చిట్యాల లొ తీవ్ర లో వోల్టేజ్ సమస్య
చిట్యాల లొ తీవ్ర లో వోల్టేజ్ సమస్య
Komidala Mahender reddy
100కేవిఏ ట్రాన్స్ఫార్మర్ మంజూరు చేయాలనీ డిమాండ్.
చిట్యాల స్థానికం ప్రతినిధి కొమిడాల మహేందర్ రెడ్డి.
చిట్యాల పట్టణంలోని 10వ వార్డు ముత్యాలమ్మ గుడి పరిసర ప్రాంతంలో తీవ్ర లో వోల్టేజ్ సమస్య ప్రజలను ఇబ్బందులకు గురి చేస్తోందని స్థానికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ప్రస్తుతం అక్కడ ఉన్న 160 కేవీఏ ట్రాన్స్ఫార్మర్పై 250 నుంచి 300 వరకు విద్యుత్ సర్వీసులు, 30–35 ఏసీలు, రెండు గ్రామపంచాయతీ మోటర్లు, రెండు ఇండస్ట్రియల్ కనెక్షన్లు ఉండటంతో అధిక లోడు పడుతున్నట్లు తెలుస్తోంది.
అధిక లోడ్ కారణంగా కేవలం 180 వోల్టేజీ మాత్రమే వస్తుండటంతో ఇళ్లల్లో మోటార్లు, ఫ్యాన్లు, లైట్లు, ఏసీలు సక్రమంగా పనిచేయడం లేదని స్థానికులు వాపోతున్నారు. వేసవికాలం సమీపిస్తున్న నేపథ్యంలో ఈ సమస్య మరింత తీవ్రమయ్యే ప్రమాదం ఉందని ఆందోళన వ్యక్తమవుతోంది.
ఈ నేపథ్యంలో ట్రాన్స్ఫార్మర్ పక్కనే మరో 100 కేవీఏ ట్రాన్స్ఫార్మర్ను తక్షణమే మంజూరు చేసి లో వోల్టేజ్ సమస్యను పరిష్కరించాలని బీజేపీ నాయకుడు, తెలంగాణ మలిదశ ఉద్యమ నేత చికిలం మెట్ల అశోక్ విద్యుత్ శాఖ ఉన్నతాధికారులు SE, DE, AD, AEలను కోరారు.
ప్రజల ఇబ్బందులను దృష్టిలో పెట్టుకుని అధికారులు వెంటనే స్పందించి చర్యలు తీసుకోవాలని ఆయన విజ్ఞప్తి చేశారు.

















































పాఠకుల అభిప్రాయాలు
ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.
కామెంట్ను పోస్ట్ చేయండి