Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
గుడి బండలా మారిన గ్యాస్ బండి… క్యూలో నిల్చొని అలసిపోయిన వినియోగదారులు పెట్టుబడి సున్నా.. ఆదాయం మిన్న! కొత్త తరం బిజినెస్ ఐడియాలు! ఈడెన్‌లో ముకుల్ 'తుపాన్'.. లక్నో సూపర్ విక్టరీ! ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు “ఆయన స్వతంత్ర మార్గంలో ప్రయాణిస్తే దేశవ్యాప్తంగా ఒక కొత్త యువ కేంద్రీకృత రాజకీయ శక్తిగా ఎదుగుతారు” “పూరీ ఆలయం కింద బయటపడ్డ పురాతన భూగర్భ నగరం: జగన్నాథుడి ‘మూలాలు’ ఇప్పుడు ప్రపంచం ముందుకు” రంగేపల్లిలో అవగాహన సదస్సు విజయవంతం రంగేపల్లిలో అవగాహన సదస్సు విజయవంతం “గురుకుల ఔట్‌సోర్సింగ్, గెస్ట్, కాంట్రాక్ట్ టీచర్లకు ఉద్యోగ భద్రత, 12 నెలల జీతాలు కల్పించాలి: సిఐటియు డిమాండ్” “జర్మనీ హైడ్రోజన్ రైళ్లు: పర్యావరణానికి శుభసూచి కలిగించే భవిష్యత్తు టెక్నాలజీ” “64 గ్రాముల సృష్టిలో అంతరిక్ష చరిత్ర: కలాంసాట్ వెనుక రిఫత్ షారూక్ సంచలనం” ఓటీటీలోకి వాలెంటైన్స్ డే హిట్ 'పూకీ'.. కుర్రకారును ఫిదా చేసిన జెన్-జీ లవ్ స్టోరీ!
Sthanikam
PRINT TIME: April 10, 2026 10:48 AM

బోటిమిది గూడెంలో అభివృద్ధి దిశగా అడుగు… డెవలప్మెంట్ కమిటీ చేతుల మీదుగా వీధి దీపాల పంపిణీ

బోటిమిది గూడెంలో అభివృద్ధి దిశగా అడుగు… డెవలప్మెంట్ కమిటీ చేతుల మీదుగా వీధి దీపాల పంపిణీ

బోటిమిది గూడెంలో అభివృద్ధి దిశగా అడుగు… డెవలప్మెంట్ కమిటీ చేతుల మీదుగా వీధి దీపాల పంపిణీ
February 15, 2026 04:26 PM 278 Views
Reporter
స్థానికం ప్రధాన ప్రతినిధి : తెలంగాణ / ఆంధ్రప్రదేశ్
Editor Desk

రామన్నపేట మండలంలోని మునిపంపుల గ్రామ పరిధి బోటిమిది గూడెంలో డెవలప్మెంట్ కమిటీ ఆధ్వర్యంలో గ్రామాభివృద్ధికి దోహదపడే పలు కార్యక్రమాలు నిర్వహించబడ్డాయి. గ్రామంలో 12 వీధి దీపాలు, 2 గడియారాలు, సాధారణ జ్ఞాన పుస్తకాలను గ్రామస్తులకు అందజేశారు.

గ్రామంలో మౌలిక వసతుల మెరుగుదలకు ఇది ఒక ముఖ్యమైన ముందడుగుగా భావించవచ్చు. ముఖ్యంగా వీధి దీపాల ఏర్పాటు వల్ల రాత్రి వేళల్లో భద్రతా పరిస్థితులు మెరుగుపడే అవకాశముంది. గడియారాల ఏర్పాటు సమయపాలనకు తోడ్పడనుండగా, సాధారణ జ్ఞాన పుస్తకాల పంపిణీ ద్వారా విద్యార్థుల్లో అవగాహన పెంపొందించాలన్న కమిటీ సంకల్పం స్పష్టమైంది.

ఈ సందర్భంగా కమిటీ అధ్యక్షులు ఏడవెల్లి నరేష్ మాట్లాడుతూ, బోటిమిది గూడెం అభివృద్ధి తమ ప్రాథమిక బాధ్యతగా భావిస్తున్నామని తెలిపారు. కమిటీ సభ్యులంతా సమిష్టిగా పనిచేస్తూ గ్రామానికి అవసరమైన వసతులు అందించేందుకు కృషి చేస్తామని పేర్కొన్నారు.

కార్యక్రమంలో గ్రామ సర్పంచ్ బొడ్డుపల్లి వేంకటేశం, ఉపసర్పంచ్ తాళ్ల క్రాంతి కుమార్, వార్డు సభ్యులు, మాజీ సర్పంచులు, కమిటీ పదాధికారులు మరియు పలువురు గ్రామస్తులు పాల్గొన్నారు.

మీ స్పందన? 1 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.


కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News