Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
నల్గొండలో మెడ్‌ప్లస్ మెడికల్ షాపు ప్రారంభం. ప్రజలకు నాణ్యమైన మందులు అందుబాటు ధరల్లో అందిస్తాం: నిర్వాహకులు నాణ్యత లేని భోజనం – అధికారుల నిర్లక్ష్యంపై కలెక్టర్‌కు వినతి పత్రం:- RSF,AISU విద్యార్థి సంఘాలు మహిళలు, చిన్నారుల భద్రతపై శక్తి టీమ్‌ల విస్తృత అవగాహన నేరం చేసిన వారు చట్టం నుంచి తప్పించుకోలేరు – జిల్లా ఎస్పీ ఎస్.సతీష్ కుమార్ రొద్దంలో ఘనంగా అనంతశక్తి సొసైటీ 27వ వార్షిక మహాసభ డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ కొత్తచెరువు లో జేసీ ప్రభాకర్ రెడ్డి పుట్టినరోజు వేడుకలు స్ఫూర్తి పెండ్లి పోలీసింగ్ క్రికెట్ టోర్నమెంట్ ను ప్రారంభించిన జిల్లా ఎస్పీ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ హనుమంతుని పూజలో పాల్గొన్న జనసేన నాయకులు, మార్కెట్ కమిటీ చైర్మన్ పూల శివప్రసాద్. ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: July 11, 2026 12:11 AM

బివీఆర్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో విద్యార్థులకు ప్రోత్సాహం

బివీఆర్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో విద్యార్థులకు ప్రోత్సాహం

బివీఆర్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో విద్యార్థులకు ప్రోత్సాహం
March 13, 2026 04:56 PM 118 Views
Reporter
స్థానికం ప్రతినిధి : Sub Editor
K.RAVI

ప్రతిభ కనబరిస్తే ఆర్థిక సహాయం:

బూరుగు భరత్ రెడ్డి

చౌటుప్పల్ మండలం కుంట్ల గూడెం గ్రామంలోని ప్రభుత్వ పాఠశాలలో పదవ తరగతి చదువుతున్న విద్యార్థిని, విద్యార్థులకు బివీఆర్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో పరీక్షల మెటీరియల్ పంపిణీ చేశారు. ఫౌండేషన్ చైర్మన్ బూరుగు భరత్ రెడ్డి విద్యార్థులకు పరీక్షలకు అవసరమైన మెటీరియల్‌ను అందజేశారు.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మార్చి 14వ తేదీన ప్రారంభమయ్యే పదవ తరగతి పరీక్షలకు హాజరుకానున్న విద్యార్థులకు శుభాకాంక్షలు తెలిపారు. ప్రతి విద్యార్థి ఉన్నత లక్ష్యాన్ని నిర్దేశించుకుని క్రమశిక్షణతో చదువుకుంటే జీవితంలో ఉన్నత స్థానాలకు చేరుకోవచ్చని పేర్కొన్నారు. పరీక్షల సమయంలో విద్యార్థులు ఒత్తిడికి గురికాకుండా ప్రశాంతంగా ఉండాలని, సమయాన్ని సక్రమంగా వినియోగించుకోవాలని సూచించారు.పదవ తరగతిలో మొదటి, రెండవ ర్యాంకులు సాధించిన విద్యార్థులకు ఆర్థిక సహాయం అందజేస్తానని హామీ ఇచ్చారు.ఈ కార్యక్రమంలో పాఠశాల ప్రధానోపాధ్యాయులు ఎలిజిబెత్, ఫౌండేషన్ ప్రతినిధులు కందగట్ల శివకుమార్, పాపగళ్ళ హరీష్, ఇత్తబోయిన శివకుమార్, కొండే మణికంఠ, చిన్నబోయిన చరణ్, కొండే శ్రీను, అధ్యాపకులు, విద్యార్థిని, విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు.

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.


కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News