చిట్యాల లో ప్లై ఓవర్ రోడ్డు నిర్మాణం త్వరగా పూర్తి చేయాలి అని mro ఆఫీసు ముందు PRPS నాయకుల ధర్నా
చిట్యాల లో ప్లై ఓవర్ రోడ్డు నిర్మాణం త్వరగా పూర్తి చేయాలి అని mro ఆఫీసు ముందు PRPS నాయకుల ధర్నా
Komidala Mahender reddy
చిట్యాల లో గత సంవత్సరం.ప్లై ఓవర్ రోడ్డు నిర్మాణానికి శంకుస్థాపన చేయగా, నత్త నడక సాగుతుంది..అని PRPS రాష్ట్ర నాయకుడు నూనె వెంకట స్వామి అన్నారు. పట్టణ ప్రజలు ఉపయోగించే సర్వీస్ రోడ్లనే హైవే రోడ్లుగా మరల్చడం, అవి ట్రాఫిక్ ధాటికి, మోకాలి లోపలికి గుంతలు ఏర్పడడం, ప్రతి వాహనం టైర్లు ఎగిరిపడి, తీవ్ర ప్రమాదానికి గురవుతూ పట్టణ ప్రజలకు తీవ్ర అసౌకర్యం కలుగుతోందని, విపరీతమైన ప్రమాదాలు జరుగుతున్నాయని, కాంగ్రెస్ పార్టీ అధికార గణం గొప్పలకు పోయి, నిధులు లేకుండా పనులు ప్రారంభించి పట్టణ ప్రజలను, హైవే ప్రణ ప్రయాణికులను తీవ్ర ఇబ్బందులకు గురి చేస్తున్నారని, ఇది సహించలేని అంశమని, సంక్రాంతి పండుగ సందర్భంలో ఈ ట్రాఫిక్ మరింత పెరగనుందని, తక్షణం ఈ రోడ్డు నిర్మాణానికి తగిన నిధులను మంజూరు చేసి, గుత్తేదారు ద్వారా త్వరగా ఈ పనులను ముగించాలని, లేనిచో తీవ్రంగా పోరాడవలసి వస్తుందని" ప్రజా పోరాట సమితి (పిఆర్పిఎస్) రాష్ట్ర అధ్యక్షుడు నూనె వెంకట్ స్వామి హెచ్చరించారు.ఈరోజు చిట్యాల తహసిల్దార్ కార్యాలయం ముందు ప్రజా పోరాట సమితి (పిఆర్పిఎస్) ఆధ్వర్యంలో ధర్నా నిర్వహించారు.ఈ ధర్నాలో పిఆర్పిఎస్ నాయకులు నాగేళ్ల యాదయ్య, ఉయ్యాల లింగస్వామి, బర్రె సంజీవ, జిట్ట వెంకన్న, చిత్రగంటి నవీన్, పురం రాంబాబు, గడ్డం రాములు, గాద శ్రీహరి, బైరు వెంకన్న గౌడ్ మరియు ప్రజలు పాల్గొన్నారు.ధర్నా అనంతరం తహసిల్దార్ కు మెమొరాండాన్ని అందజేశారు

















































పాఠకుల అభిప్రాయాలు
ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.
కామెంట్ను పోస్ట్ చేయండి