బూతులు కాదు అభివృద్దె నా అజెండా వేముల వీరేశం
బూతులు కాదు అభివృద్దె నా అజెండా వేముల వీరేశం
Komidala Mahender reddy
చిరుమర్తి లింగయ్య వ్యాఖ్యలకు ఎమ్మెల్యే వేముల వీరేశం కౌంటర్
నకిరేకల్ నియోజకవర్గ రాజకీయాల్లో మరోసారి వేడి చర్చకు దారితీసే వ్యాఖ్యలు వెలువడ్డాయి. మాజీ ఎమ్మెల్యే చిరుమర్తి లింగయ్య ఇటీవల చేసిన వ్యాఖ్యలకు ప్రతిస్పందనగా, స్థానిక ఎమ్మెల్యే వేముల వీరేశం ప్రజావేదికపై ఘాటుగా స్పందించారు. చిట్యాల పట్టణ కేంద్రంలో నిర్వహించిన సమావేశంలో మాట్లాడిన ఎమ్మెల్యే వేముల వీరేశం, వ్యక్తిగత దూషణలు, ఆరోపణల రాజకీయాలకు తాను దూరమని స్పష్టం చేశారు. అభివృద్ధే తన లక్ష్యమని, అదే అంశంపై తాను మాట్లాడతానని వెల్లడించారు.
“నన్ను ఎంత తిట్టినా నాకు అభ్యంతరం లేదు. కానీ ఈ ఊరికి ఏం కావాలి? ఏం చేయాలి? అనే దానిపై చర్చ జరగాలి” అంటూ సూటిగా వ్యాఖ్యానించారు.
తాను బూతులు మాట్లాడే సంస్కారం లేని వ్యక్తినని పేర్కొంటూ,“వాడు–వీడు అనే భాష నాకు రాదు. నా తల్లిదండ్రులు నాకు విలువలు నేర్పారు. నన్ను కన్న ఊరు నాకు సంస్కారం నేర్పింది. ఆ విలువలతోనే నేను రాజకీయాలు చేస్తున్నాను” అని అన్నారు.
గ్రామ అభివృద్ధిపై ప్రశ్నలు సంధిస్తూ,“ఒక్క రోడ్డు అయినా వేయగలమా? పేదవాడికి ఇల్లు అయినా ఇప్పించగలమా? కనీస మౌలిక వసతులైనా కల్పించగలమా?” అని ప్రశ్నించారు.పేదల కోసం పనిచేయడంలో విమర్శలకైనా సిద్ధమేనని స్పష్టం చేస్తూ,
“ఒక పేదవాడికి ఇల్లు కట్టిస్తానంటే… వంద మాటలైనా నేను పడతా” అని వ్యాఖ్యానించారు.
మాజీ ఎమ్మెల్యే చిరుమర్తి లింగయ్య వ్యాఖ్యలకు కౌంటర్గా వచ్చిన ఈ వ్యాఖ్యలు నకిరేకల్ నియోజకవర్గంలో రాజకీయ చర్చను మరింత వేడెక్కిస్తున్నాయి. విమర్శలకంటే అభివృద్ధే ముఖ్యం అన్న సందేశాన్ని ఎమ్మెల్యే వేముల వీరేశం బలంగా వినిపించారని స్థానికులు అభిప్రాయపడుతున్నారు.
















































పాఠకుల అభిప్రాయాలు
ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.
కామెంట్ను పోస్ట్ చేయండి