Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
జన్మదిన వేడుకలు రద్దు.. మృతుడి కుటుంబానికి రూ.8 లక్షల సాయం అధికారులారా.. మాదాహార్తిని తీర్చండి జనరల్ పవర్ ఆఫ్ అటార్నీ నమూనా మట్టి వాసనలో మన సంస్కృతి.. జానపద కళల్లో తరతరాల జీవన గాథ హెచ్ఆర్పీఎం సంస్థ ఉమెన్ సెల్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర జాయింట్ సెక్రటరీగా :- పండ్ల లక్ష్మీదేవి న్యాల్కల్‌లో భక్తిశ్రద్ధలతో నాగుల పంచమి వేడుకలు డి ఎం & హెచ్ ఓ కీ వినతి పత్రం డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ స్ఫూర్తి పెండ్లి పోలీసింగ్ క్రికెట్ టోర్నమెంట్ ను ప్రారంభించిన జిల్లా ఎస్పీ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: August 25, 2026 07:31 AM

చదువులో రాణిస్తున్న పేదింటి విద్యాకుసుమాలు

చదువులో రాణిస్తున్న పేదింటి విద్యాకుసుమాలు

చదువులో రాణిస్తున్న పేదింటి విద్యాకుసుమాలు
31-12-2025 167 Views
Reporter
స్థానికం ప్రధాన ప్రతినిధి : తెలంగాణ / ఆంధ్రప్రదేశ్
Editor Desk

ఒకరు ఎంబీబీఎస్.. మరొకరు సీఏ

పేదింట పూసిన విద్యా మణులు

రామన్నపేట ప్రతినిధి

రామన్నపేట మండలంలోని బోగారం గ్రామానికి చెందిన గంట్ల రాంరెడ్డి–మంజుల దంపతుల కుమార్తెలు చదువులో అరుదైన ప్రతిభ చూపుతూ గ్రామానికి గర్వకారణంగా నిలిచారు. నిరుపేద వ్యవసాయ కుటుంబానికి చెందిన రాంరెడ్డి చేనేత వృత్తిని నమ్ముకొని జీవనం సాగిస్తూ, కష్టాలకు లొంగకుండా పిల్లల విద్యను జీవిత లక్ష్యంగా చేసుకున్నారు.

పెద్ద కుమార్తె నవ్యారెడ్డి మహబూబ్‌నగర్ ప్రభుత్వ మెడికల్ కళాశాలలో ఎంబీబీఎస్ పూర్తి చేసి, ప్రస్తుతం పీజీ సీటు సాధనలో ఉన్నారు. చిన్న కుమార్తె రూపారెడ్డి ఢిల్లీ విశ్వవిద్యాలయంలో సీఏ పూర్తి చేసి సోమవారం పట్టా అందుకున్నారు.

సాధారణ కుటుంబం నుంచి అసాధారణ విజయాలు సాధించిన ఈ సోదరీమణులు తల్లిదండ్రుల ఆశలను నిజం చేస్తూ, విద్యే నిజమైన సంపద అని మరోసారి నిరూపించారు. గ్రామీణ ప్రాంత విద్యార్థులకు వీరు ఆదర్శంగా నిలుస్తున్నారు.

Sthanikam

చదువులో రాణిస్తున్న పేదింటి విద్యాకుసుమాలు

Article Image

ఒకరు ఎంబీబీఎస్.. మరొకరు సీఏ

పేదింట పూసిన విద్యా మణులు

రామన్నపేట ప్రతినిధి

రామన్నపేట మండలంలోని బోగారం గ్రామానికి చెందిన గంట్ల రాంరెడ్డి–మంజుల దంపతుల కుమార్తెలు చదువులో అరుదైన ప్రతిభ చూపుతూ గ్రామానికి గర్వకారణంగా నిలిచారు. నిరుపేద వ్యవసాయ కుటుంబానికి చెందిన రాంరెడ్డి చేనేత వృత్తిని నమ్ముకొని జీవనం సాగిస్తూ, కష్టాలకు లొంగకుండా పిల్లల విద్యను జీవిత లక్ష్యంగా చేసుకున్నారు.

పెద్ద కుమార్తె నవ్యారెడ్డి మహబూబ్‌నగర్ ప్రభుత్వ మెడికల్ కళాశాలలో ఎంబీబీఎస్ పూర్తి చేసి, ప్రస్తుతం పీజీ సీటు సాధనలో ఉన్నారు. చిన్న కుమార్తె రూపారెడ్డి ఢిల్లీ విశ్వవిద్యాలయంలో సీఏ పూర్తి చేసి సోమవారం పట్టా అందుకున్నారు.

సాధారణ కుటుంబం నుంచి అసాధారణ విజయాలు సాధించిన ఈ సోదరీమణులు తల్లిదండ్రుల ఆశలను నిజం చేస్తూ, విద్యే నిజమైన సంపద అని మరోసారి నిరూపించారు. గ్రామీణ ప్రాంత విద్యార్థులకు వీరు ఆదర్శంగా నిలుస్తున్నారు.

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.


కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News