Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
వెలిమినేడులో వైభవంగా బోనాల పండుగ “ఒక ఛాన్స్‌ ఉంది.. మాట్లాడి పరిష్కరించుకోండి” రూ.30 వేల లంచం.. రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుబడితే ఇంట్లో రూ.4.27 కోట్ల కట్టలు! శతాబ్దపు గణిత చిక్కుముడికి తెర.. పవన విద్యుత్‌కు కొత్త దిశ జనరల్ పవర్ ఆఫ్ అటార్నీ నమూనా న్యాల్కల్‌లో భక్తిశ్రద్ధలతో నాగుల పంచమి వేడుకలు డి ఎం & హెచ్ ఓ కీ వినతి పత్రం డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ స్ఫూర్తి పెండ్లి పోలీసింగ్ క్రికెట్ టోర్నమెంట్ ను ప్రారంభించిన జిల్లా ఎస్పీ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: August 31, 2026 11:20 AM

బోరంచ గ్రామంలో ఘనంగా గ్రామసభ నిర్వహణ

బోరంచ గ్రామంలో ఘనంగా గ్రామసభ నిర్వహణ

బోరంచ గ్రామంలో ఘనంగా గ్రామసభ నిర్వహణ
02-04-2026 187 Views
Reporter
స్థానికం ప్రతినిధి : Sub Editor
Krishna

నారాయణఖేడ్ నియోజకవర్గంలో మానూర్ మండలం బోరంచ గ్రామంలో ప్రజా పాలన – ప్రగతి ప్రణాళిక కార్యక్రమం భాగంగా సర్పంచ్ బీరప్ప అధ్యక్షతన గ్రామసభ ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా గ్రామ అభివృద్ధి, ప్రజల సమస్యల పరిష్కారం మరియు ప్రభుత్వ సంక్షేమ పథకాల అమలుపై అధికారులు గ్రామస్థులతో నేరుగా మాట్లాడి వారి అభిప్రాయాలు, సూచనలు తెలుసుకున్నారు. గ్రామసభలో తాగునీరు, రహదారులు, డ్రైనేజీ, విద్యుత్, విద్య, వైద్య సదుపాయాలు, పింఛన్లు, గృహాల నిర్మాణం వంటి కీలక సమస్యలను ప్రజలు అధికారుల దృష్టికి తీసుకువచ్చారు.ముఖ్యంగా గ్రామాల్లో మౌలిక వసతుల అభివృద్ధిపై ప్రత్యేక దృష్టి సారించాలని గ్రామస్థులు కోరారు. ఈ సందర్భంగా అధికారులు మాట్లాడుతూ.. గ్రామసభలో వచ్చిన ప్రతి సమస్యను నమోదు చేసి సంబంధిత శాఖలకు పంపించి పరిష్కారం కోసం చర్యలు తీసుకుంటామని తెలిపారు. అలాగే ప్రభుత్వం అమలు చేస్తున్న పథకాలు ప్రతి అర్హుడికి చేరేలా కృషి చేస్తామని హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో స్పెషల్ ఆఫీసర్ రాము,సర్పంచ్ పంచగామ బీరప్ప, ఉప సర్పంచ్ మొల్ల కరిమ్, సెక్రటరీ సంతోష్,పాలకవర్గ సభ్యులు, యువకులు మరియు గ్రామస్థులు పాల్గొన్నారు.

Sthanikam

బోరంచ గ్రామంలో ఘనంగా గ్రామసభ నిర్వహణ

Article Image

నారాయణఖేడ్ నియోజకవర్గంలో మానూర్ మండలం బోరంచ గ్రామంలో ప్రజా పాలన – ప్రగతి ప్రణాళిక కార్యక్రమం భాగంగా సర్పంచ్ బీరప్ప అధ్యక్షతన గ్రామసభ ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా గ్రామ అభివృద్ధి, ప్రజల సమస్యల పరిష్కారం మరియు ప్రభుత్వ సంక్షేమ పథకాల అమలుపై అధికారులు గ్రామస్థులతో నేరుగా మాట్లాడి వారి అభిప్రాయాలు, సూచనలు తెలుసుకున్నారు. గ్రామసభలో తాగునీరు, రహదారులు, డ్రైనేజీ, విద్యుత్, విద్య, వైద్య సదుపాయాలు, పింఛన్లు, గృహాల నిర్మాణం వంటి కీలక సమస్యలను ప్రజలు అధికారుల దృష్టికి తీసుకువచ్చారు.ముఖ్యంగా గ్రామాల్లో మౌలిక వసతుల అభివృద్ధిపై ప్రత్యేక దృష్టి సారించాలని గ్రామస్థులు కోరారు. ఈ సందర్భంగా అధికారులు మాట్లాడుతూ.. గ్రామసభలో వచ్చిన ప్రతి సమస్యను నమోదు చేసి సంబంధిత శాఖలకు పంపించి పరిష్కారం కోసం చర్యలు తీసుకుంటామని తెలిపారు. అలాగే ప్రభుత్వం అమలు చేస్తున్న పథకాలు ప్రతి అర్హుడికి చేరేలా కృషి చేస్తామని హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో స్పెషల్ ఆఫీసర్ రాము,సర్పంచ్ పంచగామ బీరప్ప, ఉప సర్పంచ్ మొల్ల కరిమ్, సెక్రటరీ సంతోష్,పాలకవర్గ సభ్యులు, యువకులు మరియు గ్రామస్థులు పాల్గొన్నారు.

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.


కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News