Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
డెడ్ స్టోరేజ్‌లో కూడా రైతాంగానికి నీళ్లు ఇచ్చిన ఘనత కేసీఆర్,బీఆర్ఎస్ ప్రభుత్వానిది అధికారులారా.. మాదాహార్తిని తీర్చండి జనరల్ పవర్ ఆఫ్ అటార్నీ నమూనా మట్టి వాసనలో మన సంస్కృతి.. జానపద కళల్లో తరతరాల జీవన గాథ హెచ్ఆర్పీఎం సంస్థ ఉమెన్ సెల్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర జాయింట్ సెక్రటరీగా :- పండ్ల లక్ష్మీదేవి న్యాల్కల్‌లో భక్తిశ్రద్ధలతో నాగుల పంచమి వేడుకలు డి ఎం & హెచ్ ఓ కీ వినతి పత్రం డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ స్ఫూర్తి పెండ్లి పోలీసింగ్ క్రికెట్ టోర్నమెంట్ ను ప్రారంభించిన జిల్లా ఎస్పీ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: August 26, 2026 07:44 AM

చైనా మాంజా ముప్పు – నిర్లక్ష్యం ప్రాణాలకు ప్రమాదం

చైనా మాంజా ముప్పు – నిర్లక్ష్యం ప్రాణాలకు ప్రమాదం

చైనా మాంజా ముప్పు – నిర్లక్ష్యం ప్రాణాలకు ప్రమాదం
11-01-2026 135 Views
Reporter
స్థానికం ప్రతినిధి : Sub Editor
Krishna

ఉమ్మడి జిల్లా స్థానిక ప్రతినిధి కృష్ణ:మేడ్చల్ జిల్లా కీసర ప్రాంతంలో గాలిపటం చైనా మాంజాతో ఓ ద్విచక్ర వాహనదారుడు తీవ్రంగా గాయపడ్డ ఘటన జరిగింది. బైక్‌పై ప్రయాణిస్తున్న సమయంలో అకస్మాత్తుగా మెడకు మాంజా చుట్టుకోవడంతో లోతైన గాయం ఏర్పడింది. వెంటనే స్పందించిన స్థానికులు బాధితుడిని ఆసుపత్రికి తరలించగా, వైద్యులు మెడపై 19 కుట్లు వేశారు.సంక్రాంతి పండుగను ఆసరాగా చేసుకుని నిషేధిత చైనా మాంజా దొంగచాటుగా విక్రయాలు కొనసాగుతున్నాయి. ఈ మాంజా వల్ల పక్షులు, పాదచారులు, ద్విచక్ర వాహనదారులు తీవ్ర ప్రమాదాలకు గురవుతున్నారు. ఇప్పటికే పలువురు గాయపడిన ఘటనలు చోటు చేసుకున్నా కూడా కొందరు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారు.ఇలాంటి ప్రమాదాలు మళ్లీ జరగకుండా ఉండాలంటే ఇది ప్రభుత్వ బాధ్యత మాత్రమే కాదు, ప్రతి పౌరుడి బాధ్యత. చైనా మాంజా విక్రయిస్తున్న దుకాణాలు లేదా వ్యక్తుల గురించి సమాచారం తెలిసిన వెంటనే దగ్గరలోని పోలీస్ స్టేషన్‌కు తెలియజేయాలి.

*చిన్న నిర్లక్ష్యం పెద్ద ప్రమాదానికి దారి తీస్తుంది. అప్రమత్తంగా ఉండండి, ప్రాణాలను కాపాడండి.*

Sthanikam

చైనా మాంజా ముప్పు – నిర్లక్ష్యం ప్రాణాలకు ప్రమాదం

Article Image

ఉమ్మడి జిల్లా స్థానిక ప్రతినిధి కృష్ణ:మేడ్చల్ జిల్లా కీసర ప్రాంతంలో గాలిపటం చైనా మాంజాతో ఓ ద్విచక్ర వాహనదారుడు తీవ్రంగా గాయపడ్డ ఘటన జరిగింది. బైక్‌పై ప్రయాణిస్తున్న సమయంలో అకస్మాత్తుగా మెడకు మాంజా చుట్టుకోవడంతో లోతైన గాయం ఏర్పడింది. వెంటనే స్పందించిన స్థానికులు బాధితుడిని ఆసుపత్రికి తరలించగా, వైద్యులు మెడపై 19 కుట్లు వేశారు.సంక్రాంతి పండుగను ఆసరాగా చేసుకుని నిషేధిత చైనా మాంజా దొంగచాటుగా విక్రయాలు కొనసాగుతున్నాయి. ఈ మాంజా వల్ల పక్షులు, పాదచారులు, ద్విచక్ర వాహనదారులు తీవ్ర ప్రమాదాలకు గురవుతున్నారు. ఇప్పటికే పలువురు గాయపడిన ఘటనలు చోటు చేసుకున్నా కూడా కొందరు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారు.ఇలాంటి ప్రమాదాలు మళ్లీ జరగకుండా ఉండాలంటే ఇది ప్రభుత్వ బాధ్యత మాత్రమే కాదు, ప్రతి పౌరుడి బాధ్యత. చైనా మాంజా విక్రయిస్తున్న దుకాణాలు లేదా వ్యక్తుల గురించి సమాచారం తెలిసిన వెంటనే దగ్గరలోని పోలీస్ స్టేషన్‌కు తెలియజేయాలి.

*చిన్న నిర్లక్ష్యం పెద్ద ప్రమాదానికి దారి తీస్తుంది. అప్రమత్తంగా ఉండండి, ప్రాణాలను కాపాడండి.*

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.


కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News