బివీఆర్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో విద్యార్థులకు ప్రోత్సాహం
బివీఆర్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో విద్యార్థులకు ప్రోత్సాహం
K.RAVI
ప్రతిభ కనబరిస్తే ఆర్థిక సహాయం:
బూరుగు భరత్ రెడ్డి
చౌటుప్పల్ మండలం కుంట్ల గూడెం గ్రామంలోని ప్రభుత్వ పాఠశాలలో పదవ తరగతి చదువుతున్న విద్యార్థిని, విద్యార్థులకు బివీఆర్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో పరీక్షల మెటీరియల్ పంపిణీ చేశారు. ఫౌండేషన్ చైర్మన్ బూరుగు భరత్ రెడ్డి విద్యార్థులకు పరీక్షలకు అవసరమైన మెటీరియల్ను అందజేశారు.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మార్చి 14వ తేదీన ప్రారంభమయ్యే పదవ తరగతి పరీక్షలకు హాజరుకానున్న విద్యార్థులకు శుభాకాంక్షలు తెలిపారు. ప్రతి విద్యార్థి ఉన్నత లక్ష్యాన్ని నిర్దేశించుకుని క్రమశిక్షణతో చదువుకుంటే జీవితంలో ఉన్నత స్థానాలకు చేరుకోవచ్చని పేర్కొన్నారు. పరీక్షల సమయంలో విద్యార్థులు ఒత్తిడికి గురికాకుండా ప్రశాంతంగా ఉండాలని, సమయాన్ని సక్రమంగా వినియోగించుకోవాలని సూచించారు.పదవ తరగతిలో మొదటి, రెండవ ర్యాంకులు సాధించిన విద్యార్థులకు ఆర్థిక సహాయం అందజేస్తానని హామీ ఇచ్చారు.ఈ కార్యక్రమంలో పాఠశాల ప్రధానోపాధ్యాయులు ఎలిజిబెత్, ఫౌండేషన్ ప్రతినిధులు కందగట్ల శివకుమార్, పాపగళ్ళ హరీష్, ఇత్తబోయిన శివకుమార్, కొండే మణికంఠ, చిన్నబోయిన చరణ్, కొండే శ్రీను, అధ్యాపకులు, విద్యార్థిని, విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు.

















































పాఠకుల అభిప్రాయాలు
ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.
కామెంట్ను పోస్ట్ చేయండి