PRINT TIME: July 10, 2026 11:06 PM
చాలకూరులో నీటి భద్రతపై గ్రామసభ నిర్వహణ
చాలకూరులో నీటి భద్రతపై గ్రామసభ నిర్వహణ
April 10, 2026 06:06 PM
127 Views
స్థానికం ప్రతినిధి :
Penukonda
EDIGA NAVEENKUMAR
శ్రీ సత్యసాయి జిల్లా సోమందేపల్లి మండలంలోని చాలకూరు గ్రామంలో ప్రభుత్వం ఆదేశాల మేరకు, రాష్ట్ర మంత్రివర్యులు మరియు పెనుకొండ నియోజకవర్గం ఎమ్మెల్యే సవితమ్మ సూచనలతో “నీటి భద్రత – సాగునీటి సంఘాల బాధ్యత” కార్యక్రమం కింద గ్రామసభ నిర్వహించారు.
ఈ సమావేశంలో సోమందేపల్లి తహసీల్దార్ పాల్గొని గ్రామస్థులకు నీటి వినియోగంపై అవగాహన కల్పించారు. నీటి వనరులను సంరక్షించడం, సాగునీటి సంఘాల పాత్రను బలోపేతం చేయడం ముఖ్యమని వివరించారు.
కార్యక్రమంలో 5 మంది కమిటీ సభ్యులు సిద్ధ లింగప్ప, భాను కీర్తి, ఉపాధి హామీ సిబ్బంది, స్వర్ణ గ్రామ సచివాలయ సిబ్బంది మరియు గ్రామ ప్రజలు పాల్గొన్నారు. గ్రామాభివృద్ధికి నీటి భద్రత కీలకమని అధికారులు సూచించారు.















































పాఠకుల అభిప్రాయాలు
ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.
కామెంట్ను పోస్ట్ చేయండి