చనుబండలో వరి నాట్లను క్షేత్ర స్థాయిలో పరిశీలించి వరి, మొక్కజొన్న సాగు లో రైతులకు తగిన సలహాలు సూచనలు అందజేసిన ఏవో బి శివశంకర్
చనుబండలో వరి నాట్లను క్షేత్ర స్థాయిలో పరిశీలించి వరి, మొక్కజొన్న సాగు లో రైతులకు తగిన సలహాలు సూచనలు అందజేసిన ఏవో బి శివశంకర్
GADDAM JAGANMOHAN REDDY
చాట్రాయి జనవరి 17(స్ధానికం న్యూస్ ఏపీ స్టేట్ బ్యూరో గడ్డం జగన్మోహన్ రెడ్డి) ఏలూరు జిల్లా నూజివీడు నియోజకవర్గం చాట్రాయి మండలం చనుబండ గ్రామంలో క్షేత్ర స్థాయిలో వరినాట్లను పరిశీలించిన ఏవో బి శివశంకర్ మాట్లాడుతూ చాట్రాయి మండలంలో మొక్కజొన్న ఎనిమిది వేల ఎకరాలలో కమర్షియల్ మరియు సీడ్ మొక్కజొన్న సాగు చేస్తున్నారని మొక్కజొన్నతో పాటుగా ఇప్పటివరకు వరి పంట ఈ రబీ సీజన్ కు గాను 500 ఎకరాలు నాట్లు వేసి ఉన్నారని వరి నాట్లు మరియు నారుమడి దశలో రైతులు కచ్చితంగా సస్యరక్షణ చర్యలు చేపట్టాలని నారుమడిలో నారును తీసిన పిదప మొనల్ని తుంచటం ద్వారా కాండం తొలుచు పురుగు గుడ్లు లార్వాలను నియంత్రించవచ్చునని, క్లోరి ఫైరిఫాస్ 20 శాతం ఈసీ మందులో కట్టలను ముంచి నాటినట్లయితే 15 నుండి 20 రోజుల వరకు పంటను పురుగుల బారి నుండి కాపాడుకోవచ్చని, వరి రకాలు ఎంటియు1121, 1064 ఆర్ఎన్ఆర్ రకాలు సాగు చేస్తున్నారని, మొక్కజొన్న సాగులో రైతులు యూరియాను పంట అవసరాన్ని బట్టి మాత్రమే వాడాలని,అధికంగా యూరియా వాడటం వలన భూగర్భ జలాల్లో పరిమితికి మించిన నైట్రేట్ తాగే నీటిలో చేరి మన శరీరాల్లోకి ప్రవేశించి ఆరోగ్యం దెబ్బతింటుందని, నీటిలో నత్రజని ఫాస్ఫరస్ కారణంగా నాచు పెరిగి ఆక్సిజన్ తగ్గుతూ ఫలితంగా చేపలు ఇతర జలచరాలు చనిపోతాయని, కావున రైతులు యూరియాని నియంత్రించుకొని సమతుల్యంగా వాడవలెనని తెలియజేశారు

















































పాఠకుల అభిప్రాయాలు
ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.
కామెంట్ను పోస్ట్ చేయండి