చిట్యాల సర్పంచుల ఫోరం ప్రతినిధుల భేటీ గ్రామాభివృద్ధికి ఐక్యతే మార్గం: ఎమ్మెల్యే వేముల వీరేశం
చిట్యాల సర్పంచుల ఫోరం ప్రతినిధుల భేటీ గ్రామాభివృద్ధికి ఐక్యతే మార్గం: ఎమ్మెల్యే వేముల వీరేశం
Editor Desk
చిట్యాల ప్రతినిధి స్థానికం
చిట్యాల మండల సర్పంచుల ఫోరం అధ్యక్షుడిగా ఎన్నికైన కాటం వెంకటేశం ఎమ్మెల్యే వేముల వీరేశాన్ని మర్యాదపూర్వకంగా కలిసి శాలువాతో సత్కరించి ఆశీర్వాదం తీసుకున్నారు. ఈ సందర్భంగా సర్పంచుల ఫోరం ప్రతినిధులతో ఎమ్మెల్యే సుదీర్ఘంగా చర్చించారు.ఎమ్మెల్యే వేముల వీరేశం మాట్లాడుతూ, సర్పంచులందరూ ఐక్యతతో పనిచేస్తేనే గ్రామాల సమగ్ర అభివృద్ధి సాధ్యమవుతుందన్నారు. గ్రామాల్లో ఎదురయ్యే ఏవైనా సమస్యలను తన దృష్టికి తీసుకురావాలని సూచిస్తూ, తన వంతుగా పరిష్కారం చూపుతానని హామీ ఇచ్చారు. ప్రజలకు మెరుగైన సేవలు అందించడమే లక్ష్యంగా ముందుకు సాగాలని పిలుపునిచ్చారు.
ఈ కార్యక్రమంలో సర్పంచుల ఫోరం ఉపాధ్యక్షులు జోగు సురేష్, తాళ్లవేలంల, ప్రధాన కార్యదర్శి ఆవుల సునీత–యాదయ్య (సంకెనపల్లి), కార్యదర్శి మిర్యాల వెంకటేశం (నేరడ), కోశాధికారి మహిపాల్ రెడ్డి (వణిపాకల)తో పాటు ఎలుకట్టి సర్పంచ్ సాగర్ల యాదమ్మ–యాదయ్య, బొంగుని చెరువు సర్పంచ్ కట్ట ఆశయ, చిన్నకాపర్తి సర్పంచ్ ఆవుల సుందర్, పిట్టంపల్లి సర్పంచ్ అందే అండాలు రాములు తదితరులు పాల్గొన్నారు.
















































పాఠకుల అభిప్రాయాలు
ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.
కామెంట్ను పోస్ట్ చేయండి