చనుబండ జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో ప్రేరణ స్పూర్తి" అనే స్టడీ మెటీరియల్ పుస్తకాల పంపిణీ లో పాల్గొన్న పిఎసిఎస్ చైర్మన్ మోరంపూడి శ్రీనివాస రావు
చనుబండ జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో ప్రేరణ స్పూర్తి" అనే స్టడీ మెటీరియల్ పుస్తకాల పంపిణీ లో పాల్గొన్న పిఎసిఎస్ చైర్మన్ మోరంపూడి శ్రీనివాస రావు
GADDAM JAGANMOHAN REDDY
"విద్వాన్ సర్వత్రా పూజ్యతే"అనే ఆర్యోక్తి అక్షర సత్యం అని చనుబండ పీ ఏ సీ ఎస్ ఛైర్మన్ మోరంపూడి శ్రీనివాస రావు అన్నారు.
మంగళవారం మధ్యాహ్నం చాట్రాయి మండలం, చనుబండ గ్రామంలోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో ఉమ్మడి కృష్ణా జిల్లా పరిషత్ వారు పంపిన "ప్రేరణ స్పూర్తి" అనే స్టడీ మెటీరియల్ పుస్తకాల పంపిణీ మోరంపూడి శ్రీనివాస రావు ముఖ్య అతిథిగా,ప్రధానోపాధ్యాయులు రవీంద్రనాథ్ అధ్యక్షతన జరిగినది. ఈ సందర్భంగా మాట్లాడుతూ విద్యార్థి దశలో 10 వ తరగతి బోర్డు పరీక్షలు చాలా కీలకం అని మోరంపూడి పేర్కొన్నారు.100 రోజుల కార్యక్రమంలో భాగంగా ఈ స్టడీ మెటీరియల్ స్టూడెంట్స్ కు చాలా ఉపయోగకరమని ఆయన అన్నారు. ఈ "ప్రేరణ స్పూర్తి"స్టడీ మెటీరియల్ ను బోర్డ్ పరీక్షకు ప్రిపేర్ కావడానికి అనుకూలంగా తయారు చేయడం జరిగిందనీ, ఈ స్టడీ మెటీరియల్ చదివి విధార్ధినీ,విధ్యార్ధులు మంచి మార్కులు సంపాదించుకుంటారని మోరంపూడి ఆశాభావం వ్యక్తం చేశారు.
విద్యాశాఖామంత్రి నారా లోకేష్ ప్రభుత్వ పాఠశాలలో విద్యా ప్రమాణాలను పెంచాలని తపన పడుతున్నారని మోరంపూడి అన్నారు.
ఈ చనుబండ గ్రామంలోని ఉన్నత పాఠశాల విద్యార్థిని,విద్యార్థులు ఈ స్టడీ మెటీరియల్ ను చక్కగా చదువుకొని మంచి ఫలితాలు సాధించాలని మోరంపూడి కోరారు. హెచ్ ఎం రవీంద్రనాథ్ కూడా స్టడీ మెటీరియల్ యొక్క ఉపయోగాలను స్టూడెంట్స్ కు తెలియ చేశారు.
ఈ కార్యక్రమంలో జిల్లా కిసాన్ మోర్చా ఉపాధ్యక్షుడు నెక్కళపు వెంకటేశ్వర రావు, పెద్ద చెరువు సాగు నీటి సంఘం వైస్ చైర్మన్ గవర వెంకటేశ్వర రావు,ఉపాధ్యాయిని, ఉపాధ్యాయులు,10 వ తరగతి స్టూడెంట్స్ పాల్గొన్నారు.

















































పాఠకుల అభిప్రాయాలు
ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.
కామెంట్ను పోస్ట్ చేయండి