చిట్యాల ప్రతినిధి రిపోర్టర్ ప్రశాంత్
చిట్యాల మండలం చిన్నకాపర్తి గ్రామం మోర్సుగూడెం లో బోడిగే చంద్రయ్య మృతి సమాచారం అందగానే గ్రామ సర్పంచ్ ఆవుల సుందర్ వారి నివాసానికి చేరుకుని భౌతికకాయంపై పూలమాల వేసి ఘనంగా నివాళులర్పించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ చంద్రయ్య మృతి,తీరని లోటు అని,కుటుంబ సభ్యులకు తన ప్రగాఢ సానుభూతిని తెలియజేశారు. ఈ కష్టసమయంలో కుటుంబానికి అండగా ఉంటామని ధైర్యం చెప్పారు. ఈ కార్యక్రమంలో గ్రామ ఉపసర్పంచ్ బెల్లంకొండ లావణ్య రఘు, వార్డు మెంబర్లు వలిగొండ కవిత సత్యనారాయణ, ఈరమళ్ళ దయాకర్, పల్లపు పరమేశ్వరి ప్రశాంత్ పొలిమేర దశరథ అలాగే ఇతర గ్రామ ప్రముఖులు, యువకులు పాల్గొని చంద్రయ్య కి నివాళులర్పించారు.

















































పాఠకుల అభిప్రాయాలు
ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.
కామెంట్ను పోస్ట్ చేయండి