Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
గుంజలూరులో ధాన్యం కొనుగోలు కేంద్రాల ప్రారంభం కంబాలపల్లి–బీదానిపల్లి మధ్య కొత్త తారు రోడ్డు పనులు పరిశీలన సమానత్వానికి మార్గదర్శి పూలే – నేటికీ స్ఫూర్తి: ప్రధాని మోదీ సోమందేపల్లి యువతి సాహితకు పట్టా ప్రదానం పెట్టుబడి సున్నా.. ఆదాయం మిన్న! కొత్త తరం బిజినెస్ ఐడియాలు! ఈడెన్‌లో ముకుల్ 'తుపాన్'.. లక్నో సూపర్ విక్టరీ! ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు “ఆయన స్వతంత్ర మార్గంలో ప్రయాణిస్తే దేశవ్యాప్తంగా ఒక కొత్త యువ కేంద్రీకృత రాజకీయ శక్తిగా ఎదుగుతారు” “పూరీ ఆలయం కింద బయటపడ్డ పురాతన భూగర్భ నగరం: జగన్నాథుడి ‘మూలాలు’ ఇప్పుడు ప్రపంచం ముందుకు” “జర్మనీ హైడ్రోజన్ రైళ్లు: పర్యావరణానికి శుభసూచి కలిగించే భవిష్యత్తు టెక్నాలజీ” ఓటీటీలోకి వాలెంటైన్స్ డే హిట్ 'పూకీ'.. కుర్రకారును ఫిదా చేసిన జెన్-జీ లవ్ స్టోరీ!
Sthanikam
PRINT TIME: April 11, 2026 04:49 PM

బోరంచ గ్రామ పాపమ్మ గడ్డ కాలనీవాసులకు రేషన్ సౌకర్యం

బోరంచ గ్రామ పాపమ్మ గడ్డ కాలనీవాసులకు రేషన్ సౌకర్యం

బోరంచ గ్రామ పాపమ్మ గడ్డ కాలనీవాసులకు రేషన్ సౌకర్యం
February 06, 2026 08:47 PM 270 Views
Reporter
స్థానికం ప్రతినిధి : Sub Editor
Krishna

నారాయణఖేడ్ నియోజకవర్గంలోని మానూర్ మండల పరిధిలోని బోరంచ గ్రామంలో గత కొన్ని నెలలుగా రేషన్ కార్డు లబ్ధిదారులు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. గ్రామంలోని పాత ఊరు నుండి సుమారు రెండు కిలోమీటర్ల దూరంలో “పాపమ్మ గడ్డ” అనే కొత్త కాలనీ ఏర్పడటంతో, అక్కడ నివసిస్తున్న పేద కుటుంబాలు రేషన్ సరుకుల కోసం పాత ఊరు వరకు వెళ్లి తీసుకురావాల్సి వస్తోంది. ఈ సమస్య వృద్ధులు, మహిళలు, కూలీలకు తీవ్ర ఇబ్బందిగా మారింది.ఈ పరిస్థితిని గమనించిన గ్రామ సర్పంచ్, ఉపసర్పంచ్, వార్డు సభ్యులు కలిసి నారాయణఖేడ్ నియోజకవర్గ ఎమ్మెల్యే డాక్టర్ పి సంజీవరెడ్డి దృష్టికి తీసుకువెళ్లారు. ప్రజల సమస్యను విన్న వెంటనే ఎమ్మెల్యే స్పందించి సంబంధిత అధికారులు మరియు గ్రామ రేషన్ డీలర్‌తో మాట్లాడి తక్షణమే పరిష్కార చర్యలు చేపట్టారు.ఎమ్మెల్యే డాక్టర్ పి సంజీవరెడ్డి ఆదేశాల మేరకు శుక్రవారం నూతన పాపమ్మ గడ్డ కాలనీలోనే రేషన్ బియ్యం పంపిణీ కార్యక్రమాన్ని ప్రారంభించారు.కాలనీలో ఏర్పాటు చేసిన భవనంలో గ్రామ సర్పంచ్ పంచగామ బీరప్ప, ఉపసర్పంచ్ మొల్ల కరీం చేతుల మీదుగా రేషన్ బియ్యం పంపిణీ జరిగింది. దీంతో కాలనీ వాసులు ఆనందం వ్యక్తం చేశారు.ఈ కార్యక్రమంలో గ్రామ వార్డు సభ్యులు,గ్రామ పెద్దలు, గ్రామస్తులు,యువత,యువకులు తదితరులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. ప్రజల ఇబ్బందులను వెంటనే గుర్తించి పరిష్కారం చూపినందుకు ఎమ్మెల్యే డాక్టర్ పి సంజీవరెడ్డి కి గ్రామస్తులు కృతజ్ఞతలు తెలిపారు.ఈ నిర్ణయంతో పాపమ్మ గడ్డ కాలనీ ప్రజలకు ఇకపై రేషన్ సరుకుల కోసం దూరం వెళ్లాల్సిన అవసరం లేకుండా పోయింది.

మీ స్పందన? 2 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.


కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News