Sthanikam - Truth Matters
Logo
Sthanikam
PRINT TIME: February 24, 2026 09:00 PM

బొడ్రాయి పునర్ ప్రతిష్టకు నా వంతు కృషి చేస్తా

బొడ్రాయి పునర్ ప్రతిష్టకు నా వంతు కృషి చేస్తా

బొడ్రాయి పునర్ ప్రతిష్టకు నా వంతు కృషి చేస్తా
February 24, 2026 06:52 PM 38 Views
Reporter
స్థానికం ప్రతినిధి : సూర్యాపేట జిల్లా స్టాఫ్ రిపోర్టర్
Biksham Goud

పట్టణ ప్రజలతో సంప్రదించి నిర్ణయం – మున్సిపల్ ఛైర్‌పర్సన్ మొరిశెట్టి నివేదిత లక్ష్యాది

సూర్యాపేట పట్టణంలో నూతన బొడ్రాయి పునర్ ప్రతిష్ట కోసం తన వంతు కృషి చేస్తానని మున్సిపల్ ఛైర్‌పర్సన్ మొరిశెట్టి నివేదిత లక్ష్యాది తెలిపారు. మంగళవారం బొడ్రా బజార్‌లోని శ్రీ వేదాంత భజన మందిరంలో ప్రత్యేక పూజల్లో పాల్గొన్న అనంతరం, బిఆర్ఎస్ నాయకుడు షీలా శంకర్ విజ్ఞప్తి మేరకు మందిరం పక్కనే ఉన్న బొడ్రాయిని పరిశీలించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ పట్టణ ప్రజల భావోద్వేగాలు, భక్తి విశ్వాసాలను గౌరవించడం తన బాధ్యత అని అన్నారు. బొడ్రాయి పునర్ ప్రతిష్ట అంశంపై స్థానిక ప్రజలు, ఆధ్యాత్మిక ప్రముఖులు, నాయకులతో సంప్రదించి తగిన నిర్ణయం తీసుకుంటానని తెలిపారు. సంప్రదాయాలను పరిరక్షించడంలో మున్సిపాలిటీ సహకారం అందిస్తుందని స్పష్టం చేశారు. పట్టణ అభివృద్ధితో పాటు ఆధ్యాత్మిక కేంద్రాల సంరక్షణ కూడా సమానంగా అవసరమని పేర్కొన్నారు. ప్రజల అభిప్రాయాలను తెలుసుకుని అందరి సమ్మతితో ముందుకు సాగుతామని తెలిపారు.

ఈ కార్యక్రమంలో కౌన్సిలర్ వల్దాసు లక్ష్మి, ఆర్యవైశ్య నాయకులు రాచర్ల వెంకటేశ్వరరావు, రాచకొండ శ్రీనివాస్, సోమ సుమన్ తదితరులు పాల్గొన్నారు.

మీ స్పందన? 1 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.


కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News