Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
ఉచిత రేషన్ బియ్యం పంపిణీకి కేంద్రం నిర్ణయం మూడు నెలల సరఫరా… పేదలకు ఉపశమనం: అక్కెనపల్లి సైదులు సమానత్వానికి మార్గదర్శి పూలే – నేటికీ స్ఫూర్తి: ప్రధాని మోదీ సోమందేపల్లి యువతి సాహితకు పట్టా ప్రదానం పెట్టుబడి సున్నా.. ఆదాయం మిన్న! కొత్త తరం బిజినెస్ ఐడియాలు! ఈడెన్‌లో ముకుల్ 'తుపాన్'.. లక్నో సూపర్ విక్టరీ! ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు “ఆయన స్వతంత్ర మార్గంలో ప్రయాణిస్తే దేశవ్యాప్తంగా ఒక కొత్త యువ కేంద్రీకృత రాజకీయ శక్తిగా ఎదుగుతారు” “పూరీ ఆలయం కింద బయటపడ్డ పురాతన భూగర్భ నగరం: జగన్నాథుడి ‘మూలాలు’ ఇప్పుడు ప్రపంచం ముందుకు” “జర్మనీ హైడ్రోజన్ రైళ్లు: పర్యావరణానికి శుభసూచి కలిగించే భవిష్యత్తు టెక్నాలజీ” “64 గ్రాముల సృష్టిలో అంతరిక్ష చరిత్ర: కలాంసాట్ వెనుక రిఫత్ షారూక్ సంచలనం” ఓటీటీలోకి వాలెంటైన్స్ డే హిట్ 'పూకీ'.. కుర్రకారును ఫిదా చేసిన జెన్-జీ లవ్ స్టోరీ!
Sthanikam
PRINT TIME: April 11, 2026 12:24 PM

చనుబండలో అగ్ని ప్రమాద బాధితునికి సాయం అందించిన టీడీపీ నేతలు

చనుబండలో అగ్ని ప్రమాద బాధితునికి సాయం అందించిన టీడీపీ నేతలు

చనుబండలో అగ్ని ప్రమాద బాధితునికి సాయం  అందించిన టీడీపీ నేతలు
January 07, 2026 12:59 AM 50 Views
Reporter
స్థానికం ప్రతినిధి : ఇంచార్జ్, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం
GADDAM JAGANMOHAN REDDY

చాట్రాయి, ఏలూరు జిల్లా స్థానికం ప్రతినిధి గడ్డం జగన్మోహన్ రెడ్డి

ఆపదలో ఉన్న వారికి ఆపన్న హస్తం అందిస్తున్న రాష్ట్ర గృహ నిర్మాణ సమాచార మరియు పౌర సంబంధాల శాఖ మంత్రి కొలుసు పార్థ సారథి అభినందనీయులు అని చనుబండ పీ ఏ సీ ఎస్ ఛైర్మన్ మోరంపూడి శ్రీనివాస రావు అన్నారు. మంగళ వారం సాయంత్రం చాట్రాయి మండలం, చనుబండ గ్రామంలో సోమవారం నాడు దగ్ధమైన పూరింటి బాధిత కుటుంబానికి మంత్రి పార్థ సారథి రూ: 5000/లు పంపి తక్షణ సాయం గా అందజేయమని ఆదేశించిన మీదట మోరంపూడి శ్రీనివాస రావు, జక్కంపూడి ప్రదీప్ కుమార్, బన్నే వీరాస్వామి, నక్కా రాము, పరసా శ్రీను, గవర వెంకటేశ్వర రావు, గుడిమళ్ళ బ్రహ్మయ్య లు చిరగా గోపాల్ కుటుంబానికి అందజేయడం జరిగింది. ప్రభుత్వం నుంచి రావసిన సాయాన్ని కూడా త్వరలో వచ్చేలా మంత్రి సారథి చర్యలు తీసుకుంటానన్నారని మోరంపూడి తెలిపారు. మంత్రి వర్యుల సాయంతో ప్రభుత్వం నుండి పక్కా గృహం మంజూరయ్యేలాగా కృషి చేస్తామని మోరంపూడి అన్నారు.ఈ కార్యక్రమంలో ఫిరంగి పుల్లయ్య, బాల్ద భూషణం, బలువూరి బాలకృష్ణ, చిరగ మహేష్, భారత వెంకటేశ్వర రావు, ముద్దుల శ్రీను, కర్రిపోలు రాము, షేక్ మౌలాలి, జనసేన నాయకుడు విస్సంపల్లి రాజా కూటమి నాయకులు పాల్గొన్నారు.

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.


కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News