Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
Community Power for Health: Walkathon Sparks Preventive Care Movement సమానత్వానికి మార్గదర్శి పూలే – నేటికీ స్ఫూర్తి: ప్రధాని మోదీ సోమందేపల్లి యువతి సాహితకు పట్టా ప్రదానం పెట్టుబడి సున్నా.. ఆదాయం మిన్న! కొత్త తరం బిజినెస్ ఐడియాలు! ఈడెన్‌లో ముకుల్ 'తుపాన్'.. లక్నో సూపర్ విక్టరీ! ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు “ఆయన స్వతంత్ర మార్గంలో ప్రయాణిస్తే దేశవ్యాప్తంగా ఒక కొత్త యువ కేంద్రీకృత రాజకీయ శక్తిగా ఎదుగుతారు” “పూరీ ఆలయం కింద బయటపడ్డ పురాతన భూగర్భ నగరం: జగన్నాథుడి ‘మూలాలు’ ఇప్పుడు ప్రపంచం ముందుకు” “జర్మనీ హైడ్రోజన్ రైళ్లు: పర్యావరణానికి శుభసూచి కలిగించే భవిష్యత్తు టెక్నాలజీ” “64 గ్రాముల సృష్టిలో అంతరిక్ష చరిత్ర: కలాంసాట్ వెనుక రిఫత్ షారూక్ సంచలనం” ఓటీటీలోకి వాలెంటైన్స్ డే హిట్ 'పూకీ'.. కుర్రకారును ఫిదా చేసిన జెన్-జీ లవ్ స్టోరీ!
Sthanikam
PRINT TIME: April 11, 2026 02:02 PM

చనుబండలో పశు వైద్య శిబిరంలో పాల్గొన్న పిఏసియస్ ఛైర్పర్సన్ మోరంపూడి శ్రీనివాసరావు

చనుబండలో పశు వైద్య శిబిరంలో పాల్గొన్న పిఏసియస్ ఛైర్పర్సన్ మోరంపూడి శ్రీనివాసరావు

చనుబండలో పశు వైద్య శిబిరంలో పాల్గొన్న పిఏసియస్ ఛైర్పర్సన్ మోరంపూడి శ్రీనివాసరావు
January 21, 2026 01:05 PM 60 Views
Reporter
స్థానికం ప్రతినిధి : ఇంచార్జ్, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం
GADDAM JAGANMOHAN REDDY

చాట్రాయి జనవరి 21(స్ధానికం న్యూస్ ఏపీ స్టేట్ బ్యూరో గడ్డం జగన్మోహన్ రెడ్డి) ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం పశు పోషకులకు అత్యధిక ప్రాధాన్యతనిస్తూ, బడ్జెట్ లో తగిన నిధులు కేటాయిస్తూ వారి ఆర్థికాభివృద్ధికి తోడ్పాటునందిస్తున్నదని చనుబండ పీ ఏ సీ ఎస్ ఛైర్మన్ మోరంపూడి శ్రీనివాస రావు పేర్కొన్నారు. బుధవారం ఉదయం చాట్రాయి మండలం, చనుబండ గ్రామంలో పశువైద్యశాల వద్ద పశుసంవర్ధక శాఖ ఆధ్వర్యంలో ఉచిత పశు ఆరోగ్య శిబిరం ను మోరంపూడి శ్రీనివాస రావు, నెక్కళకపు వెంకటేశ్వర రావు (చౌదరి),చీదిరాల మారేశ్వర రావు, కొత్తగుండ్ల రమేష్ లు ప్రారంభించి రైతులకు మినరల్ మిక్చర్,నత్తలనివారణ మందులు, ఇతర మందులు, టానిక్ లు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా మోరంపూడి మాట్లాడుతూ చంద్ర బాబు స్వర్ణాంధ్ర - 2047 ఆశయాలకు అనుగుణంగా పశువుల ఆరోగ్య పరిరక్షణ, ఉత్పాదకత పెంపుదల, వ్యాధుల నియంత్రణ, శాస్త్రీయ పశు యాజమాన్యం, గోకులాలు, పశుగ్రాసాల పెంపకం వంటి వినూత్న కార్యక్రమాలు అమలు చేస్తూ,రాష్ట్రంలోని పశు పోషకులకు ఆర్ధిక భరోసా కల్పిస్తూ, రాష్ట్ర ప్రభుత్వం రైతులకు జీవనోపాధిని అందిస్తోందని అన్నారు.రైతులు ఈ పశు వైద్య శిబిరాలను ఉపయోగించుకొని లబ్ది పొందాలని మోరంపూడి కోరారు.ఏదైనా పశువు ప్రమాదవశాత్తు మరణించిన ఎడల పశుపోషకులు ఆర్థికంగా నష్టపోకుండా ఆదుకునేందుకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు సంయుక్తంగా పశు బీమా పథకాన్ని అమలు చేస్తోందని మోరంపూడి చెప్పారు.ఈ కార్యక్రమంలో ఎల్ ఎస్ ఏ పవనకుమారి, నక్కా రాము,మిద్దె చెన్నారావు (పిల్లచెన్న),విస్సంపల్లి వేంకటేశ్వర రావు, విస్సంపల్లి యాకోబు, విస్సంపల్లి వెంకటేశు, చనుబండ, కృష్ణా రావుపాలెం పంచాయతీల రైతులు పాల్గొన్నారు.

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.


కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News