కోటబొమ్మాలి: మాజీ పార్లమెంటు సభ్యులు, కలింగ ప్రజల ఆశాజ్యోతి స్వర్గీయ బొడ్డేపల్లి రాజగోపాల్రావు 34వ వర్ధంతి సందర్భంగా ఆదివారం కోటబొమ్మాలి మండల పరిషత్ కార్యాలయం ఎదుట ఉన్న ఆయన విగ్రహానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు.
ఈ కార్యక్రమంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ టెక్కలి నియోజకవర్గ ఇన్చార్జ్ పేరాడ తిలక్ పాల్గొని బొడ్డేపల్లి రాజగోపాల్రావు సేవలను స్మరించుకున్నారు.
కార్యక్రమంలో కోటబొమ్మాలి, సంతబొమ్మాలి మండలాలకు చెందిన వైఎస్ఆర్సీపీ నాయకులు రోణంకి ఉమామల్లయ్య, కెల్లి గోవిందరావు, నూక సత్యరాజు, కోత సతీష్, దుక్క రామకృష్ణ, సంజీవరావు తదితర ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు.

















































పాఠకుల అభిప్రాయాలు
ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.
కామెంట్ను పోస్ట్ చేయండి