Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
పాఠశాల అభివృద్ధికి అందరూ సహకరించాలి. బోగారం తల్లిదండ్రుల సమావేశంలో సర్పంచ్ సాయికుమార్ గౌడ్ డిజిటల్‌ సభ్యత్వ నమోదుకు బీఆర్‌ఎస్‌ శ్రీకారం. ఎర్రవెల్లిలో కేసీఆర్‌తో కీలక సమావేశం సీఎం పర్యటనపై భద్రత ఏర్పాట్లు పరిశీలిస్తున్న సత్యసాయి జిల్లా అధికారులు వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ హనుమంతుని పూజలో పాల్గొన్న జనసేన నాయకులు, మార్కెట్ కమిటీ చైర్మన్ పూల శివప్రసాద్. సోమందేపల్లి పోలీసులకు డే డ్రోన్ & నైట్ విజన్ డ్రోన్‌లపై ప్రత్యేక శిక్షణ ఇష్టం లేదన్న వరుడు.. కాబోయే భార్య ఆత్మహత్య ప్రైవేట్ విద్యపై కఠిన నియంత్రణలు – చైనా మార్పులు ప్రపంచ దృష్టిని ఆకర్షిస్తున్నాయి ఉప్పల్‌లో 'రైజర్స్' హోరు.. చెన్నైపై హైదరాబాద్ ఘనవిజయం! పెట్టుబడి సున్నా.. ఆదాయం మిన్న! కొత్త తరం బిజినెస్ ఐడియాలు! ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: May 14, 2026 04:10 PM

బండి భగీరథుని వెంటనే అరెస్టు చేయాలి

బండి భగీరథుని వెంటనే అరెస్టు చేయాలి

బండి భగీరథుని వెంటనే అరెస్టు చేయాలి
May 14, 2026 02:33 PM 21 Views
Reporter
స్థానికం ప్రతినిధి : Sub Editor
K.RAVI

చౌటుప్పల్‌లో సీపీఎం నిరసన.. బండి సంజయ్ రాజీనామా చేయాలని డిమాండ్

కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ కుమారుడు బండి భగీరథపై నమోదైన ఫోక్సో కేసులో వెంటనే అరెస్టు చేయాలని డిమాండ్ చేస్తూ సీపీఎం పార్టీ చౌటుప్పల్ మున్సిపల్, మండల కమిటీల ఆధ్వర్యంలో గురువారం చౌటుప్పల్ బస్టాండ్ ఎదురుగా నిరసన కార్యక్రమం నిర్వహించారు.ఈ సందర్భంగా సీపీఎం జిల్లా కార్యదర్శివర్గ సభ్యులు బూర్గు కృష్ణారెడ్డి మాట్లాడుతూ, మైనర్ బాలికపై మానసిక, లైంగిక వేధింపులకు పాల్పడినట్లు కేసు నమోదైనా ఇప్పటివరకు చర్యలు తీసుకోకపోవడం వెనుక రాజకీయ ఒత్తిళ్లు ఉన్నాయనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయని ఆరోపించారు.కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ తన కుమారుడిపై వచ్చిన ఆరోపణలను కప్పిపుచ్చే ప్రయత్నం చేస్తున్నారని విమర్శించారు. “బేటీ బచావో” అని చెప్పే కేంద్ర ప్రభుత్వ పెద్దలు ఈ ఘటనపై స్పందించకపోవడం బాధాకరమన్నారు. ఫోక్సో కేసు నిందితుడిని వెంటనే అరెస్టు చేసి రిమాండ్‌కు తరలించాలని, బాధిత కుటుంబానికి న్యాయం చేయాలని డిమాండ్ చేశారు. అలాగే బండి సంజయ్ మంత్రి పదవికి రాజీనామా చేయాలని కోరారు.ఈ కార్యక్రమంలో సీపీఎం మున్సిపల్ కార్యదర్శి గోశిక కరుణాకర్, మండల కార్యదర్శి గంగాదేవి సైదులు, నాయకులు చీక సంజీవరెడ్డి, బత్తుల శ్రీశైలం గౌడ్, చీర్క అలివేలు, బోయ యాదయ్య, పొట్ట శ్రీనివాస్, ఆకుల ధర్మయ్య, కందగట్ల ఆనంద్, కొండే శ్రీశైలం, కొంతం శ్రీనివాస్ రెడ్డి, బత్తుల రామచంద్రం, బాలగోని బాలరాజు, ఫకీర్ పెంటారెడ్డి, జగ్గం అంజయ్య తదితరులు పాల్గొన్నారు.

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.


కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News