Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
నల్గొండలో మెడ్‌ప్లస్ మెడికల్ షాపు ప్రారంభం. ప్రజలకు నాణ్యమైన మందులు అందుబాటు ధరల్లో అందిస్తాం: నిర్వాహకులు నాణ్యత లేని భోజనం – అధికారుల నిర్లక్ష్యంపై కలెక్టర్‌కు వినతి పత్రం:- RSF,AISU విద్యార్థి సంఘాలు మహిళలు, చిన్నారుల భద్రతపై శక్తి టీమ్‌ల విస్తృత అవగాహన నేరం చేసిన వారు చట్టం నుంచి తప్పించుకోలేరు – జిల్లా ఎస్పీ ఎస్.సతీష్ కుమార్ రొద్దంలో ఘనంగా అనంతశక్తి సొసైటీ 27వ వార్షిక మహాసభ డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ కొత్తచెరువు లో జేసీ ప్రభాకర్ రెడ్డి పుట్టినరోజు వేడుకలు స్ఫూర్తి పెండ్లి పోలీసింగ్ క్రికెట్ టోర్నమెంట్ ను ప్రారంభించిన జిల్లా ఎస్పీ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ హనుమంతుని పూజలో పాల్గొన్న జనసేన నాయకులు, మార్కెట్ కమిటీ చైర్మన్ పూల శివప్రసాద్. ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: July 11, 2026 03:50 AM

చదువుతోనే భవిష్యత్తు మార్గం–పాఠశాల సందర్శించిన

చదువుతోనే భవిష్యత్తు మార్గం–పాఠశాల సందర్శించిన

చదువుతోనే భవిష్యత్తు మార్గం–పాఠశాల సందర్శించిన
January 20, 2026 06:19 PM 49 Views
Reporter
స్థానికం ప్రతినిధి : Sub Editor
Krishna

ఖేఢ్ ఎమ్మెల్యే డాక్టర్ పి సంజీవరెడ్డి

నారాయణఖేడ్ స్థానికం ప్రతినిధి కృష్ణ:నారాయణఖేడ్ నియోజకవర్గంలోని నారాయణఖేడ్ మున్సిపల్ పట్టణం నెహ్రూ నగర్‌లో ఉన్న ప్రాథమిక పాఠశాలను నారాయణఖేడ్ శాసనసభ్యులు డాక్టర్ పి సంజీవరెడ్డి సందర్శించారు. ఈ సందర్భంగా పాఠశాల ప్రాంగణం,తరగతి గదులు, విద్యార్థుల హాజరు,చదువుల స్థాయి గురించి వివరాలు తెలుసుకున్నారు.అనంతరం మూడవ తరగతి విద్యార్థిని వైష్ణవి,నాలుగవ తరగతి విద్యార్థి విఘ్నేష్‌లను పాఠ్య పుస్తకం చదవమని అడగగా వైష్ణవి స్పష్టంగా,చక్కగా చదివింది.దీనిపై సంతృప్తి వ్యక్తం చేసిన శాసనసభ్యులు వైష్ణవి, విఘ్నేష్‌లను మెచ్చుకొని అభినందించారు. విద్యార్థులు ఇలాగే మంచి చదువులు చదివి తల్లిదండ్రులకు,ఉపాధ్యాయులకు,నారాయణఖేడ్ నియోజకవర్గానికి మంచి పేరు తీసుకురావాలని సూచించారు. చదువుతో పాటు క్రమశిక్షణ, మంచి విలువలు అలవర్చుకోవాలని, భవిష్యత్తులో ఉన్నత స్థానాలకు చేరుకోవాలని దిశా నిర్దేశం చేశారు. అలాగే పాఠశాలలో విద్యార్థులకు అవసరమైన అన్ని మౌలిక సదుపాయాలు ఉండేలా చూడాలని, ముఖ్యంగా నాణ్యమైన భోజనం అందే విధంగా చర్యలు తీసుకోవాలని ఉపాధ్యాయులకు సూచించారు. ప్రభుత్వ పాఠశాలల అభివృద్ధికి ప్రభుత్వం ప్రాధాన్యత ఇస్తోందని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ మాజీ ఉపాధ్యక్షుడు దారం శంకర్ సెట్, పాఠశాల ఉపాధ్యాయురాలు మేఘవత్ లత, పండరీ రెడ్డి,రామకృష్ణ, మాజీ ఎంపీటీసీలు, మాజీ కౌన్సిలర్ మజీద్, సాయిలు పటేల్,శాతం దత్తు,షారు ఖాన్ తదితరులు పాల్గొన్నారు.

మీ స్పందన? 1 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.


కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News