చనుబండలో అగ్ని ప్రమాద బాధితునికి సాయం అందించిన టీడీపీ నేతలు
చనుబండలో అగ్ని ప్రమాద బాధితునికి సాయం అందించిన టీడీపీ నేతలు
GADDAM JAGANMOHAN REDDY
చాట్రాయి, ఏలూరు జిల్లా స్థానికం ప్రతినిధి గడ్డం జగన్మోహన్ రెడ్డి
ఆపదలో ఉన్న వారికి ఆపన్న హస్తం అందిస్తున్న రాష్ట్ర గృహ నిర్మాణ సమాచార మరియు పౌర సంబంధాల శాఖ మంత్రి కొలుసు పార్థ సారథి అభినందనీయులు అని చనుబండ పీ ఏ సీ ఎస్ ఛైర్మన్ మోరంపూడి శ్రీనివాస రావు అన్నారు. మంగళ వారం సాయంత్రం చాట్రాయి మండలం, చనుబండ గ్రామంలో సోమవారం నాడు దగ్ధమైన పూరింటి బాధిత కుటుంబానికి మంత్రి పార్థ సారథి రూ: 5000/లు పంపి తక్షణ సాయం గా అందజేయమని ఆదేశించిన మీదట మోరంపూడి శ్రీనివాస రావు, జక్కంపూడి ప్రదీప్ కుమార్, బన్నే వీరాస్వామి, నక్కా రాము, పరసా శ్రీను, గవర వెంకటేశ్వర రావు, గుడిమళ్ళ బ్రహ్మయ్య లు చిరగా గోపాల్ కుటుంబానికి అందజేయడం జరిగింది. ప్రభుత్వం నుంచి రావసిన సాయాన్ని కూడా త్వరలో వచ్చేలా మంత్రి సారథి చర్యలు తీసుకుంటానన్నారని మోరంపూడి తెలిపారు. మంత్రి వర్యుల సాయంతో ప్రభుత్వం నుండి పక్కా గృహం మంజూరయ్యేలాగా కృషి చేస్తామని మోరంపూడి అన్నారు.ఈ కార్యక్రమంలో ఫిరంగి పుల్లయ్య, బాల్ద భూషణం, బలువూరి బాలకృష్ణ, చిరగ మహేష్, భారత వెంకటేశ్వర రావు, ముద్దుల శ్రీను, కర్రిపోలు రాము, షేక్ మౌలాలి, జనసేన నాయకుడు విస్సంపల్లి రాజా కూటమి నాయకులు పాల్గొన్నారు.

















































పాఠకుల అభిప్రాయాలు
ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.
కామెంట్ను పోస్ట్ చేయండి