Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
పెట్టుబడి సున్నా.. ఆదాయం మిన్న! కొత్త తరం బిజినెస్ ఐడియాలు! ఈడెన్‌లో ముకుల్ 'తుపాన్'.. లక్నో సూపర్ విక్టరీ! బస్టాండ్‌ వద్ద ‘అండర్‌ పాస్‌’ నిర్మించాలి ​- ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్‌రెడ్డికి కౌన్సిలర్‌ వినతి ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు “ఆయన స్వతంత్ర మార్గంలో ప్రయాణిస్తే దేశవ్యాప్తంగా ఒక కొత్త యువ కేంద్రీకృత రాజకీయ శక్తిగా ఎదుగుతారు” “పూరీ ఆలయం కింద బయటపడ్డ పురాతన భూగర్భ నగరం: జగన్నాథుడి ‘మూలాలు’ ఇప్పుడు ప్రపంచం ముందుకు” రంగేపల్లిలో అవగాహన సదస్సు విజయవంతం రంగేపల్లిలో అవగాహన సదస్సు విజయవంతం “గురుకుల ఔట్‌సోర్సింగ్, గెస్ట్, కాంట్రాక్ట్ టీచర్లకు ఉద్యోగ భద్రత, 12 నెలల జీతాలు కల్పించాలి: సిఐటియు డిమాండ్” “జర్మనీ హైడ్రోజన్ రైళ్లు: పర్యావరణానికి శుభసూచి కలిగించే భవిష్యత్తు టెక్నాలజీ” “64 గ్రాముల సృష్టిలో అంతరిక్ష చరిత్ర: కలాంసాట్ వెనుక రిఫత్ షారూక్ సంచలనం” ఓటీటీలోకి వాలెంటైన్స్ డే హిట్ 'పూకీ'.. కుర్రకారును ఫిదా చేసిన జెన్-జీ లవ్ స్టోరీ!
Sthanikam
PRINT TIME: April 10, 2026 07:50 AM

చిట్యాల సర్పంచుల ఫోరం ప్రతినిధుల భేటీ గ్రామాభివృద్ధికి ఐక్యతే మార్గం: ఎమ్మెల్యే వేముల వీరేశం

చిట్యాల సర్పంచుల ఫోరం ప్రతినిధుల భేటీ గ్రామాభివృద్ధికి ఐక్యతే మార్గం: ఎమ్మెల్యే వేముల వీరేశం

చిట్యాల సర్పంచుల ఫోరం ప్రతినిధుల భేటీ గ్రామాభివృద్ధికి ఐక్యతే మార్గం: ఎమ్మెల్యే వేముల వీరేశం
January 04, 2026 07:46 PM 263 Views
Reporter
స్థానికం ప్రధాన ప్రతినిధి : తెలంగాణ / ఆంధ్రప్రదేశ్
Editor Desk

చిట్యాల ప్రతినిధి స్థానికం

చిట్యాల మండల సర్పంచుల ఫోరం అధ్యక్షుడిగా ఎన్నికైన కాటం వెంకటేశం ఎమ్మెల్యే వేముల వీరేశాన్ని మర్యాదపూర్వకంగా కలిసి శాలువాతో సత్కరించి ఆశీర్వాదం తీసుకున్నారు. ఈ సందర్భంగా సర్పంచుల ఫోరం ప్రతినిధులతో ఎమ్మెల్యే సుదీర్ఘంగా చర్చించారు.ఎమ్మెల్యే వేముల వీరేశం మాట్లాడుతూ, సర్పంచులందరూ ఐక్యతతో పనిచేస్తేనే గ్రామాల సమగ్ర అభివృద్ధి సాధ్యమవుతుందన్నారు. గ్రామాల్లో ఎదురయ్యే ఏవైనా సమస్యలను తన దృష్టికి తీసుకురావాలని సూచిస్తూ, తన వంతుగా పరిష్కారం చూపుతానని హామీ ఇచ్చారు. ప్రజలకు మెరుగైన సేవలు అందించడమే లక్ష్యంగా ముందుకు సాగాలని పిలుపునిచ్చారు.


ఈ కార్యక్రమంలో సర్పంచుల ఫోరం ఉపాధ్యక్షులు జోగు సురేష్, తాళ్లవేలంల, ప్రధాన కార్యదర్శి ఆవుల సునీత–యాదయ్య (సంకెనపల్లి), కార్యదర్శి మిర్యాల వెంకటేశం (నేరడ), కోశాధికారి మహిపాల్ రెడ్డి (వణిపాకల)తో పాటు ఎలుకట్టి సర్పంచ్ సాగర్ల యాదమ్మ–యాదయ్య, బొంగుని చెరువు సర్పంచ్ కట్ట ఆశయ, చిన్నకాపర్తి సర్పంచ్ ఆవుల సుందర్, పిట్టంపల్లి సర్పంచ్ అందే అండాలు రాములు తదితరులు పాల్గొన్నారు.

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.


కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News