Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
బాల్యవివాహాలు చట్టరీత్యా నేరం: సర్పంచ్ శాపాక లింగస్వామి కొత్తచెరువు లో జేసీ ప్రభాకర్ రెడ్డి పుట్టినరోజు వేడుకలు అక్రమ ఇసుక రవాణా టిప్పర్లను సీజ్ చేసిన అధికారులు హనుమకొండ సబ్‌రిజిస్ట్రార్ ఇంటిపై ఏసీబీ మెరుపుదాడులు.. రూ.10 కోట్లకు పైగా అక్రమాస్తుల వెలికితీత శ్రీ సత్యసాయి జిల్లాలో పర్యాటక రంగాభివృద్ధికి పటిష్ట చర్యలు జిల్లా కలెక్టర్ ఎ.శ్యామ్ ప్రసాద్ పార్థివ దేహానికి నివాళులర్పించిన రాష్ట్ర కార్యదర్శి సామకోటి స్ఫూర్తి పెండ్లి పోలీసింగ్ క్రికెట్ టోర్నమెంట్ ను ప్రారంభించిన జిల్లా ఎస్పీ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ హనుమంతుని పూజలో పాల్గొన్న జనసేన నాయకులు, మార్కెట్ కమిటీ చైర్మన్ పూల శివప్రసాద్. పెట్టుబడి సున్నా.. ఆదాయం మిన్న! కొత్త తరం బిజినెస్ ఐడియాలు! ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: May 26, 2026 07:43 PM

చదువుతోనే భవిష్యత్తు మార్గం–పాఠశాల సందర్శించిన

చదువుతోనే భవిష్యత్తు మార్గం–పాఠశాల సందర్శించిన

చదువుతోనే భవిష్యత్తు మార్గం–పాఠశాల సందర్శించిన
January 20, 2026 06:19 PM 45 Views
Reporter
స్థానికం ప్రతినిధి : Sub Editor
Krishna

ఖేఢ్ ఎమ్మెల్యే డాక్టర్ పి సంజీవరెడ్డి

నారాయణఖేడ్ స్థానికం ప్రతినిధి కృష్ణ:నారాయణఖేడ్ నియోజకవర్గంలోని నారాయణఖేడ్ మున్సిపల్ పట్టణం నెహ్రూ నగర్‌లో ఉన్న ప్రాథమిక పాఠశాలను నారాయణఖేడ్ శాసనసభ్యులు డాక్టర్ పి సంజీవరెడ్డి సందర్శించారు. ఈ సందర్భంగా పాఠశాల ప్రాంగణం,తరగతి గదులు, విద్యార్థుల హాజరు,చదువుల స్థాయి గురించి వివరాలు తెలుసుకున్నారు.అనంతరం మూడవ తరగతి విద్యార్థిని వైష్ణవి,నాలుగవ తరగతి విద్యార్థి విఘ్నేష్‌లను పాఠ్య పుస్తకం చదవమని అడగగా వైష్ణవి స్పష్టంగా,చక్కగా చదివింది.దీనిపై సంతృప్తి వ్యక్తం చేసిన శాసనసభ్యులు వైష్ణవి, విఘ్నేష్‌లను మెచ్చుకొని అభినందించారు. విద్యార్థులు ఇలాగే మంచి చదువులు చదివి తల్లిదండ్రులకు,ఉపాధ్యాయులకు,నారాయణఖేడ్ నియోజకవర్గానికి మంచి పేరు తీసుకురావాలని సూచించారు. చదువుతో పాటు క్రమశిక్షణ, మంచి విలువలు అలవర్చుకోవాలని, భవిష్యత్తులో ఉన్నత స్థానాలకు చేరుకోవాలని దిశా నిర్దేశం చేశారు. అలాగే పాఠశాలలో విద్యార్థులకు అవసరమైన అన్ని మౌలిక సదుపాయాలు ఉండేలా చూడాలని, ముఖ్యంగా నాణ్యమైన భోజనం అందే విధంగా చర్యలు తీసుకోవాలని ఉపాధ్యాయులకు సూచించారు. ప్రభుత్వ పాఠశాలల అభివృద్ధికి ప్రభుత్వం ప్రాధాన్యత ఇస్తోందని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ మాజీ ఉపాధ్యక్షుడు దారం శంకర్ సెట్, పాఠశాల ఉపాధ్యాయురాలు మేఘవత్ లత, పండరీ రెడ్డి,రామకృష్ణ, మాజీ ఎంపీటీసీలు, మాజీ కౌన్సిలర్ మజీద్, సాయిలు పటేల్,శాతం దత్తు,షారు ఖాన్ తదితరులు పాల్గొన్నారు.

మీ స్పందన? 1 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.


కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News