బోరంచ గ్రామంలో మానవతా సేవలు – పాకిర్ అమీన్నాకు వైద్య ఖర్చుల నిమిత్తం ఆర్థిక సహాయం
బోరంచ గ్రామంలో మానవతా సేవలు – పాకిర్ అమీన్నాకు వైద్య ఖర్చుల నిమిత్తం ఆర్థిక సహాయం
Krishna
నారాయణఖేడ్ నియోజకవర్గం మానూర్ మండల పరిధిలోని బోరంచ గ్రామానికి చెందిన పాకిర్ అమీన్నా గత కొన్ని రోజులుగా తీవ్ర అనారోగ్యంతో బాధపడుతూ వైద్య చికిత్స కోసం ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంటున్న విషయం జీఎంఆర్ ఫౌండేషన్ బృందం దృష్టికి వచ్చింది. ఈ విషయాన్ని శనివారం జీఎంఆర్ ఫౌండేషన్ చైర్మన్, భారత రాష్ట్ర సమితి పార్టీ నాయకుడు గుఱ్ఱపు మచ్చేందర్కు ఫౌండేషన్ బృందం తెలియజేయగా, ఆయన వెంటనే స్పందించి మానవతా దృక్పథంతో సహాయం అందించేందుకు ఆదేశించారు.గుఱ్ఱపు మచ్చేందర్ సూచనల మేరకు బోరంచ గ్రామానికి చెందిన భారత రాష్ట్ర సమితి పార్టీ నాయకులు సంగారెడ్డి, జీఎంఆర్ ఫౌండేషన్ బృందం కలిసి పాకిర్ అమీన్నాకు వైద్య ఖర్చుల నిమిత్తం ఆర్థిక సహాయాన్ని అందజేశారు.ఈ సందర్భంగా బాధిత కుటుంబానికి ధైర్యం చెప్పి, అవసరమైన సమయంలో ఎల్లప్పుడూ అండగా ఉంటామని తెలిపారు.ఈ ఆర్థిక సహాయం అందించినందుకు పాకిర్ అమీన్నా కుటుంబ సభ్యులు, గ్రామ జీఎంఆర్ ఫౌండేషన్ బృందం, భారత రాష్ట్ర సమితి పార్టీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు, గ్రామ పెద్దలు మరియు గ్రామస్థులు జీఎంఆర్ ఫౌండేషన్ చైర్మన్ గుఱ్ఱపు మచ్చేందర్కు ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేశారు. ఇలాంటి కష్టకాలంలో పేదలకు అండగా నిలవడం ఆయన సేవాభావానికి నిదర్శనమని వారు ప్రశంసించారు.ఈ కార్యక్రమంలో గ్రామానికి చెందిన జీఎంఆర్ ఫౌండేషన్ సభ్యులు రాములు, నర్సింహులు, సత్తయ్య, భాదర్గాం విఠల్, లింగం, రుద్రయ్య స్వామి, అశోక్, మోహన్, శ్రీశైలం, భూమన్న, మల్లేశం, సుబ్బయ్య తదితరులు పాల్గొన్నారు.

















































పాఠకుల అభిప్రాయాలు
ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.
కామెంట్ను పోస్ట్ చేయండి