బిజెపి బిఆర్ఎస్ నేతల కాంగ్రెస్లో చేరిక
బిజెపి బిఆర్ఎస్ నేతల కాంగ్రెస్లో చేరిక
Biksham
సూర్యాపేట జిల్లా స్థానికం ప్రతినిధి బిక్షం
జిల్లా కాంగ్రెస్ పార్టీ కార్యాలయం రెడ్ హౌస్లో జరిగిన కార్యక్రమంలో బిజెపి, బిఆర్ఎస్ పార్టీలకు చెందిన పలువురు నాయకులు కాంగ్రెస్ పార్టీలో చేరారు. ఏఐసీసీ సభ్యుడు రాంరెడ్డి సర్వోత్తమ్ రెడ్డి, వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ కొప్పుల వేణారెడ్డి సమక్షంలో బిజెపి జిల్లా నాయకుడు వాజిద్ మియా, బిఆర్ఎస్ పార్టీ నాయకుడు సోమిశెట్టి లింగయ్య కాంగ్రెస్ కండువా కప్పుకున్నారు.వారితో పాటు మదర్ సాబ్, గోపిరెడ్డి శ్రీనివాస్ రెడ్డి, హజార్, నజీర్ షేక్, ఖమ్మంపాటి మురళి తదితరులు కాంగ్రెస్ పార్టీలో చేరారు. ఈ సందర్భంగా మాట్లాడిన నాయకులు రాబోయే మున్సిపల్ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థుల విజయానికి కృషి చేస్తామని తెలిపారు.ఈ కార్యక్రమంలో జిల్లా యువజన కాంగ్రెస్ మాజీ అధ్యక్షుడు, మాజీ మున్సిపల్ కౌన్సిలర్ బైరు శైలేందర్ గౌడ్, ఛివ్వేంల మండల పార్టీ అధ్యక్షుడు ధారావత్ వీరన్న నాయక్, డీసీసీ ఉపాధ్యక్షుడు ఖమ్రుద్దీన్, డీసీసీ ప్రధాన కార్యదర్శి పొలగాని బాలు గౌడ్, పట్టణ కాంగ్రెస్ నాయకులు మద్దెబోయిన శ్రీనివాస్, శ్రీ దండు మైసమ్మ దేవస్థానం చైర్మన్ తంగెళ్ల కరుణాకర్ రెడ్డి, పట్టణ కాంగ్రెస్ ఓబీసీ సెల్ అధ్యక్షుడు రావుల రాంబాబు, నాలుగో వార్డు కాంగ్రెస్ పార్టీ నాయకులు మాకట్ లాల్, నజీర్ తదితరులు పాల్గొన్నారు.

















































పాఠకుల అభిప్రాయాలు
ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.
కామెంట్ను పోస్ట్ చేయండి