Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
విద్యా ప్రగతికి నిదర్శనంగా మహిళా డిగ్రీ కళాశాల సమానత్వానికి మార్గదర్శి పూలే – నేటికీ స్ఫూర్తి: ప్రధాని మోదీ సోమందేపల్లి యువతి సాహితకు పట్టా ప్రదానం పెట్టుబడి సున్నా.. ఆదాయం మిన్న! కొత్త తరం బిజినెస్ ఐడియాలు! ఈడెన్‌లో ముకుల్ 'తుపాన్'.. లక్నో సూపర్ విక్టరీ! ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు “ఆయన స్వతంత్ర మార్గంలో ప్రయాణిస్తే దేశవ్యాప్తంగా ఒక కొత్త యువ కేంద్రీకృత రాజకీయ శక్తిగా ఎదుగుతారు” “పూరీ ఆలయం కింద బయటపడ్డ పురాతన భూగర్భ నగరం: జగన్నాథుడి ‘మూలాలు’ ఇప్పుడు ప్రపంచం ముందుకు” “జర్మనీ హైడ్రోజన్ రైళ్లు: పర్యావరణానికి శుభసూచి కలిగించే భవిష్యత్తు టెక్నాలజీ” “64 గ్రాముల సృష్టిలో అంతరిక్ష చరిత్ర: కలాంసాట్ వెనుక రిఫత్ షారూక్ సంచలనం” ఓటీటీలోకి వాలెంటైన్స్ డే హిట్ 'పూకీ'.. కుర్రకారును ఫిదా చేసిన జెన్-జీ లవ్ స్టోరీ!
Sthanikam
PRINT TIME: April 11, 2026 06:37 AM

చదువులో రాణిస్తున్న పేదింటి విద్యాకుసుమాలు

చదువులో రాణిస్తున్న పేదింటి విద్యాకుసుమాలు

చదువులో రాణిస్తున్న పేదింటి విద్యాకుసుమాలు
December 31, 2025 08:31 AM 154 Views
Reporter
స్థానికం ప్రధాన ప్రతినిధి : తెలంగాణ / ఆంధ్రప్రదేశ్
Editor Desk

ఒకరు ఎంబీబీఎస్.. మరొకరు సీఏ

పేదింట పూసిన విద్యా మణులు

రామన్నపేట ప్రతినిధి

రామన్నపేట మండలంలోని బోగారం గ్రామానికి చెందిన గంట్ల రాంరెడ్డి–మంజుల దంపతుల కుమార్తెలు చదువులో అరుదైన ప్రతిభ చూపుతూ గ్రామానికి గర్వకారణంగా నిలిచారు. నిరుపేద వ్యవసాయ కుటుంబానికి చెందిన రాంరెడ్డి చేనేత వృత్తిని నమ్ముకొని జీవనం సాగిస్తూ, కష్టాలకు లొంగకుండా పిల్లల విద్యను జీవిత లక్ష్యంగా చేసుకున్నారు.

పెద్ద కుమార్తె నవ్యారెడ్డి మహబూబ్‌నగర్ ప్రభుత్వ మెడికల్ కళాశాలలో ఎంబీబీఎస్ పూర్తి చేసి, ప్రస్తుతం పీజీ సీటు సాధనలో ఉన్నారు. చిన్న కుమార్తె రూపారెడ్డి ఢిల్లీ విశ్వవిద్యాలయంలో సీఏ పూర్తి చేసి సోమవారం పట్టా అందుకున్నారు.

సాధారణ కుటుంబం నుంచి అసాధారణ విజయాలు సాధించిన ఈ సోదరీమణులు తల్లిదండ్రుల ఆశలను నిజం చేస్తూ, విద్యే నిజమైన సంపద అని మరోసారి నిరూపించారు. గ్రామీణ ప్రాంత విద్యార్థులకు వీరు ఆదర్శంగా నిలుస్తున్నారు.

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.


కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News