చదువుతోనే భవిష్యత్తు మార్గం–పాఠశాల సందర్శించిన
చదువుతోనే భవిష్యత్తు మార్గం–పాఠశాల సందర్శించిన
Sthanikam District Staff Reporter krishna
ఖేఢ్ ఎమ్మెల్యే డాక్టర్ పి సంజీవరెడ్డి
నారాయణఖేడ్ స్థానికం ప్రతినిధి కృష్ణ:నారాయణఖేడ్ నియోజకవర్గంలోని నారాయణఖేడ్ మున్సిపల్ పట్టణం నెహ్రూ నగర్లో ఉన్న ప్రాథమిక పాఠశాలను నారాయణఖేడ్ శాసనసభ్యులు డాక్టర్ పి సంజీవరెడ్డి సందర్శించారు. ఈ సందర్భంగా పాఠశాల ప్రాంగణం,తరగతి గదులు, విద్యార్థుల హాజరు,చదువుల స్థాయి గురించి వివరాలు తెలుసుకున్నారు.అనంతరం మూడవ తరగతి విద్యార్థిని వైష్ణవి,నాలుగవ తరగతి విద్యార్థి విఘ్నేష్లను పాఠ్య పుస్తకం చదవమని అడగగా వైష్ణవి స్పష్టంగా,చక్కగా చదివింది.దీనిపై సంతృప్తి వ్యక్తం చేసిన శాసనసభ్యులు వైష్ణవి, విఘ్నేష్లను మెచ్చుకొని అభినందించారు. విద్యార్థులు ఇలాగే మంచి చదువులు చదివి తల్లిదండ్రులకు,ఉపాధ్యాయులకు,నారాయణఖేడ్ నియోజకవర్గానికి మంచి పేరు తీసుకురావాలని సూచించారు. చదువుతో పాటు క్రమశిక్షణ, మంచి విలువలు అలవర్చుకోవాలని, భవిష్యత్తులో ఉన్నత స్థానాలకు చేరుకోవాలని దిశా నిర్దేశం చేశారు. అలాగే పాఠశాలలో విద్యార్థులకు అవసరమైన అన్ని మౌలిక సదుపాయాలు ఉండేలా చూడాలని, ముఖ్యంగా నాణ్యమైన భోజనం అందే విధంగా చర్యలు తీసుకోవాలని ఉపాధ్యాయులకు సూచించారు. ప్రభుత్వ పాఠశాలల అభివృద్ధికి ప్రభుత్వం ప్రాధాన్యత ఇస్తోందని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ మాజీ ఉపాధ్యక్షుడు దారం శంకర్ సెట్, పాఠశాల ఉపాధ్యాయురాలు మేఘవత్ లత, పండరీ రెడ్డి,రామకృష్ణ, మాజీ ఎంపీటీసీలు, మాజీ కౌన్సిలర్ మజీద్, సాయిలు పటేల్,శాతం దత్తు,షారు ఖాన్ తదితరులు పాల్గొన్నారు.

















































పాఠకుల అభిప్రాయాలు
ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.
కామెంట్ను పోస్ట్ చేయండి