PRINT TIME: February 23, 2026 11:46 PM
చల్ల పర్వతాల జ్ఞాపకార్థం గ్రామపంచాయతీకి బీరువా బహూకరణ
చల్ల పర్వతాల జ్ఞాపకార్థం గ్రామపంచాయతీకి బీరువా బహూకరణ
February 10, 2026 12:40 PM
243 Views
స్థానికం ప్రధాన ప్రతినిధి :
తెలంగాణ / ఆంధ్రప్రదేశ్
స్థానికం బృందం
రామన్నపేట మండలం నిదానపల్లి గ్రామపంచాయతీ కార్యాలయంలో మంగళవారం గ్రామాభివృద్ధికి చిరస్మరణీయ సేవలు అందించిన చల్ల పర్వతాల జ్ఞాపకార్థంగా వారి కుమారుడు చల్ల అశోక్ గ్రామపంచాయతీకి బీరువాను బహూకరించారు. ఈ బీరువాను పంచాయతీ కార్యదర్శి సుమన్కు అధికారికంగా అందజేశారు.ఈ సందర్భంగా సర్పంచ్ నారాపాక మాధవి యాదయ్య మాట్లాడుతూ, చల్ల పర్వతాల సేవలను గ్రామం ఎప్పటికీ మరువదని, ఆయన జ్ఞాపకార్థంగా అందించిన ఈ బహుమతి కార్యాలయానికి ఎంతో ఉపయోగకరంగా నిలుస్తుందన్నారు. ఉపసర్పంచ్ కొండ అండాలు మల్లయ్య, నాయకులు భాషమల్ల సంతోష్ మాట్లాడుతూ దాతృత్వంతో ముందుకొచ్చిన చల్ల అశోక్ను అభినందించారు. ఈ కార్యక్రమంలో గ్రామపంచాయతీ సిబ్బంది కడారి భాగ్య తదితరులు పాల్గొన్నారు.

















































పాఠకుల అభిప్రాయాలు
ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.
కామెంట్ను పోస్ట్ చేయండి