Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
నల్గొండలో మెడ్‌ప్లస్ మెడికల్ షాపు ప్రారంభం. ప్రజలకు నాణ్యమైన మందులు అందుబాటు ధరల్లో అందిస్తాం: నిర్వాహకులు నాణ్యత లేని భోజనం – అధికారుల నిర్లక్ష్యంపై కలెక్టర్‌కు వినతి పత్రం:- RSF,AISU విద్యార్థి సంఘాలు మహిళలు, చిన్నారుల భద్రతపై శక్తి టీమ్‌ల విస్తృత అవగాహన నేరం చేసిన వారు చట్టం నుంచి తప్పించుకోలేరు – జిల్లా ఎస్పీ ఎస్.సతీష్ కుమార్ రొద్దంలో ఘనంగా అనంతశక్తి సొసైటీ 27వ వార్షిక మహాసభ డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ కొత్తచెరువు లో జేసీ ప్రభాకర్ రెడ్డి పుట్టినరోజు వేడుకలు స్ఫూర్తి పెండ్లి పోలీసింగ్ క్రికెట్ టోర్నమెంట్ ను ప్రారంభించిన జిల్లా ఎస్పీ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ హనుమంతుని పూజలో పాల్గొన్న జనసేన నాయకులు, మార్కెట్ కమిటీ చైర్మన్ పూల శివప్రసాద్. ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: July 11, 2026 04:04 AM

బొడ్రాయి పునర్ ప్రతిష్టకు నా వంతు కృషి చేస్తా

బొడ్రాయి పునర్ ప్రతిష్టకు నా వంతు కృషి చేస్తా

బొడ్రాయి పునర్ ప్రతిష్టకు నా వంతు కృషి చేస్తా
February 24, 2026 06:52 PM 125 Views
Reporter
స్థానికం ప్రతినిధి : Sub Editor
Biksham

పట్టణ ప్రజలతో సంప్రదించి నిర్ణయం – మున్సిపల్ ఛైర్‌పర్సన్ మొరిశెట్టి నివేదిత లక్ష్యాది

సూర్యాపేట పట్టణంలో నూతన బొడ్రాయి పునర్ ప్రతిష్ట కోసం తన వంతు కృషి చేస్తానని మున్సిపల్ ఛైర్‌పర్సన్ మొరిశెట్టి నివేదిత లక్ష్యాది తెలిపారు. మంగళవారం బొడ్రా బజార్‌లోని శ్రీ వేదాంత భజన మందిరంలో ప్రత్యేక పూజల్లో పాల్గొన్న అనంతరం, బిఆర్ఎస్ నాయకుడు షీలా శంకర్ విజ్ఞప్తి మేరకు మందిరం పక్కనే ఉన్న బొడ్రాయిని పరిశీలించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ పట్టణ ప్రజల భావోద్వేగాలు, భక్తి విశ్వాసాలను గౌరవించడం తన బాధ్యత అని అన్నారు. బొడ్రాయి పునర్ ప్రతిష్ట అంశంపై స్థానిక ప్రజలు, ఆధ్యాత్మిక ప్రముఖులు, నాయకులతో సంప్రదించి తగిన నిర్ణయం తీసుకుంటానని తెలిపారు. సంప్రదాయాలను పరిరక్షించడంలో మున్సిపాలిటీ సహకారం అందిస్తుందని స్పష్టం చేశారు. పట్టణ అభివృద్ధితో పాటు ఆధ్యాత్మిక కేంద్రాల సంరక్షణ కూడా సమానంగా అవసరమని పేర్కొన్నారు. ప్రజల అభిప్రాయాలను తెలుసుకుని అందరి సమ్మతితో ముందుకు సాగుతామని తెలిపారు.

ఈ కార్యక్రమంలో కౌన్సిలర్ వల్దాసు లక్ష్మి, ఆర్యవైశ్య నాయకులు రాచర్ల వెంకటేశ్వరరావు, రాచకొండ శ్రీనివాస్, సోమ సుమన్ తదితరులు పాల్గొన్నారు.

మీ స్పందన? 1 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.


కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News