PRINT TIME: May 26, 2026 10:39 PM
చెన్నకేశవ ఆలయంలో ధనుర్మాస ఉత్సవాలకు శాశ్వత నిధి. బడుగు నీరజ
చెన్నకేశవ ఆలయంలో ధనుర్మాస ఉత్సవాలకు శాశ్వత నిధి. బడుగు నీరజ
January 04, 2026 09:21 AM
108 Views
స్థానికం ప్రధాన ప్రతినిధి :
తెలంగాణ / ఆంధ్రప్రదేశ్
Editor Desk
రూ.5,016 విరాళం అందించిన బడుగు నీరజ సదా
రామన్నపేటస్థానిక ప్రతినిధి
యాదాద్రి భువనగిరి జిల్లా రామన్నపేట మండల కేంద్రంలో ఉన్న చెన్నకేశవ ఆలయంలో నిర్వహించే ధనుర్మాస ఉత్సవ కార్యక్రమానికి బడుగు నీరజ సదా కుటుంబ సభ్యులు శాశ్వత నిధిగా రూ.5,016 విరాళాన్ని అందజేశారు. ఈ మొత్తాన్ని ఆలయ చైర్మన్ లవణం ఉపేందర్తో పాటు కమిటీ సభ్యులకు కుటుంబ సభ్యులు అధికారికంగా అందజేశారు.ధనుర్మాస ఉత్సవాలు భక్తిశ్రద్ధలతో ఘనంగా కొనసాగేందుకు భక్తుల సహకారం కీలకమని ఈ సందర్భంగా ఆలయ కమిటీ సభ్యులు తెలిపారు. దాతల సహకారంతోనే ఆలయ ఆధ్యాత్మిక కార్యక్రమాలు నిరంతరంగా నిర్వహించగలమని పేర్కొన్నారు.
ఈ కార్యక్రమానికి సహకరించిన దాత కుటుంబ సభ్యులకు ఆలయ కమిటీ తరఫున కృతజ్ఞతలు తెలిపారు.

















































పాఠకుల అభిప్రాయాలు
ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.
కామెంట్ను పోస్ట్ చేయండి