Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
పెట్టుబడి సున్నా.. ఆదాయం మిన్న! కొత్త తరం బిజినెస్ ఐడియాలు! ఈడెన్‌లో ముకుల్ 'తుపాన్'.. లక్నో సూపర్ విక్టరీ! బస్టాండ్‌ వద్ద ‘అండర్‌ పాస్‌’ నిర్మించాలి ​- ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్‌రెడ్డికి కౌన్సిలర్‌ వినతి ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు “ఆయన స్వతంత్ర మార్గంలో ప్రయాణిస్తే దేశవ్యాప్తంగా ఒక కొత్త యువ కేంద్రీకృత రాజకీయ శక్తిగా ఎదుగుతారు” “పూరీ ఆలయం కింద బయటపడ్డ పురాతన భూగర్భ నగరం: జగన్నాథుడి ‘మూలాలు’ ఇప్పుడు ప్రపంచం ముందుకు” రంగేపల్లిలో అవగాహన సదస్సు విజయవంతం రంగేపల్లిలో అవగాహన సదస్సు విజయవంతం “గురుకుల ఔట్‌సోర్సింగ్, గెస్ట్, కాంట్రాక్ట్ టీచర్లకు ఉద్యోగ భద్రత, 12 నెలల జీతాలు కల్పించాలి: సిఐటియు డిమాండ్” “జర్మనీ హైడ్రోజన్ రైళ్లు: పర్యావరణానికి శుభసూచి కలిగించే భవిష్యత్తు టెక్నాలజీ” “64 గ్రాముల సృష్టిలో అంతరిక్ష చరిత్ర: కలాంసాట్ వెనుక రిఫత్ షారూక్ సంచలనం” ఓటీటీలోకి వాలెంటైన్స్ డే హిట్ 'పూకీ'.. కుర్రకారును ఫిదా చేసిన జెన్-జీ లవ్ స్టోరీ!
Sthanikam
PRINT TIME: April 10, 2026 04:41 AM

బూతులు కాదు అభివృద్దె నా అజెండా వేముల వీరేశం

బూతులు కాదు అభివృద్దె నా అజెండా వేముల వీరేశం

బూతులు కాదు అభివృద్దె నా అజెండా వేముల వీరేశం
February 05, 2026 08:28 PM 170 Views
Reporter
స్థానికం ప్రతినిధి : Sub Editor
Komidala Mahender reddy

చిరుమర్తి లింగయ్య వ్యాఖ్యలకు ఎమ్మెల్యే వేముల వీరేశం కౌంటర్

నకిరేకల్ నియోజకవర్గ రాజకీయాల్లో మరోసారి వేడి చర్చకు దారితీసే వ్యాఖ్యలు వెలువడ్డాయి. మాజీ ఎమ్మెల్యే చిరుమర్తి లింగయ్య ఇటీవల చేసిన వ్యాఖ్యలకు ప్రతిస్పందనగా, స్థానిక ఎమ్మెల్యే వేముల వీరేశం ప్రజావేదికపై ఘాటుగా స్పందించారు. చిట్యాల పట్టణ కేంద్రంలో నిర్వహించిన సమావేశంలో మాట్లాడిన ఎమ్మెల్యే వేముల వీరేశం, వ్యక్తిగత దూషణలు, ఆరోపణల రాజకీయాలకు తాను దూరమని స్పష్టం చేశారు. అభివృద్ధే తన లక్ష్యమని, అదే అంశంపై తాను మాట్లాడతానని వెల్లడించారు.

“నన్ను ఎంత తిట్టినా నాకు అభ్యంతరం లేదు. కానీ ఈ ఊరికి ఏం కావాలి? ఏం చేయాలి? అనే దానిపై చర్చ జరగాలి” అంటూ సూటిగా వ్యాఖ్యానించారు.

తాను బూతులు మాట్లాడే సంస్కారం లేని వ్యక్తినని పేర్కొంటూ,“వాడు–వీడు అనే భాష నాకు రాదు. నా తల్లిదండ్రులు నాకు విలువలు నేర్పారు. నన్ను కన్న ఊరు నాకు సంస్కారం నేర్పింది. ఆ విలువలతోనే నేను రాజకీయాలు చేస్తున్నాను” అని అన్నారు.

గ్రామ అభివృద్ధిపై ప్రశ్నలు సంధిస్తూ,“ఒక్క రోడ్డు అయినా వేయగలమా? పేదవాడికి ఇల్లు అయినా ఇప్పించగలమా? కనీస మౌలిక వసతులైనా కల్పించగలమా?” అని ప్రశ్నించారు.పేదల కోసం పనిచేయడంలో విమర్శలకైనా సిద్ధమేనని స్పష్టం చేస్తూ,

“ఒక పేదవాడికి ఇల్లు కట్టిస్తానంటే… వంద మాటలైనా నేను పడతా” అని వ్యాఖ్యానించారు.

మాజీ ఎమ్మెల్యే చిరుమర్తి లింగయ్య వ్యాఖ్యలకు కౌంటర్‌గా వచ్చిన ఈ వ్యాఖ్యలు నకిరేకల్ నియోజకవర్గంలో రాజకీయ చర్చను మరింత వేడెక్కిస్తున్నాయి. విమర్శలకంటే అభివృద్ధే ముఖ్యం అన్న సందేశాన్ని ఎమ్మెల్యే వేముల వీరేశం బలంగా వినిపించారని స్థానికులు అభిప్రాయపడుతున్నారు.


మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.


కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News