Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
ఈసారి గోవధ వద్దు..! సామరస్యమే అసలైన ఖుర్బానీ కొత్తచెరువు లో జేసీ ప్రభాకర్ రెడ్డి పుట్టినరోజు వేడుకలు అక్రమ ఇసుక రవాణా టిప్పర్లను సీజ్ చేసిన అధికారులు హనుమకొండ సబ్‌రిజిస్ట్రార్ ఇంటిపై ఏసీబీ మెరుపుదాడులు.. రూ.10 కోట్లకు పైగా అక్రమాస్తుల వెలికితీత శ్రీ సత్యసాయి జిల్లాలో పర్యాటక రంగాభివృద్ధికి పటిష్ట చర్యలు జిల్లా కలెక్టర్ ఎ.శ్యామ్ ప్రసాద్ పార్థివ దేహానికి నివాళులర్పించిన రాష్ట్ర కార్యదర్శి సామకోటి స్ఫూర్తి పెండ్లి పోలీసింగ్ క్రికెట్ టోర్నమెంట్ ను ప్రారంభించిన జిల్లా ఎస్పీ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ హనుమంతుని పూజలో పాల్గొన్న జనసేన నాయకులు, మార్కెట్ కమిటీ చైర్మన్ పూల శివప్రసాద్. పెట్టుబడి సున్నా.. ఆదాయం మిన్న! కొత్త తరం బిజినెస్ ఐడియాలు! ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: May 26, 2026 09:41 PM

చిట్యాలలో ఘనంగా గుత్తా అమిత్ కుమార్ రెడ్డి జన్మదిన వేడుకలు

చిట్యాలలో ఘనంగా గుత్తా అమిత్ కుమార్ రెడ్డి జన్మదిన వేడుకలు

చిట్యాలలో ఘనంగా గుత్తా అమిత్ కుమార్ రెడ్డి జన్మదిన వేడుకలు
December 31, 2025 11:37 AM 716 Views
Reporter
స్థానికం ప్రధాన ప్రతినిధి : తెలంగాణ / ఆంధ్రప్రదేశ్
Editor Desk

సేవా కార్యక్రమాలతో చిట్యాలలో గుత్తా అమిత్ కుమార్ రెడ్డి జన్మదిన వేడుకలు

చిట్యాల స్థానికం ప్రతినిధి మహేందర్ రెడ్డి

చిట్యాల మండల కేంద్రంలో తెలంగాణ రాష్ట్ర డైరీ డెవలప్మెంట్ చైర్మన్ గుత్తా అమిత్ కుమార్ రెడ్డి జన్మదిన వేడుకలు బుధవారం ఘనంగా నిర్వహించారు. కాంగ్రెస్ పార్టీ జిల్లా నాయకులు పల్లపు బుద్ధుడు ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమానికి ప్రజాప్రతినిధులు, పార్టీ నాయకులు, కార్యకర్తలు పెద్ద సంఖ్యలో హాజరయ్యారు.

ఈ సందర్భంగా చిట్యాల ప్రభుత్వ ఆసుపత్రిలో రోగులకు పండ్ల పంపిణీ కార్యక్రమాన్ని నిర్వహించారు. చిట్యాల వ్యవసాయ మార్కెట్ కమిటీ డైరెక్టర్ కోనేటి యాదగిరి సమక్షంలో జరిగిన ఈ సేవా కార్యక్రమంలో ఉరుమడ్ల గ్రామపంచాయతీ వార్డు సభ్యుడు జన్నపాల శ్రీను పాల్గొని రోగులకు పండ్లు పంపిణీ చేశారు. ఆసుపత్రి వైద్యులు, సిబ్బంది ఈ కార్యక్రమానికి సహకారం అందించారు.

అనంతరం నార్కట్‌పల్లి శ్రీధర్మశాస్త్ర అయ్యప్ప స్వామి ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించి గుత్తా అమిత్ కుమార్ రెడ్డి నిండు నూరేళ్లు ఆయురారోగ్యాలతో, సుఖసంతోషాలతో ఉండాలని ఆకాంక్షించారు. జీవితంలో మరింత ఉన్నతమైన పదవులు అధిరోహించాలని కాంగ్రెస్ నాయకులు శుభాకాంక్షలు తెలిపారు.

ఈ కార్యక్రమాల్లో గురుస్వామి బెల్లి వెంకటేశ్వర్లు ప్రత్యేక పూజలను నిర్వహించగా, స్థానిక ప్రజలు, పార్టీ శ్రేణులు పాల్గొని వేడుకలను విజయవంతం చేశారు. సేవా కార్యక్రమాలతో పాటు ఆధ్యాత్మిక కార్యక్రమాలు సమన్వయంగా సాగడంతో జన్మదిన వేడుకలు ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి.

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.


కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News