Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
వైఎస్సార్‌ తర్వాత వడ్డెరలకు అండగా నిలిచింది రేవంత్‌రెడ్డే మంత్రి సవితమ్మ ని కలిసిన పలువురు నాయకులు, కార్యకర్తలు రొద్దంలో ఘనంగా ఆంజనేయ స్వామి జయంతి వేడుకలు సోమందేపల్లి పోలీసులకు డే డ్రోన్ & నైట్ విజన్ డ్రోన్‌లపై ప్రత్యేక శిక్షణ కలెక్టర్ కార్యాలయంలో అల్లూరి సీతారామరాజు వర్ధంతి ఇష్టం లేదన్న వరుడు.. కాబోయే భార్య ఆత్మహత్య ప్రైవేట్ విద్యపై కఠిన నియంత్రణలు – చైనా మార్పులు ప్రపంచ దృష్టిని ఆకర్షిస్తున్నాయి ఉప్పల్‌లో 'రైజర్స్' హోరు.. చెన్నైపై హైదరాబాద్ ఘనవిజయం! పెట్టుబడి సున్నా.. ఆదాయం మిన్న! కొత్త తరం బిజినెస్ ఐడియాలు! ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు ఓటీటీలోకి వాలెంటైన్స్ డే హిట్ 'పూకీ'.. కుర్రకారును ఫిదా చేసిన జెన్-జీ లవ్ స్టోరీ!
Sthanikam
PRINT TIME: May 12, 2026 06:32 PM

బండి సంజయ్ కుమారుడిపై చర్యలు తీసుకోవాలి

బండి సంజయ్ కుమారుడిపై చర్యలు తీసుకోవాలి

బండి సంజయ్ కుమారుడిపై చర్యలు తీసుకోవాలి
May 12, 2026 05:17 PM 40 Views
Reporter
స్థానికం ప్రతినిధి : Sub Editor
K.RAVI

చౌటుప్పల్‌లో బీఆర్ఎస్ నేతల నిరసన.. దిష్టిబొమ్మ దహనం


యాదాద్రి భువనగిరి జిల్లా చౌటుప్పల్ మున్సిపల్ కేంద్రంలో కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ కుమార్ కుమారుడిపై నమోదైన కేసులో తక్షణ చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తూ బీఆర్ఎస్ నాయకులు వలిగొండ రోడ్డులో నిరసన చేపట్టారు. ఈ సందర్భంగా బండి సంజయ్ దిష్టిబొమ్మను ఊరేగించి దహనం చేశారు.అనంతరం నిర్వహించిన మీడియా సమావేశంలో మాజీ ఎమ్మెల్యే కూసుకుంట్ల ప్రభాకర్ రెడ్డి మాట్లాడుతూ, మైనర్ బాలిక కేసులో భగీరథపై పోక్సో చట్టం కింద కేసు నమోదైందని ఆరోపించారు. బాధిత కుటుంబం మూడు నెలల క్రితమే ఫిర్యాదు చేసినప్పటికీ సరైన చర్యలు తీసుకోలేదని విమర్శించారు. అధికార ప్రభావంతో కేసును ప్రభావితం చేసే ప్రయత్నాలు జరుగుతున్నాయని ఆరోపించారు.బండి సంజయ్ తన కుమారుడిని వెంటనే పోలీసులకు అప్పగించాలని, కేంద్ర మంత్రివర్గం నుంచి తప్పించాలని, ఎంపీ పదవికి రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు. రాష్ట్రంలో శాంతిభద్రతలు దెబ్బతిన్నాయని ఆరోపిస్తూ కాంగ్రెస్, బీజేపీ పార్టీలపై కూడా విమర్శలు చేశారు.బాధిత కుటుంబానికి బీఆర్ఎస్ పార్టీ అండగా ఉంటుందని తెలిపారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ కన్వీనర్ బొమ్మిరెడ్డి వెంకట్ రెడ్డి, పిఎసిఎస్ చైర్మన్ చింతల దామోదర్ రెడ్డి, మండల పార్టీ అధ్యక్షులు గిర్కటి నిరంజన్ గౌడ్, మండల ఉపాధ్యక్షులు చిన్నం బాలరాజు, మాజీ మార్కెట్ చైర్మన్ బొడ్డు శ్రీనివాస్ రెడ్డి, కౌన్సిలర్స్ కొయ్యడ శేఖర్, ఉదరి యాదయ్య, ఉడుగు మల్లేశం, తాడూరి పరమేష్, మునుకుంట్ల సత్యనారాయణ, ఢిల్లీ శంకర్ రెడ్డి, ఎండి అతర్ పాషా, ఎండి మున్నా, జమీర్, చుక్క యాదయ్య, చేవగోని మహేష్ గౌడ్, జాని యాదవ్, ఊదరి శ్యామ్, గుండెబోయిన వెంకటేశం యాదవ్, నాగరాజు, ఆరుట్ల లింగస్వామి, ఇమ్మడి ఈశ్వర్, ఊదరి రాజేష్,అత్తు, శివ ప్రసాద్ తదితరులు పాల్గొన్నారు.

మీ స్పందన? 1 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.


కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News