బోరంచ గ్రామంలో ఘనంగా గ్రామసభ నిర్వహణ
బోరంచ గ్రామంలో ఘనంగా గ్రామసభ నిర్వహణ
Krishna
నారాయణఖేడ్ నియోజకవర్గంలో మానూర్ మండలం బోరంచ గ్రామంలో ప్రజా పాలన – ప్రగతి ప్రణాళిక కార్యక్రమం భాగంగా సర్పంచ్ బీరప్ప అధ్యక్షతన గ్రామసభ ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా గ్రామ అభివృద్ధి, ప్రజల సమస్యల పరిష్కారం మరియు ప్రభుత్వ సంక్షేమ పథకాల అమలుపై అధికారులు గ్రామస్థులతో నేరుగా మాట్లాడి వారి అభిప్రాయాలు, సూచనలు తెలుసుకున్నారు. గ్రామసభలో తాగునీరు, రహదారులు, డ్రైనేజీ, విద్యుత్, విద్య, వైద్య సదుపాయాలు, పింఛన్లు, గృహాల నిర్మాణం వంటి కీలక సమస్యలను ప్రజలు అధికారుల దృష్టికి తీసుకువచ్చారు.ముఖ్యంగా గ్రామాల్లో మౌలిక వసతుల అభివృద్ధిపై ప్రత్యేక దృష్టి సారించాలని గ్రామస్థులు కోరారు. ఈ సందర్భంగా అధికారులు మాట్లాడుతూ.. గ్రామసభలో వచ్చిన ప్రతి సమస్యను నమోదు చేసి సంబంధిత శాఖలకు పంపించి పరిష్కారం కోసం చర్యలు తీసుకుంటామని తెలిపారు. అలాగే ప్రభుత్వం అమలు చేస్తున్న పథకాలు ప్రతి అర్హుడికి చేరేలా కృషి చేస్తామని హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో స్పెషల్ ఆఫీసర్ రాము,సర్పంచ్ పంచగామ బీరప్ప, ఉప సర్పంచ్ మొల్ల కరిమ్, సెక్రటరీ సంతోష్,పాలకవర్గ సభ్యులు, యువకులు మరియు గ్రామస్థులు పాల్గొన్నారు.
















































పాఠకుల అభిప్రాయాలు
ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.
కామెంట్ను పోస్ట్ చేయండి