు చట్టం నుంచి తప్పించుకోలేరు – జిల్లా ఎస్పీ ఎస్.సతీష్ కుమార్ రొద్దంలో ఘనంగా అనంతశక్తి సొసైటీ 27వ వార్షిక మహాసభ డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ కొత్తచెరువు లో జేసీ ప్రభాకర్ రెడ్డి పుట్టినరోజు వేడుకలు స్ఫూర్తి పెండ్లి పోలీసింగ్ క్రికెట్ టోర్నమెంట్ ను ప్రారంభించిన జిల్లా ఎస్పీ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ హనుమంతుని పూజలో పాల్గొన్న జనసేన నాయకులు, మార్కెట్ కమిటీ చైర్మన్ పూల శివప్రసాద్. ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: July 03, 2026 03:26 PM

​అప్పు తీర్చమన్నందుకు వృద్ధురాలి హత్య: నిందితుడి అరెస్ట్

​అప్పు తీర్చమన్నందుకు వృద్ధురాలి హత్య: నిందితుడి అరెస్ట్

​అప్పు తీర్చమన్నందుకు వృద్ధురాలి హత్య: నిందితుడి అరెస్ట్
May 06, 2026 06:37 PM 16 Views
Reporter
స్థానికం ప్రతినిధి : Sub Editor
Komidala Mahender reddy

అప్పు తీర్చమని ఒత్తిడి చేసినందుకు వృద్ధురాలిని హత్య చేసిన కేసులో నిందితుడిని నార్కట్‌పల్లి పోలీసులు బుధవారం అరెస్ట్ చేశారు. నలగొండ డీఎస్పీ శివరాం రెడ్డి తెలిపిన వివరాల ప్రకారం బ్రాహ్మణ వెల్లంల గ్రామానికి చెందిన రెబ్బ జానకమ్మ (72) వద్ద అదే గ్రామానికి చెందిన కొలను కార్తీక్ (24) రూ. 1.18 లక్షలు అప్పు తీసుకున్నాడు. ఆ డబ్బు తిరిగి ఇవ్వాలని ఆమె ఒత్తిడి చేయడంతో, 2024 ఆగస్టు 2న ఆమెను గొంతు నులిమి హత్య చేసి బంగారం దోచుకెళ్లాడు. అనంతరం విజయవాడలో తలదాచుకున్న నిందితుడు, మంగళవారం తిరిగి గ్రామానికి వస్తుండగా పోలీసులు నిఘా ఉంచి పట్టుకున్నారు. నిందితుడి నుంచి బైక్‌ను స్వాధీనం చేసుకుని రిమాండ్‌కు తరలించారు. ఈ కేసును ఛేదించడంలో చురుకైన పాత్ర పోషించిన నార్కట్‌పల్లి సీఐ నాగరాజు, ఎస్సై విష్ణుమూర్తి, హెడ్ కానిస్టేబుల్ మధు, కానిస్టేబుళ్లు సత్యనారాయణ, గిరిబాబు, సాయి లను జిల్లా ఎస్పీ ప్రత్యేకంగా అభినందించారు.

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.


కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News