PRINT TIME: May 26, 2026 12:57 PM
బోడ స్వామి ఎస్సీ సెల్ జిల్లా చైర్మన్గా రెండోసారి నియామ
బోడ స్వామి ఎస్సీ సెల్ జిల్లా చైర్మన్గా రెండోసారి నియామ
May 24, 2026 07:24 AM
25 Views
స్థానికం ప్రధాన ప్రతినిధి :
తెలంగాణ / ఆంధ్రప్రదేశ్
Editor Desk
:నల్గొండ జిల్లా కాంగ్రెస్ పార్టీ ఎస్సీ సెల్ చైర్మన్గా రెండోసారి నియమితులైన బోడ స్వామిని కాంగ్రెస్ నాయకులు ఘనంగా అభినందించారు. ఆదివారం నల్గొండ పట్టణంలోని మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి క్యాంపు కార్యాలయంలో ఎమ్మెల్సీ కేతావత్ శంకర్ నాయక్, పట్టణ కాంగ్రెస్ అధ్యక్షుడు గుమ్ముల మోహన్ రెడ్డి కలిసి బోడ స్వామికి బొకే అందజేసి శుభాకాంక్షలు తెలిపారు.
ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ పార్టీ పట్ల నిబద్ధతతో పనిచేస్తున్న బోడ స్వామికి మరోసారి బాధ్యతలు అప్పగించడం ఆనందంగా ఉందన్నారు. ఎస్సీ సెల్ బలోపేతానికి మరింత కృషి చేయాలని ఆకాంక్షించారు.
ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ నాయకులు, ఎస్సీ సెల్ నాయకులు కత్తుల కోటి, గాలి బ్రహ్మానంద రెడ్డి, పెరిక అంజయ్య, పెరిక చిట్టి హరి, కుడతాల నాగరాజు తదితరులు పాల్గొన్నారు.
















































పాఠకుల అభిప్రాయాలు
ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.
కామెంట్ను పోస్ట్ చేయండి