Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
మొక్కలు నాటుతూ పర్యావరణ పరిరక్షణకు పిలుపు:గ్రామ సర్పంచ్ ప్రియాంక రాజేందర్ అధికారులారా.. మాదాహార్తిని తీర్చండి జనరల్ పవర్ ఆఫ్ అటార్నీ నమూనా మట్టి వాసనలో మన సంస్కృతి.. జానపద కళల్లో తరతరాల జీవన గాథ హెచ్ఆర్పీఎం సంస్థ ఉమెన్ సెల్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర జాయింట్ సెక్రటరీగా :- పండ్ల లక్ష్మీదేవి న్యాల్కల్‌లో భక్తిశ్రద్ధలతో నాగుల పంచమి వేడుకలు డి ఎం & హెచ్ ఓ కీ వినతి పత్రం డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ స్ఫూర్తి పెండ్లి పోలీసింగ్ క్రికెట్ టోర్నమెంట్ ను ప్రారంభించిన జిల్లా ఎస్పీ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: August 26, 2026 01:12 AM

కాంగ్రెస్ నాయకుల భాష దారుణం : చిరుమర్తి లింగయ్య

కాంగ్రెస్ నాయకుల భాష దారుణం : చిరుమర్తి లింగయ్య

కాంగ్రెస్ నాయకుల భాష దారుణం : చిరుమర్తి లింగయ్య
07-05-2026 74 Views
Reporter
స్థానికం ప్రధాన ప్రతినిధి : తెలంగాణ / ఆంధ్రప్రదేశ్
Editor Desk

నల్లగొండ జిల్లా : జిల్లా పార్టీ కార్యాలయంలో నిర్వహించిన విలేఖరుల సమావేశంలో నకిరేకల్ మాజీ ఎమ్మెల్యే చిరుమర్తి లింగయ్య మాట్లాడారు. బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్, మాజీ మంత్రి హరీశ్ రావుపై కాంగ్రెస్ నాయకులు చేస్తున్న వ్యాఖ్యలపై ఆయన స్పందించారు.

రాష్ట్రంలో కాంగ్రెస్ నాయకుల భాష సరిగా లేదని, ప్రభుత్వాన్ని ప్రశ్నించే ప్రతిపక్ష నాయకులపై కేసులు నమోదు చేస్తున్నారని ఆయన అన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజలకు ఇచ్చిన హామీల అమలులో విఫలమైందని విమర్శించారు.

వరంగల్ రైతు డిక్లరేషన్ ద్వారా రైతులకు ఇచ్చిన హామీలు అమలు కాలేదని పేర్కొన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వ విధానాలను ప్రజలకు వివరిస్తున్నందుకే బీఆర్ఎస్ నాయకులపై విమర్శలు చేస్తున్నారని తెలిపారు.

ఆలేరు ఎమ్మెల్యే బీర్ల అయిలయ్యపై కూడా ఆయన స్పందిస్తూ, హరీశ్ రావుపై చేసిన వ్యాఖ్యలు సరైనవి కావని అన్నారు. భూ వ్యవహారాలపై పూర్తి స్థాయిలో విచారణ జరపాలని డిమాండ్ చేశారు.

నల్లగొండ జిల్లా పరిసర ప్రాంతాల్లో జరుగుతున్న భూకబ్జాలు, బెదిరింపుల అంశాలపై ప్రభుత్వం దృష్టి సారించాలని కోరారు.

Sthanikam

కాంగ్రెస్ నాయకుల భాష దారుణం : చిరుమర్తి లింగయ్య

Article Image

నల్లగొండ జిల్లా : జిల్లా పార్టీ కార్యాలయంలో నిర్వహించిన విలేఖరుల సమావేశంలో నకిరేకల్ మాజీ ఎమ్మెల్యే చిరుమర్తి లింగయ్య మాట్లాడారు. బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్, మాజీ మంత్రి హరీశ్ రావుపై కాంగ్రెస్ నాయకులు చేస్తున్న వ్యాఖ్యలపై ఆయన స్పందించారు.

రాష్ట్రంలో కాంగ్రెస్ నాయకుల భాష సరిగా లేదని, ప్రభుత్వాన్ని ప్రశ్నించే ప్రతిపక్ష నాయకులపై కేసులు నమోదు చేస్తున్నారని ఆయన అన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజలకు ఇచ్చిన హామీల అమలులో విఫలమైందని విమర్శించారు.

వరంగల్ రైతు డిక్లరేషన్ ద్వారా రైతులకు ఇచ్చిన హామీలు అమలు కాలేదని పేర్కొన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వ విధానాలను ప్రజలకు వివరిస్తున్నందుకే బీఆర్ఎస్ నాయకులపై విమర్శలు చేస్తున్నారని తెలిపారు.

ఆలేరు ఎమ్మెల్యే బీర్ల అయిలయ్యపై కూడా ఆయన స్పందిస్తూ, హరీశ్ రావుపై చేసిన వ్యాఖ్యలు సరైనవి కావని అన్నారు. భూ వ్యవహారాలపై పూర్తి స్థాయిలో విచారణ జరపాలని డిమాండ్ చేశారు.

నల్లగొండ జిల్లా పరిసర ప్రాంతాల్లో జరుగుతున్న భూకబ్జాలు, బెదిరింపుల అంశాలపై ప్రభుత్వం దృష్టి సారించాలని కోరారు.

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.


కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News