చదువులో రాణిస్తున్న పేదింటి విద్యాకుసుమాలు
చదువులో రాణిస్తున్న పేదింటి విద్యాకుసుమాలు
Editor Desk
ఒకరు ఎంబీబీఎస్.. మరొకరు సీఏ
పేదింట పూసిన విద్యా మణులు
రామన్నపేట ప్రతినిధి
రామన్నపేట మండలంలోని బోగారం గ్రామానికి చెందిన గంట్ల రాంరెడ్డి–మంజుల దంపతుల కుమార్తెలు చదువులో అరుదైన ప్రతిభ చూపుతూ గ్రామానికి గర్వకారణంగా నిలిచారు. నిరుపేద వ్యవసాయ కుటుంబానికి చెందిన రాంరెడ్డి చేనేత వృత్తిని నమ్ముకొని జీవనం సాగిస్తూ, కష్టాలకు లొంగకుండా పిల్లల విద్యను జీవిత లక్ష్యంగా చేసుకున్నారు.
పెద్ద కుమార్తె నవ్యారెడ్డి మహబూబ్నగర్ ప్రభుత్వ మెడికల్ కళాశాలలో ఎంబీబీఎస్ పూర్తి చేసి, ప్రస్తుతం పీజీ సీటు సాధనలో ఉన్నారు. చిన్న కుమార్తె రూపారెడ్డి ఢిల్లీ విశ్వవిద్యాలయంలో సీఏ పూర్తి చేసి సోమవారం పట్టా అందుకున్నారు.
సాధారణ కుటుంబం నుంచి అసాధారణ విజయాలు సాధించిన ఈ సోదరీమణులు తల్లిదండ్రుల ఆశలను నిజం చేస్తూ, విద్యే నిజమైన సంపద అని మరోసారి నిరూపించారు. గ్రామీణ ప్రాంత విద్యార్థులకు వీరు ఆదర్శంగా నిలుస్తున్నారు.

















































పాఠకుల అభిప్రాయాలు
ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.
కామెంట్ను పోస్ట్ చేయండి