Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
నల్గొండలో మెడ్‌ప్లస్ మెడికల్ షాపు ప్రారంభం. ప్రజలకు నాణ్యమైన మందులు అందుబాటు ధరల్లో అందిస్తాం: నిర్వాహకులు నాణ్యత లేని భోజనం – అధికారుల నిర్లక్ష్యంపై కలెక్టర్‌కు వినతి పత్రం:- RSF,AISU విద్యార్థి సంఘాలు మహిళలు, చిన్నారుల భద్రతపై శక్తి టీమ్‌ల విస్తృత అవగాహన నేరం చేసిన వారు చట్టం నుంచి తప్పించుకోలేరు – జిల్లా ఎస్పీ ఎస్.సతీష్ కుమార్ రొద్దంలో ఘనంగా అనంతశక్తి సొసైటీ 27వ వార్షిక మహాసభ డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ కొత్తచెరువు లో జేసీ ప్రభాకర్ రెడ్డి పుట్టినరోజు వేడుకలు స్ఫూర్తి పెండ్లి పోలీసింగ్ క్రికెట్ టోర్నమెంట్ ను ప్రారంభించిన జిల్లా ఎస్పీ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ హనుమంతుని పూజలో పాల్గొన్న జనసేన నాయకులు, మార్కెట్ కమిటీ చైర్మన్ పూల శివప్రసాద్. ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: July 11, 2026 02:46 AM

బుర్కా ధరించి దొంగతనాలకు యత్నం..!

బుర్కా ధరించి దొంగతనాలకు యత్నం..!

బుర్కా ధరించి దొంగతనాలకు యత్నం..!
February 18, 2026 05:03 PM 185 Views
Reporter
స్థానికం ప్రతినిధి : Sub Editor
Biksham

42, 43 వార్డుల్లో అనుమానాస్పద వ్యక్తి సంచారం – సీసీ కెమెరాల ఏర్పాటు కోరిన కాలనీవాసులు

సూర్యాపేట:

పట్టణంలోని 42, 43వ వార్డుల్లో బుర్కా ధరించి తిరుగుతున్న అనుమానాస్పద వ్యక్తి దొంగతనాలకు యత్నిస్తున్నట్లు స్థానికులు ఆరోపిస్తున్నారు. మంగళవారం ఉదయం 8 గంటల నుంచి అంజలి పాఠశాల – నిర్మల ఆసుపత్రి చౌరస్తా పరిసర ప్రాంతాల్లో ఆ వ్యక్తి సంచరిస్తూ గల్లీలు గమనిస్తూ రెక్కీ నిర్వహించినట్లు కాలనీవాసులు తెలిపారు. ఉదయం 10 నుంచి 12 గంటల మధ్య జనసంచారం లేని వీధుల్లో తిరుగుతూ వృద్ధులు, మహిళలను లక్ష్యంగా చేసుకుంటున్నట్లు సమాచారం. రాత్రి సమయంలో 42వ వార్డులో ఓ వృద్ధురాలు ఇంటి ముందున్న అరుగు మీద కూర్చున్న వేళ ఆమె మెడలో ఉన్న పుస్తెల తాడు లాగేందుకు యత్నించినట్లు బాధితురాలు తెలిపింది. మెడపై చేయి వేసిన వెంటనే ఆమె గట్టిగా అరిచడంతో చుట్టుపక్కల వారు బయటకు రావడంతో ఆ వ్యక్తి అక్కడి నుంచి పారిపోయినట్లు తెలిపారు.

ఇలాంటి సంఘటనలు మరెక్కడైనా జరిగే ప్రమాదం ఉందని భయపడుతున్న 42, 43వ వార్డుల ప్రజలు వెంటనే చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు. రెండు వార్డుల్లో సీసీ కెమెరాలు ఏర్పాటు చేసి ప్రజలకు రక్షణ కల్పించాలని 42వ వార్డు కౌన్సిలర్ అంగిరేకుల నాగార్జున, 43వ వార్డు కౌన్సిలర్ బత్తుల ఝాన్సీ రమేష్ ద్వారా నూతనంగా పదవీ బాధ్యతలు స్వీకరించిన సూర్యాపేట మున్సిపల్ చైర్మన్ మొరిశెట్టి నివేదిత లక్షాధి దృష్టికి తీసుకెళ్లినట్లు తెలిపారు. పోలీస్ శాఖ అధికారులు స్పందించి అనుమానాస్పద వ్యక్తిని గుర్తించి కఠిన చర్యలు తీసుకోవాలని, మహిళలు, వృద్ధులు, పిల్లలకు రక్షణ కల్పించాలని వార్డు ప్రజలు విజ్ఞప్తి చేస్తున్నారు.

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.


కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News