Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
ఈసారి గోవధ వద్దు..! సామరస్యమే అసలైన ఖుర్బానీ కొత్తచెరువు లో జేసీ ప్రభాకర్ రెడ్డి పుట్టినరోజు వేడుకలు అక్రమ ఇసుక రవాణా టిప్పర్లను సీజ్ చేసిన అధికారులు హనుమకొండ సబ్‌రిజిస్ట్రార్ ఇంటిపై ఏసీబీ మెరుపుదాడులు.. రూ.10 కోట్లకు పైగా అక్రమాస్తుల వెలికితీత శ్రీ సత్యసాయి జిల్లాలో పర్యాటక రంగాభివృద్ధికి పటిష్ట చర్యలు జిల్లా కలెక్టర్ ఎ.శ్యామ్ ప్రసాద్ పార్థివ దేహానికి నివాళులర్పించిన రాష్ట్ర కార్యదర్శి సామకోటి స్ఫూర్తి పెండ్లి పోలీసింగ్ క్రికెట్ టోర్నమెంట్ ను ప్రారంభించిన జిల్లా ఎస్పీ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ హనుమంతుని పూజలో పాల్గొన్న జనసేన నాయకులు, మార్కెట్ కమిటీ చైర్మన్ పూల శివప్రసాద్. పెట్టుబడి సున్నా.. ఆదాయం మిన్న! కొత్త తరం బిజినెస్ ఐడియాలు! ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: May 26, 2026 09:42 PM

చదువులో రాణిస్తున్న పేదింటి విద్యాకుసుమాలు

చదువులో రాణిస్తున్న పేదింటి విద్యాకుసుమాలు

చదువులో రాణిస్తున్న పేదింటి విద్యాకుసుమాలు
December 31, 2025 08:31 AM 159 Views
Reporter
స్థానికం ప్రధాన ప్రతినిధి : తెలంగాణ / ఆంధ్రప్రదేశ్
Editor Desk

ఒకరు ఎంబీబీఎస్.. మరొకరు సీఏ

పేదింట పూసిన విద్యా మణులు

రామన్నపేట ప్రతినిధి

రామన్నపేట మండలంలోని బోగారం గ్రామానికి చెందిన గంట్ల రాంరెడ్డి–మంజుల దంపతుల కుమార్తెలు చదువులో అరుదైన ప్రతిభ చూపుతూ గ్రామానికి గర్వకారణంగా నిలిచారు. నిరుపేద వ్యవసాయ కుటుంబానికి చెందిన రాంరెడ్డి చేనేత వృత్తిని నమ్ముకొని జీవనం సాగిస్తూ, కష్టాలకు లొంగకుండా పిల్లల విద్యను జీవిత లక్ష్యంగా చేసుకున్నారు.

పెద్ద కుమార్తె నవ్యారెడ్డి మహబూబ్‌నగర్ ప్రభుత్వ మెడికల్ కళాశాలలో ఎంబీబీఎస్ పూర్తి చేసి, ప్రస్తుతం పీజీ సీటు సాధనలో ఉన్నారు. చిన్న కుమార్తె రూపారెడ్డి ఢిల్లీ విశ్వవిద్యాలయంలో సీఏ పూర్తి చేసి సోమవారం పట్టా అందుకున్నారు.

సాధారణ కుటుంబం నుంచి అసాధారణ విజయాలు సాధించిన ఈ సోదరీమణులు తల్లిదండ్రుల ఆశలను నిజం చేస్తూ, విద్యే నిజమైన సంపద అని మరోసారి నిరూపించారు. గ్రామీణ ప్రాంత విద్యార్థులకు వీరు ఆదర్శంగా నిలుస్తున్నారు.

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.


కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News