Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
లక్ష్య సాధనకు పట్టుదల అవసరం కంబాలపల్లి–బీదానిపల్లి మధ్య కొత్త తారు రోడ్డు పనులు పరిశీలన సమానత్వానికి మార్గదర్శి పూలే – నేటికీ స్ఫూర్తి: ప్రధాని మోదీ సోమందేపల్లి యువతి సాహితకు పట్టా ప్రదానం పెట్టుబడి సున్నా.. ఆదాయం మిన్న! కొత్త తరం బిజినెస్ ఐడియాలు! ఈడెన్‌లో ముకుల్ 'తుపాన్'.. లక్నో సూపర్ విక్టరీ! ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు “ఆయన స్వతంత్ర మార్గంలో ప్రయాణిస్తే దేశవ్యాప్తంగా ఒక కొత్త యువ కేంద్రీకృత రాజకీయ శక్తిగా ఎదుగుతారు” “పూరీ ఆలయం కింద బయటపడ్డ పురాతన భూగర్భ నగరం: జగన్నాథుడి ‘మూలాలు’ ఇప్పుడు ప్రపంచం ముందుకు” “జర్మనీ హైడ్రోజన్ రైళ్లు: పర్యావరణానికి శుభసూచి కలిగించే భవిష్యత్తు టెక్నాలజీ” ఓటీటీలోకి వాలెంటైన్స్ డే హిట్ 'పూకీ'.. కుర్రకారును ఫిదా చేసిన జెన్-జీ లవ్ స్టోరీ!
Sthanikam
PRINT TIME: April 11, 2026 03:22 PM

బోరంచ గ్రామంలో కల్వకుంట్ల చంద్రశేఖరరావు 72వ జన్మదిన వేడుకలు ఘనంగా

బోరంచ గ్రామంలో కల్వకుంట్ల చంద్రశేఖరరావు 72వ జన్మదిన వేడుకలు ఘనంగా

బోరంచ గ్రామంలో కల్వకుంట్ల చంద్రశేఖరరావు 72వ జన్మదిన వేడుకలు ఘనంగా
February 17, 2026 10:47 PM 168 Views
Reporter
స్థానికం ప్రతినిధి : Sub Editor
Krishna

నారాయణఖేడ్ నియోజకవర్గం మానూర్ మండలం పరిధిలోని బోరంచ గ్రామంలో మంగళవారం గ్రామానికి చెందిన జీఎంఆర్ ఫౌండేషన్ సభ్యులు మరియు భారత రాష్ట్ర సమితి నాయకులు సిందోల్ సంగారెడ్డి ఆధ్వర్యంలో గులాబీ దళపతి కల్వకుంట్ల చంద్రశేఖరరావు 72వ జన్మదిన వేడుకలను ఘనంగా నిర్వహించారు. గ్రామంలో ఉత్సాహభరిత వాతావరణంలో ఈ వేడుకలు జరగగా, పెద్ద సంఖ్యలో పార్టీ నాయకులు, కార్యకర్తలు, గ్రామ ప్రజలు పాల్గొని ఆనందాన్ని పంచుకున్నారు.ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా జీఎంఆర్ ఫౌండేషన్ అధ్యక్షుడు మరియు భారత రాష్ట్ర సమితి నాయకుడు గుర్రపు మచ్చేందర్ హాజరై జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు.వారి వెంట నారాయణఖేడ్ మండలం భారత రాష్ట్ర సమితి మాజీ అధ్యక్షుడు మరియు రుద్రారం మాజీ సర్పంచ్ ప్రభాకర్, కంగ్టి మండలం భారత రాష్ట్ర సమితి మాజీ అధ్యక్షుడు విశ్వనాథ్, కృష్ణాపూర్ మాజీ సర్పంచ్ కిష్టారెడ్డి పాల్గొన్నారు. నాయకుల సమక్షంలో కేక్ కోసి శుభాకాంక్షలు తెలియజేస్తూ కల్వకుంట్ల చంద్రశేఖరరావు దీర్ఘాయుష్షు, ఆయురారోగ్యాలతో ప్రజాసేవలో మరింత ఉన్నత శిఖరాలను అధిరోహించాలని ఆకాంక్షించారు.ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్ర సాధనలో కల్వకుంట్ల చంద్రశేఖరరావు చేసిన కృషిని స్మరించుకున్నారు.ప్రజల సంక్షేమం కోసం ప్రవేశపెట్టిన పథకాలు, రైతు సంక్షేమం, సామాజిక న్యాయం, గ్రామీణాభివృద్ధి దిశగా చేపట్టిన కార్యక్రమాలను ప్రస్తావిస్తూ ఆయన నాయకత్వం ప్రజల హృదయాల్లో చిరస్థాయిగా నిలిచిపోయిందన్నారు. గ్రామ అభివృద్ధి కోసం పార్టీ బలోపేతానికి ప్రతి కార్యకర్త కృషి చేయాలని పిలుపునిచ్చారు.ఈ కార్యక్రమంలో మోట్లకుంట నర్సింలు, ఉప సర్పంచ్ సునీల్, నారాయణఖేడ్ మున్సిపల్ భారత రాష్ట్ర సమితి నాయకుడు శ్రీకాంత్, చాకలి సత్తయ్య, పాలడుగు మానయ్య, పొట్టి శీనన్న, పాలడుగు అశోక్, చెట్టుకింద సిద్ధప్ప, రుద్రాయ స్వామి, పాలడుగు లక్ష్మయ్య, మైపాల్ రెడ్డి, శ్రీకాంత్ రెడ్డి, హన్మండ్లు, పలడుగు రాములు, చాకలి మైపాల్, పుట్టి లక్ష్మణ్, పుట్టి విట్టల్, పుట్టి రాజు, బుగుడాల మానేయ, దేవప్ప, జర్మి, సుదర్శన్, అబ్రహం, మోట్లకుంట లింగం, బాధల్గావ్ లింగం, ఎర్ర పోచయ్య, బుగుడాల కిష్టప్ప, చాకలి నర్సింలు, ఎర్ర నర్సింలు, బేగని మానయ్య, దేవనూరి మానెప్ప, గొల్ల పాపని గోపాల్, యూసుఫ్, ఇమ్రాన్, ఎర్ర మల్లేశం, చాకలి దత్తు, మాల్గొండ, చెట్టు కింద గోపి, బెల్లాపూర్ దత్తు, డోవూరి బీరప్ప, ఎర్ర శ్రీశైలం తదితరులు పాల్గొని వేడుకలను విజయవంతం చేశారు.గ్రామస్థులు సైతం పెద్ద ఎత్తున పాల్గొని ఉత్సాహంగా జన్మదిన వేడుకలను జరుపుకోవడం ద్వారా నాయకుడిపై తమ అభిమానాన్ని చాటుకున్నారు. కార్యక్రమం ఆనందోత్సాహాల మధ్య ముగిసింది.

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.


కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News