కాంగ్రెస్ నాయకుల భాష దారుణం : చిరుమర్తి లింగయ్య
కాంగ్రెస్ నాయకుల భాష దారుణం : చిరుమర్తి లింగయ్య
Editor Desk
నల్లగొండ జిల్లా : జిల్లా పార్టీ కార్యాలయంలో నిర్వహించిన విలేఖరుల సమావేశంలో నకిరేకల్ మాజీ ఎమ్మెల్యే చిరుమర్తి లింగయ్య మాట్లాడారు. బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్, మాజీ మంత్రి హరీశ్ రావుపై కాంగ్రెస్ నాయకులు చేస్తున్న వ్యాఖ్యలపై ఆయన స్పందించారు.
రాష్ట్రంలో కాంగ్రెస్ నాయకుల భాష సరిగా లేదని, ప్రభుత్వాన్ని ప్రశ్నించే ప్రతిపక్ష నాయకులపై కేసులు నమోదు చేస్తున్నారని ఆయన అన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజలకు ఇచ్చిన హామీల అమలులో విఫలమైందని విమర్శించారు.
వరంగల్ రైతు డిక్లరేషన్ ద్వారా రైతులకు ఇచ్చిన హామీలు అమలు కాలేదని పేర్కొన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వ విధానాలను ప్రజలకు వివరిస్తున్నందుకే బీఆర్ఎస్ నాయకులపై విమర్శలు చేస్తున్నారని తెలిపారు.
ఆలేరు ఎమ్మెల్యే బీర్ల అయిలయ్యపై కూడా ఆయన స్పందిస్తూ, హరీశ్ రావుపై చేసిన వ్యాఖ్యలు సరైనవి కావని అన్నారు. భూ వ్యవహారాలపై పూర్తి స్థాయిలో విచారణ జరపాలని డిమాండ్ చేశారు.
నల్లగొండ జిల్లా పరిసర ప్రాంతాల్లో జరుగుతున్న భూకబ్జాలు, బెదిరింపుల అంశాలపై ప్రభుత్వం దృష్టి సారించాలని కోరారు.

















































పాఠకుల అభిప్రాయాలు
ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.
కామెంట్ను పోస్ట్ చేయండి