Sthanikam - Truth Matters
Logo
Sthanikam
PRINT TIME: March 24, 2026 08:34 PM

చలివేంద్రం ప్రారంభించిన మాజీ ఎమ్మెల్యే చిరుమర్తి లింగయ్య

చలివేంద్రం ప్రారంభించిన మాజీ ఎమ్మెల్యే చిరుమర్తి లింగయ్య

చలివేంద్రం ప్రారంభించిన మాజీ ఎమ్మెల్యే చిరుమర్తి లింగయ్య
March 24, 2026 06:24 PM 14 Views
Reporter
స్థానికం ప్రతినిధి : Sub Editor
Komidala Mahender reddy

వేసవిలో సేవా కార్యక్రమానికి శ్రీకారం

మానవ సేవే మాధవ సేవ అని, వేసవిలో బాటసారుల దాహార్తిని తీర్చేందుకు చలివేంద్రాల ఏర్పాటు అభినందనీయమని నకిరేకల్ మాజీ ఎమ్మెల్యే చిరుమర్తి లింగయ్య అన్నారు.

నకిరేకల్ నియోజకవర్గం చిట్యాల మండలం వట్టిమర్తి గ్రామ స్టేజ్ వద్ద బీఆర్ఎస్ నాయకుడు అంజనపల్లి శివసాయి తండ్రి కీ.శే. అంజనపల్లి బిక్షం వర్ధంతిని పురస్కరించుకుని వారి జ్ఞాపకార్థం ఏర్పాటు చేసిన చలివేంద్రాన్ని చిరుమర్తి లింగయ్య ముఖ్య అతిథిగా హాజరై ప్రారంభించారు.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, తండ్రి జ్ఞాపకార్థం సామాజిక బాధ్యతతో శివసాయి చేపట్టిన ఈ సేవా కార్యక్రమం ఆదర్శనీయమని కొనియాడారు. ఎండలు తీవ్రంగా ఉన్న ఈ కాలంలో ప్రజలకు ఉపయోగపడే విధంగా సేవ చేయడం గొప్ప విషయమన్నారు.

ఈ కార్యక్రమంలో ఉప సర్పంచ్ బెల్లి భవాని తిరుమలేష్, బీఆర్ఎస్ నాయకులు నర్రా శ్రీకాంత్ రెడ్డి, మేడి కృష్ణయ్య, జాల ప్రకాష్, మేడి రాజు, వార్డు సభ్యులు జాల శిరీష, మేడి హరికృష్ణ, సిరిపంగి మధు, జాల సైదులు, సంకబుడ్డి జనార్ధన్, మునుగోటి సత్తయ్య, నరేందర్ రెడ్డి, దూదిగామ ప్రభాకర్, కార్యకర్తలు, అంజనపల్లి కుటుంబ సభ్యులు పాల్గొన్నారు.

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.


కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News